తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నారైలకు చోటు దక్కనుందా? టీటీడీ బోర్డులో ఎన్నారైలను నియ మించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నాయకులు. ఎన్నికలకు ముందు ఎన్నారైలు తరలి వచ్చి పార్టీ కోసం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం బాగానే కష్టించారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. వీరు సాధారణ పదవులతో సంతృప్తి చెందే పరిస్థితి లేదు.
నిజానికి చిన్న చిన్న పదువుల, నామినెట్ పదవులు ఇచ్చినా.. వారికి ఆసక్తి లేదు. నలుగురు నుంచి ఐదు గురు వరకు కీలక ఎన్నారైలు.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు చెందిన ఇద్దరు మిత్రులు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన మాటను చంద్రబాబు కాదనలేరు. ఇక, మిగిలిన వారిలో కోమటి జయరాం వర్గీయులుగా ఉన్న ఇద్దరు కూడా లైన్లో ఉన్నారని సమాచారం.
జయరాం చెబితే చంద్రబాబు కూడా కాదనే పరిస్థితి లేదు. అదేవిధంగా.. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఓ కీలక ఎమ్మెల్యే సతీమణి కూడా ఈ రేసులో ఉన్నారన్నది టీడీపీ వర్గాలు చెబుతున్న మాట. పైకి పేరు చెప్పకపోయినా.. ఆమె పేరును చంద్రబాబు దాదాపు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం గా నలుగురు నుంచి ఐదుగురు ఎన్నారైలకు బోర్డులో సభ్యత్వం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే.. ఇలా ఎప్పుడూ ఎన్నారైలకు టీటీడీ బోర్డులో సభ్యత్వాలు ఇవ్వలేదు.
కానీ, ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన అగత్యం ఏర్పడింది. దీంతో ఆ నలుగురు ఐదుగురిని కూడా ఎక్స్ అఫిషి యో సభ్యులుగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలావుంటే.. సినీ రంగం నుంచి మురళీ మోహన్ కూడా బోర్డులో సభ్యుడు కానున్నట్టు సమాచారం.
ఆయన వాస్తవానికి చైర్మన్ పదవిని కోరుకు న్నా.. ఓ మీడియా అధినేత పేరు ముందుకు రావడంతో ఆయన వెనక్కి తగ్గారని తెలిసింది. త్వరలోనే బోర్డు చైర్మన్ సహా సభ్యులను నియమించనున్నారని, ఇదంతా కూడా.. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ముందే జరుగుతుందని అంచనా వేస్తున్నారు.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…