ఏపీ రాజధాని అమరావతికి శ్రావణం సెంటిమెంటు కలిసి రానుంది. కీలకమైన పనులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారులను ఒప్పించేందుకు.. ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు రాజధానిలో పనులు ప్రారంభించారు. గత ఐదేళ్ల కాలంలో రాజధాని పనులు చేపట్టకపోవడంతో ప్రధానమైన నవనగరాలు ప్రాంతం చిట్టి అడివిని తలపిస్తోంది. అదేవి ధంగా చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిలబడి పోతోంది. దీంతో అసలు అమరావతి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
దీనిని దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద రాజధాని ప్రాంతంలో దట్టంగా పేరుకుపోయిన చెట్లు, తుమ్మ మొక్కలు.. వ్య ర్థాలను తొలగించనున్నారు. మొత్తంగా 24 వేల ఎకరాలలో పేరుకుపోయిన ముళ్ల చెట్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికిగాను నిరంతరాయంగా 24 గంటలసేపు కార్మికులు పనిచేసినా.. నెల రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఈ మొత్తం క్లియరెన్స్ కోసం 32 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులనే కొత్త పాలసీని తీసుకుంది. దీంతో రాజధాని ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించారు. ఫలితంగా రాజధాని ప్రాంతం ఓ చిట్టడివిగా మారింది. దీనిని మరోసారి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు, రహదారులు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకు నెల రోజులకుపైగానే సమయం పట్టనుంది. మొత్తానికి శ్రావణ మాసం ప్రారంభం కాగానే.. పనులు ప్రారంభిం చారు.
దీంతో ఇటు పనులు ప్రారంభం అయ్యాయి. మరోవైపు.. అమరావతిలో నిర్మించిన వివిధ భవనాల పటిష్ట తపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని.. ఉన్న భవనా లను కేటాయించడం.. లేదా కొత్త భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం అనే అంశాలపై ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా శ్రావణ మాసం సెంటిమెంటుతో అమరావతి పనులు ప్రారంభం కావడం గమనార్హం. ఇక, మీదట వారాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కూడా నిర్ణయించారు.
This post was last modified on August 7, 2024 11:29 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…