Political News

కాంగ్రెస్ లో ఫ్రెండ్స్ ఆప్ కాంగ్రెస్ యూఎస్ఎ కలకలం !

రాజకీయాల్లో అధికార పార్టీ మీద ప్రతిపక్షం, ప్రతిపక్షం మీద అధికార పార్టీ ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. కానీ అధికార పార్టీ మీద ఆ పార్టీకి చెందిన అభిమానులే ఆరోపణలు చేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయి ? తాజాగా రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా వివిధ కంపెనీలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల మీద ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యూఎస్ఎ నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాసిన బహిరంగలేఖ కలకలం రేపుతున్నది. 

ఈ మేరకు లేఖను అక్కడి ఎన్ఆర్ఐలు తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేయడం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద అనుమానాలను పెంచుతున్నది. రేవంత్ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి భాగస్వామిగా ఉన్న స్వచ్చ్ బయో తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఈ మేరకు రేవంత్ ఒప్పందం చేసుకున్నారు. కేవలం 15 రోజుల కింద ఏర్పడిన కంపెనీ ఎలా పెట్టుబడులు పెడుతుందని వారు ప్రశ్నించారు. అసలు ఆ కంపెనీకి కనీసం వెబ్ సైట్ కూడా లేదని ప్రశ్నించారు.

ఇక రేవంత్ మరో సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి భాగస్వామిగా  దాదాపు రెండు నెలల క్రితం ఏర్పాటయిన అర్బన్ ప్రిస్మ్ ఇన్ ఫ్రా మీద కూడా వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కంపెనీల మీద, ఒప్పందాల మీద ఒకసారి విచారణ చేయాలని వారు రాహుల్ గాంధీని కోరారు. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామక్రిష్ణారావులు ఈ ఒప్పందాలలో భాగస్వాములు కావడాన్ని తప్పుపట్టారు.

రేవంత్ అమెరికా పర్యటనలో కుదుర్చుకుంటున్న ఒప్పందాల మీద ఆరోపణల నేపథ్యంలో నేరుగా తొలిసారి పరిశ్రమల కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి రామక్రిష్ణారావులు ఇవన్ని పెట్టుబడులు కూడా నిజమైనవేనని, ఎలాంటి పొరపాట్లకు తావులేదని వీడియో ప్రకటనలు విడుదల చేశారు. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ సానుభూతిపరులుగా ఉన్నా ఎన్నారైలే రాహుల్ గాంధీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి. 

This post was last modified on August 12, 2024 6:55 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాలన మీద చంద్రబాబు పట్టు కోల్పోయారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…

4 mins ago

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

4 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

7 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

8 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

8 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

10 hours ago