Political News

అదానీ.. సెబీ చీఫ్ మీద హిండెన్ బర్గ్ తాజా బాంబ్

వీకెండ్ వేళ.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబ్ పేల్చటం.. శనివారం సోషల్ మీడియాలో తాము కీలక విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. మొదట వివరాల్ని వెల్లడించకుండా.. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని చెప్పిన ఆ సంస్థ ఆ తర్వాత ఆ వివరాల్ని వెల్లడించింది. తాజాగా పేల్చిన బాంబ్.. అదానీ మీదా.. సెబీ ఛీప్ మీదా కావటం షాకింగ్ గా మారింది.

సాక్ష్యాత్తు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురీ బోచ్ కు.. ఆమె భర్త ధవళ్ బోచ్ పైనా హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్ బర్గ్ వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • బెర్ముడా.. మారిషస్ లోని అదానీ గ్రూపు డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలు ఉన్నాయి.
  • ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు.
  • పెట్టుబడులకు భారత్ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. కానీ.. ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గ ధామంగా పేర్కొందిన దేశాల్లో.. అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ఆశ్చర్యకరం.
  • అదానీ ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫ్ భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈ అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది.
  • అదానీ.. విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేల్చేదేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది.

This post was last modified on August 11, 2024 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాలన మీద చంద్రబాబు పట్టు కోల్పోయారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…

27 mins ago

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

4 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

7 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

8 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

9 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

10 hours ago