సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి చీరలు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గతంలో భువనేశ్వరి ఓ సందర్భంలో ..చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు, ప్రజలు అంటారే తప్ప.. ఇంట్లో వాళ్లను పట్టించుకోరని.. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో ఒక్క చీర కొన్నారని, దానిని తాను భద్రంగా దాచుకున్నానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు చీరలు కొనడం ఆసక్తిగా మారింది. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు తన సతీమణికి ఈ చీరలు కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత చీరల స్టాల్స్ ను సందర్శించారు. నేతన్నల నైపుణ్యాన్ని పరిశీలించి అచ్చరువొందారు. ఈ సందర్భంగానే తన భార్య కోసం రెండు చీరలను చంద్రబాబు కొనుగోలు చేశారు. వీటిలో ఒకటి వెంకటగిరి, రెండోది ఉప్పాడ జాందాని చీరలు కావడం విశేషం. వీటిలో ఒకటి 7 వేల రూపాయలు, రెండోది 12 వేల రూపాయలుగా వ్యాపారులు చెప్పారు. ఎలాంటి బేరం చేయకుండానే చంద్రబాబు సంతోషంగా వాటిని తీసుకున్నారు. ఈ సమయంలో నేతన్నలు తమ సమస్యలను వివరించారు.
నేతలపై జీఎస్టీని తగ్గించాలని వారు కోరారు. ముడి సరుకుల ధరలను కూడా తగ్గించాలని..అ దేవిధంగా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కోరారు. దీనికి చంద్రబాబు ఓకేచెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైన చేనేత వస్త్రాలు ధరించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారానేతన్నలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. వారి కష్టాలు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
This post was last modified on August 7, 2024 11:32 pm
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…