Political News

అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు క‌లిసి రానుంది. కీల‌క‌మైన ప‌నులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారుల‌ను ఒప్పించేందుకు.. ప్ర‌య‌త్నాలు చేస్తూ.. మ‌రోవైపు రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభించారు. గ‌త ఐదేళ్ల కాలంలో రాజధాని ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌ధాన‌మైన న‌వ‌న‌గ‌రాలు ప్రాంతం చిట్టి అడివిని త‌ల‌పిస్తోంది. అదేవి ధంగా చిన్న‌పాటి వ‌ర్షానికి కూడా అమ‌రావ‌తి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిల‌బ‌డి పోతోంది. దీంతో అస‌లు అమ‌రావ‌తి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీనిని దృష్టిలో పెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మం కింద రాజ‌ధాని ప్రాంతంలో ద‌ట్టంగా పేరుకుపోయిన చెట్లు, తుమ్మ మొక్క‌లు.. వ్య ర్థాల‌ను తొల‌గించ‌నున్నారు. మొత్తంగా 24 వేల ఎక‌రాల‌లో పేరుకుపోయిన ముళ్ల చెట్ల‌ను తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీనికిగాను నిరంత‌రాయంగా 24 గంట‌ల‌సేపు కార్మికులు ప‌నిచేసినా.. నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు తెలిపారు.

ఈ మొత్తం క్లియ‌రెన్స్ కోసం 32 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని ప‌క్క‌న పెట్టి మూడు రాజ‌ధానుల‌నే కొత్త పాల‌సీని తీసుకుంది. దీంతో రాజ‌ధాని ప్రాంతాన్ని పూర్తిగా విస్మ‌రించారు. ఫ‌లితంగా రాజధాని ప్రాంతం ఓ చిట్ట‌డివిగా మారింది. దీనిని మ‌రోసారి సాధార‌ణ స్థితికి తీసుకువ‌చ్చేందుకు, ర‌హ‌దారులు, డ్రైనేజీల‌ను శుభ్రం చేసేందుకు నెల రోజుల‌కుపైగానే స‌మ‌యం ప‌ట్ట‌నుంది. మొత్తానికి శ్రావ‌ణ మాసం ప్రారంభం కాగానే.. ప‌నులు ప్రారంభిం చారు.

దీంతో ఇటు ప‌నులు ప్రారంభం అయ్యాయి. మ‌రోవైపు.. అమ‌రావ‌తిలో నిర్మించిన వివిధ భవనాల పటిష్ట తపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వ‌నున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని.. ఉన్న భ‌వ‌నా ల‌ను కేటాయించ‌డం.. లేదా కొత్త భ‌వ‌నాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం అనే అంశాల‌పై ఆలోచ‌న చేస్తున్నారు. ఏదేమైనా శ్రావ‌ణ మాసం సెంటిమెంటుతో అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మీద‌ట వారాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు.

This post was last modified on August 7, 2024 11:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Amaravati

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

15 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago