Political News

అదానీ.. సెబీ చీఫ్ మీద హిండెన్ బర్గ్ తాజా బాంబ్

వీకెండ్ వేళ.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబ్ పేల్చటం.. శనివారం సోషల్ మీడియాలో తాము కీలక విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. మొదట వివరాల్ని వెల్లడించకుండా.. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని చెప్పిన ఆ సంస్థ ఆ తర్వాత ఆ వివరాల్ని వెల్లడించింది. తాజాగా పేల్చిన బాంబ్.. అదానీ మీదా.. సెబీ ఛీప్ మీదా కావటం షాకింగ్ గా మారింది.

సాక్ష్యాత్తు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురీ బోచ్ కు.. ఆమె భర్త ధవళ్ బోచ్ పైనా హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్ బర్గ్ వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • బెర్ముడా.. మారిషస్ లోని అదానీ గ్రూపు డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలు ఉన్నాయి.
  • ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు.
  • పెట్టుబడులకు భారత్ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. కానీ.. ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గ ధామంగా పేర్కొందిన దేశాల్లో.. అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ఆశ్చర్యకరం.
  • అదానీ ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫ్ భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈ అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది.
  • అదానీ.. విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేల్చేదేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది.
Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

5 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago