Political News

అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు క‌లిసి రానుంది. కీల‌క‌మైన ప‌నులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారుల‌ను ఒప్పించేందుకు.. ప్ర‌య‌త్నాలు చేస్తూ.. మ‌రోవైపు రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభించారు. గ‌త ఐదేళ్ల కాలంలో రాజధాని ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌ధాన‌మైన న‌వ‌న‌గ‌రాలు ప్రాంతం చిట్టి అడివిని త‌ల‌పిస్తోంది. అదేవి ధంగా చిన్న‌పాటి వ‌ర్షానికి కూడా అమ‌రావ‌తి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిల‌బ‌డి పోతోంది. దీంతో అస‌లు అమ‌రావ‌తి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీనిని దృష్టిలో పెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మం కింద రాజ‌ధాని ప్రాంతంలో ద‌ట్టంగా పేరుకుపోయిన చెట్లు, తుమ్మ మొక్క‌లు.. వ్య ర్థాల‌ను తొల‌గించ‌నున్నారు. మొత్తంగా 24 వేల ఎక‌రాల‌లో పేరుకుపోయిన ముళ్ల చెట్ల‌ను తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీనికిగాను నిరంత‌రాయంగా 24 గంట‌ల‌సేపు కార్మికులు ప‌నిచేసినా.. నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు తెలిపారు.

ఈ మొత్తం క్లియ‌రెన్స్ కోసం 32 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని ప‌క్క‌న పెట్టి మూడు రాజ‌ధానుల‌నే కొత్త పాల‌సీని తీసుకుంది. దీంతో రాజ‌ధాని ప్రాంతాన్ని పూర్తిగా విస్మ‌రించారు. ఫ‌లితంగా రాజధాని ప్రాంతం ఓ చిట్ట‌డివిగా మారింది. దీనిని మ‌రోసారి సాధార‌ణ స్థితికి తీసుకువ‌చ్చేందుకు, ర‌హ‌దారులు, డ్రైనేజీల‌ను శుభ్రం చేసేందుకు నెల రోజుల‌కుపైగానే స‌మ‌యం ప‌ట్ట‌నుంది. మొత్తానికి శ్రావ‌ణ మాసం ప్రారంభం కాగానే.. ప‌నులు ప్రారంభిం చారు.

దీంతో ఇటు ప‌నులు ప్రారంభం అయ్యాయి. మ‌రోవైపు.. అమ‌రావ‌తిలో నిర్మించిన వివిధ భవనాల పటిష్ట తపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వ‌నున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని.. ఉన్న భ‌వ‌నా ల‌ను కేటాయించ‌డం.. లేదా కొత్త భ‌వ‌నాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం అనే అంశాల‌పై ఆలోచ‌న చేస్తున్నారు. ఏదేమైనా శ్రావ‌ణ మాసం సెంటిమెంటుతో అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మీద‌ట వారాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు.

Satya

Recent Posts

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

3 minutes ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

6 minutes ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

2 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

2 hours ago

కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ డైరెక్టర్… ఆ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయిందా?

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…

3 hours ago

స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శలో ఎందుకీ రచ్చ?

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…

4 hours ago