Political News

క‌ర్ణాట‌క‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రీజ‌నేంటి?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టిస్తున్నారు. విజ‌య‌వాడ నుంచి నేరుగా బెంగళూరుకు వెళ్లిన ప‌వ‌న్ అక్క‌డి సీఎం సిద్ద‌రామ‌య్య‌తో భేటీ అయ్యారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధానంగా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లా నుంచి ఎర్ర చంద‌నం.. బెంగ‌ళూరు స‌హా.. మైసూరుకు త‌రలి వెళ్తోంద‌ని స‌మాచారం. దీనిపై కూపీలాగిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. రాష్ట్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించేందుకు వెళ్లారు.

అయితే.. ఇదొక్క‌టే కాకుండా.. రాష్ట్రంలో కుంకీ జాతి ఏనుగుల కొర‌త నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో కర్ణాటక నుంచి ఆరు కుంకీ జాతి ఏనుగులను ఇవ్వాలని కూడా కోరనున్నట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. ఇటీవల అట వీశాఖ అధికారులతో ఆయ‌న‌ సమీక్ష చేశారు. ఏనుగుల గుంపులు రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్న అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంలో.. పంట పొలాలను నాశనం చేసే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఏనుగులు అవసరమని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీలో రెండు కుంకీ ఏనుగులు అందుబాటులో ఉన్నాయని అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. కుంకీ ఏనుగుల కొరత ఉందని.. అందుకే ఏనుగుల్ని తరమలేకపోతున్నామని చెప్పారు. కర్ణాటక నుంచి కుంకీ ఏనుగుల్ని తీసుకుంటే మంచిదని సూచించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ స్వయంగా కర్ణాటక ప్రభుత్వానికి ఈ విష‌యాన్ని వివ‌రించారు. ఏపీకి ఆరు కుంకీ ఏనుగుల్ని ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.

అదేవిధంగా అట‌వీ సంర‌క్ష‌ణ వ్య‌వ‌హారాల‌పైనా ప‌వ‌న్ చ‌ర్చించ‌నున్నారు. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్టే విష‌యంపైనా ఆయ‌న క‌ర్ణాట‌క మంత్రుల‌తో చ‌ర్చించి.. ఏపీకి స‌హ‌కారం అందించే చ‌ర్య‌ల దిశగా అడుగులు వేయ‌నున్నారు. కాగా, డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ప‌వ‌న్‌ అధికారికంగా చేప‌ట్టిన పొరుగు రాష్ట్ర ప‌ర్య‌ట‌న ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌లువురు అధికారులు కూడా వెళ్లారు.

This post was last modified on August 8, 2024 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

“నేను – ప‌వ‌న్ క‌లిసే ఉంటాం… ఇక మీ ఇష్టం“

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. త‌న పార్టీ సీనియ‌ర్ల‌కు.. ప‌రోక్షంగా ఓ విష‌యాన్ని తేల్చి చెప్పేశారు. కూట‌మి విష‌యంలోనూ.. ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీ…

5 hours ago

విచార‌ణ మ‌ధ్య‌లో `సెక్స్` వీడియోలు.. హైకోర్టు జ‌డ్జికి షాక్‌!

అది ఢిల్లీ హైకోర్టు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఓ కేసు విచార‌ణను ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. కొన్ని నిమిషాలు జ‌రిగాయి. వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లో…

10 hours ago

ప‌సుపు జెండా పౌరుషం ఎప్పుడూ త‌గ్గ‌లేదు

టీడీపీ నూత‌న కార్య‌వ‌ర్గ ప్ర‌మాణ స్వీకారం ఘ‌నంగా జ‌రిగింది. ఇటీవ‌ల పార్టీలో జాతీయ‌, రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గాల‌తోపాటు.. పొలిట్ బ్యూరోను…

13 hours ago

పెద్ద ట్విస్టు… పెద్ది విడుదల తేదీ ఇదా

మెగా ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న శుభ వార్త పెద్ది విడుదల తేది. ఏప్రిల్ 30 నుంచి…

14 hours ago

కేర‌ళం నాడి: విజ‌య‌న్‌.. ప‌రాజ‌య‌న్‌.. కాంగ్రెస్‌కే మొగ్గు!

కేర‌ళంలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తోందా? అంటే.. ఔన‌నే అంటు న్నాయి……

15 hours ago

అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్‌… స‌ర్వేల‌న్నీ.. క‌మ‌లం వైపే!

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో బీజేపీ త‌న ప‌ట్టును వ‌రుసగా మూడో సారి కూడా నిలబెట్టుకుంటోంద‌ని స‌ర్వే సంస్థ‌లు తేల్చి చెప్పాయి.…

15 hours ago