సమాజంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం తరఫున ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు రక్తదానం ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించేవి. ఇప్పుడు కూడా రక్త దానం చేసే ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలానే ఇప్పుడు అవయవ దానం చేసేవారికి ఏపీ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది.
అవయవాలు అవసరమైన వారు.. అవిలేక.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె వంటి వాటి కోసం.. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరికి బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి వాటిని తీసుకుని అమర్చుతున్న పరిస్థితిని తరచుగా మనం గమనిస్తున్నాం. అయితే.. ఇది అధికారికం కాదు. సదరు వ్యక్తి ఇష్టాను సారం మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అధికారికం చేయలేదు. అయితే.. ప్రోత్సహించేందుకు మాత్రం సరికొత్త పంథాను ఎంచుకుంది.
విధి వశాత్తూ.. మరణిస్తూ.. అవయవాలను దానం చేసిన వారి మృత దేహాలకు సముచిత గౌరవంతో సర్కా రు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రబుత్వం నిర్ణయించింది. అంటే.. అవయవ దాతల అంతిమ సంస్కారాలను ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించి, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా…. వారికి పునర్జన్మ కల్పించనున్నారు.
ఇలా ఇచ్చే కార్యక్రమానికి ‘జీవన్దాన్’ గా పేరు పెట్టారు. అవయవ దాతల అంతిమ సంస్కారాలను సబ్ కలెక్టర్ స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో.. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అదేవిధంగా అవయవ దానం చేసిన వ్యక్తి కుటుంబానికి తక్షణ అవసరాల కోసం రూ.10000లను ఇస్తారు. అదేవిధంగా రూ.1000కి మించకుండా..ఇతర ఖర్చులు చేసేందుకు అధికారులకు కూడా సర్కారు అనుమతి ఇచ్చింది. మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని తర్వాత కాలంలో గౌరవించడంతోపాటు శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 8, 2024 7:05 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…