సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి చీరలు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గతంలో భువనేశ్వరి ఓ సందర్భంలో ..చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు, ప్రజలు అంటారే తప్ప.. ఇంట్లో వాళ్లను పట్టించుకోరని.. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో ఒక్క చీర కొన్నారని, దానిని తాను భద్రంగా దాచుకున్నానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు చీరలు కొనడం ఆసక్తిగా మారింది. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు తన సతీమణికి ఈ చీరలు కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత చీరల స్టాల్స్ ను సందర్శించారు. నేతన్నల నైపుణ్యాన్ని పరిశీలించి అచ్చరువొందారు. ఈ సందర్భంగానే తన భార్య కోసం రెండు చీరలను చంద్రబాబు కొనుగోలు చేశారు. వీటిలో ఒకటి వెంకటగిరి, రెండోది ఉప్పాడ జాందాని చీరలు కావడం విశేషం. వీటిలో ఒకటి 7 వేల రూపాయలు, రెండోది 12 వేల రూపాయలుగా వ్యాపారులు చెప్పారు. ఎలాంటి బేరం చేయకుండానే చంద్రబాబు సంతోషంగా వాటిని తీసుకున్నారు. ఈ సమయంలో నేతన్నలు తమ సమస్యలను వివరించారు.
నేతలపై జీఎస్టీని తగ్గించాలని వారు కోరారు. ముడి సరుకుల ధరలను కూడా తగ్గించాలని..అ దేవిధంగా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కోరారు. దీనికి చంద్రబాబు ఓకేచెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైన చేనేత వస్త్రాలు ధరించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారానేతన్నలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. వారి కష్టాలు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…