సమాజంలో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం తరఫున ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు రక్తదానం ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించేవి. ఇప్పుడు కూడా రక్త దానం చేసే ఉద్యోగులకు ఒక పూట సెలవు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇలానే ఇప్పుడు అవయవ దానం చేసేవారికి ఏపీ ప్రభుత్వం సముచిత గౌరవం ఇవ్వాలని నిర్ణయించింది.
అవయవాలు అవసరమైన వారు.. అవిలేక.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కిడ్నీలు, గుండె వంటి వాటి కోసం.. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరికి బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి వాటిని తీసుకుని అమర్చుతున్న పరిస్థితిని తరచుగా మనం గమనిస్తున్నాం. అయితే.. ఇది అధికారికం కాదు. సదరు వ్యక్తి ఇష్టాను సారం మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా అధికారికం చేయలేదు. అయితే.. ప్రోత్సహించేందుకు మాత్రం సరికొత్త పంథాను ఎంచుకుంది.
విధి వశాత్తూ.. మరణిస్తూ.. అవయవాలను దానం చేసిన వారి మృత దేహాలకు సముచిత గౌరవంతో సర్కా రు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రబుత్వం నిర్ణయించింది. అంటే.. అవయవ దాతల అంతిమ సంస్కారాలను ఇకపై ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ప్రజల్లో అవయవ దానంపై అవగాహన కల్పించి, బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను అవసరమైన వారికి అమర్చడం ద్వారా…. వారికి పునర్జన్మ కల్పించనున్నారు.
ఇలా ఇచ్చే కార్యక్రమానికి ‘జీవన్దాన్’ గా పేరు పెట్టారు. అవయవ దాతల అంతిమ సంస్కారాలను సబ్ కలెక్టర్ స్థాయికి తక్కువ కాని అధికారుల నేతృత్వంలో.. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. అదేవిధంగా అవయవ దానం చేసిన వ్యక్తి కుటుంబానికి తక్షణ అవసరాల కోసం రూ.10000లను ఇస్తారు. అదేవిధంగా రూ.1000కి మించకుండా..ఇతర ఖర్చులు చేసేందుకు అధికారులకు కూడా సర్కారు అనుమతి ఇచ్చింది. మృతి చెందిన వ్యక్తి కుటుంబాన్ని తర్వాత కాలంలో గౌరవించడంతోపాటు శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
This post was last modified on August 8, 2024 7:05 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…