సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి చీరలు కొనుగోలు చేశారు. అయితే.. ఇది కూడా వార్తేనా? అంటారా? ఔను వార్తే. ఎందుకంటే.. గతంలో భువనేశ్వరి ఓ సందర్భంలో ..చంద్రబాబు ఎప్పుడూ ప్రజలు, ప్రజలు అంటారే తప్ప.. ఇంట్లో వాళ్లను పట్టించుకోరని.. ఎప్పుడో పెళ్లయిన కొత్తలో ఒక్క చీర కొన్నారని, దానిని తాను భద్రంగా దాచుకున్నానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు చీరలు కొనడం ఆసక్తిగా మారింది. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు తన సతీమణికి ఈ చీరలు కొనుగోలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత చీరల స్టాల్స్ ను సందర్శించారు. నేతన్నల నైపుణ్యాన్ని పరిశీలించి అచ్చరువొందారు. ఈ సందర్భంగానే తన భార్య కోసం రెండు చీరలను చంద్రబాబు కొనుగోలు చేశారు. వీటిలో ఒకటి వెంకటగిరి, రెండోది ఉప్పాడ జాందాని చీరలు కావడం విశేషం. వీటిలో ఒకటి 7 వేల రూపాయలు, రెండోది 12 వేల రూపాయలుగా వ్యాపారులు చెప్పారు. ఎలాంటి బేరం చేయకుండానే చంద్రబాబు సంతోషంగా వాటిని తీసుకున్నారు. ఈ సమయంలో నేతన్నలు తమ సమస్యలను వివరించారు.
నేతలపై జీఎస్టీని తగ్గించాలని వారు కోరారు. ముడి సరుకుల ధరలను కూడా తగ్గించాలని..అ దేవిధంగా అందుబాటులోకి తీసుకురావాలని కూడా కోరారు. దీనికి చంద్రబాబు ఓకేచెప్పారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక్కసారైన చేనేత వస్త్రాలు ధరించాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారానేతన్నలను ప్రోత్సహించాలన్నారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఎంతో మంది చేనేత కార్మికులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. వారి కష్టాలు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
This post was last modified on August 7, 2024 11:32 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…