Political News

అదానీ.. సెబీ చీఫ్ మీద హిండెన్ బర్గ్ తాజా బాంబ్

వీకెండ్ వేళ.. హిండెన్ బర్గ్ రీసెర్చ్ మరోసారి బాంబ్ పేల్చటం.. శనివారం సోషల్ మీడియాలో తాము కీలక విషయాన్ని వెల్లడిస్తున్నట్లు ప్రకటించటం తెలిసిందే. మొదట వివరాల్ని వెల్లడించకుండా.. కాసేపట్లో వివరాలు ప్రకటిస్తామని చెప్పిన ఆ సంస్థ ఆ తర్వాత ఆ వివరాల్ని వెల్లడించింది. తాజాగా పేల్చిన బాంబ్.. అదానీ మీదా.. సెబీ ఛీప్ మీదా కావటం షాకింగ్ గా మారింది.

సాక్ష్యాత్తు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఛైర్ పర్సన్ మాధబీ పురీ బోచ్ కు.. ఆమె భర్త ధవళ్ బోచ్ పైనా హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. అదానీ ఆర్థిక అవకతవకలపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ పెద్దగా ఆసక్తి చూపటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. శనివారం రాత్రి విడుదల చేసిన తాజా నివేదికలో హిండెన్ బర్గ్ వెల్లడించిన అంశాలు ఇలా ఉన్నాయి.

  • బెర్ముడా.. మారిషస్ లోని అదానీ గ్రూపు డొల్ల కంపెనీల్లో మాధబీ దంపతులకు వాటాలు ఉన్నాయి.
  • ఆ కంపెనీల్లో వారిద్దరూ కోటి డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు.
  • పెట్టుబడులకు భారత్ లో ఎన్నో మ్యూచువల్ ఫండ్లు ఉన్నాయి. కానీ.. ఏరి కోరి పన్ను ఎగవేతదారుల స్వర్గ ధామంగా పేర్కొందిన దేశాల్లో.. అదీ అదానీలకు చెందిన డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం ఆశ్చర్యకరం.
  • అదానీ ఆర్థిక అవకతవకల్లో ఏకంగా సెబీ చీఫ్ భాగస్వామిగా ఉన్నారు. అందుకే ఈ అంశంపై లోతుగా విచారణ జరిపేందుకు సెబీ వెనకడుగు వేసింది.
  • అదానీ.. విదేశీ నిధుల మూలాలపై సెబీ విచారణ తేల్చేదేమీ లేదంటూ అప్పట్లో సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది.

This post was last modified on August 11, 2024 1:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమ్ముడితో హిట్టు కొడితే అన్నయ్యతో పక్కా

ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…

52 minutes ago

ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా సూర్యా

నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…

2 hours ago

ఇక్కడ మాత్రం శ్రీలీలపై రాశిదే పైచేయి

ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే…

3 hours ago

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

3 hours ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

4 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

5 hours ago