Political News

అవ‌య‌వదానం చేసే వారికి… ఏపీ స‌ర్కారు గౌర‌వ వీడ్కోలు!

స‌మాజంలో అవ‌య‌వదానాన్ని ప్రోత్స‌హించేందుకు ఏపీ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. దేశంలోనే తొలిసారిగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక వినూత్న కార్య‌క్ర‌మాన్ని తీసుకువ‌చ్చేందుకు నిర్ణ‌యించింది. ఒక‌ప్పుడు ర‌క్త‌దానం ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వాలు ప్రోత్సాహ‌కాలు అందించేవి. ఇప్పుడు కూడా ర‌క్త దానం చేసే ఉద్యోగుల‌కు ఒక పూట సెలవు ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఇలానే ఇప్పుడు అవ‌య‌వ దానం చేసేవారికి ఏపీ ప్ర‌భుత్వం స‌ముచిత గౌర‌వం ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

అవ‌య‌వాలు అవ‌స‌ర‌మైన వారు.. అవిలేక‌.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప‌రిస్థితి ఉంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె వంటి వాటి కోసం.. దేశ‌వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వీరికి బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి వాటిని తీసుకుని అమ‌ర్చుతున్న ప‌రిస్థితిని త‌ర‌చుగా మ‌నం గ‌మ‌నిస్తున్నాం. అయితే.. ఇది అధికారికం కాదు. స‌ద‌రు వ్య‌క్తి ఇష్టాను సారం మాత్ర‌మే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం కూడా అధికారికం చేయ‌లేదు. అయితే.. ప్రోత్స‌హించేందుకు మాత్రం స‌రికొత్త పంథాను ఎంచుకుంది.

విధి వ‌శాత్తూ.. మ‌ర‌ణిస్తూ.. అవ‌య‌వాల‌ను దానం చేసిన వారి మృత దేహాల‌కు స‌ముచిత గౌర‌వంతో స‌ర్కా రు లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేలా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్ర‌బుత్వం నిర్ణ‌యించింది. అంటే.. అవయవ దాతల అంతిమ సంస్కారాలను ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వ‌హించ‌నున్నారు. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించి, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసర‌మైన వారికి అమర్చడం ద్వారా…. వారికి పునర్జన్మ క‌ల్పించ‌నున్నారు.

ఇలా ఇచ్చే కార్య‌క్ర‌మానికి ‘జీవన్‌దాన్’ గా పేరు పెట్టారు. అవయవ దాతల అంతిమ సంస్కారాలను స‌బ్ క‌లెక్ట‌ర్ స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో.. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించ‌నున్నారు. అదేవిధంగా అవ‌య‌వ దానం చేసిన వ్య‌క్తి కుటుంబానికి త‌క్ష‌ణ అవ‌స‌రాల కోసం రూ.10000ల‌ను ఇస్తారు. అదేవిధంగా రూ.1000కి మించ‌కుండా..ఇత‌ర ఖ‌ర్చులు చేసేందుకు అధికారుల‌కు కూడా స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. మృతి చెందిన వ్య‌క్తి కుటుంబాన్ని త‌ర్వాత కాలంలో గౌర‌వించ‌డంతోపాటు శాలువా, జ్ఞాపిక ఇచ్చి స‌త్క‌రిస్తారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

This post was last modified on August 8, 2024 7:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago