సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి చీరలు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గతంలో భువనేశ్వరి ఓ సందర్భంలో ..చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు, ప్రజలు అంటారే తప్ప.. ఇంట్లో వాళ్లను పట్టించుకోరని.. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో ఒక్క చీర కొన్నారని, దానిని తాను భద్రంగా దాచుకున్నానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు చీరలు కొనడం ఆసక్తిగా మారింది. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు తన సతీమణికి ఈ చీరలు కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత చీరల స్టాల్స్ ను సందర్శించారు. నేతన్నల నైపుణ్యాన్ని పరిశీలించి అచ్చరువొందారు. ఈ సందర్భంగానే తన భార్య కోసం రెండు చీరలను చంద్రబాబు కొనుగోలు చేశారు. వీటిలో ఒకటి వెంకటగిరి, రెండోది ఉప్పాడ జాందాని చీరలు కావడం విశేషం. వీటిలో ఒకటి 7 వేల రూపాయలు, రెండోది 12 వేల రూపాయలుగా వ్యాపారులు చెప్పారు. ఎలాంటి బేరం చేయకుండానే చంద్రబాబు సంతోషంగా వాటిని తీసుకున్నారు. ఈ సమయంలో నేతన్నలు తమ సమస్యలను వివరించారు.
నేతలపై జీఎస్టీని తగ్గించాలని వారు కోరారు. ముడి సరుకుల ధరలను కూడా తగ్గించాలని..అ దేవిధంగా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కోరారు. దీనికి చంద్రబాబు ఓకేచెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైన చేనేత వస్త్రాలు ధరించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారానేతన్నలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. వారి కష్టాలు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
This post was last modified on August 7, 2024 11:32 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…