ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిన పవన్ అక్కడి సీఎం సిద్దరామయ్యతో భేటీ అయ్యారు. అయితే.. ఈ పర్యటనలో ప్రధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఎర్ర చందనం.. బెంగళూరు సహా.. మైసూరుకు తరలి వెళ్తోందని సమాచారం. దీనిపై కూపీలాగిన పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు వెళ్లారు.
అయితే.. ఇదొక్కటే కాకుండా.. రాష్ట్రంలో కుంకీ జాతి ఏనుగుల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఆరు కుంకీ జాతి ఏనుగులను ఇవ్వాలని కూడా కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల అట వీశాఖ అధికారులతో ఆయన సమీక్ష చేశారు. ఏనుగుల గుంపులు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో.. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని.. అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా కర్ణాటక ప్రభుత్వానికి ఈ విషయాన్ని వివరించారు. ఏపీకి ఆరు కుంకీ ఏనుగుల్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.
అదేవిధంగా అటవీ సంరక్షణ వ్యవహారాలపైనా పవన్ చర్చించనున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టే విషయంపైనా ఆయన కర్ణాటక మంత్రులతో చర్చించి.. ఏపీకి సహకారం అందించే చర్యల దిశగా అడుగులు వేయనున్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ అధికారికంగా చేపట్టిన పొరుగు రాష్ట్ర పర్యటన ఇదే కావడం గమనార్హం. ఈ పర్యటనలో పలువురు అధికారులు కూడా వెళ్లారు.
This post was last modified on August 8, 2024 3:02 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…