Political News

అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి శ్రావ‌ణం సెంటిమెంటు క‌లిసి రానుంది. కీల‌క‌మైన ప‌నులు ప్రారంభం కానున్నాయి. పెట్టుబడి దారుల‌ను ఒప్పించేందుకు.. ప్ర‌య‌త్నాలు చేస్తూ.. మ‌రోవైపు రాజ‌ధానిలో ప‌నులు ప్రారంభించారు. గ‌త ఐదేళ్ల కాలంలో రాజధాని ప‌నులు చేప‌ట్ట‌క‌పోవ‌డంతో ప్ర‌ధాన‌మైన న‌వ‌న‌గ‌రాలు ప్రాంతం చిట్టి అడివిని త‌ల‌పిస్తోంది. అదేవి ధంగా చిన్న‌పాటి వ‌ర్షానికి కూడా అమ‌రావ‌తి ప్రాంతంలో మోకాల్లోతు నీరు నిల‌బ‌డి పోతోంది. దీంతో అస‌లు అమ‌రావ‌తి ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకే ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది.

దీనిని దృష్టిలో పెట్టుకున్న కూట‌మి ప్ర‌భుత్వం రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ ప్రారంభించింది. ఈ కార్య‌క్ర‌మం కింద రాజ‌ధాని ప్రాంతంలో ద‌ట్టంగా పేరుకుపోయిన చెట్లు, తుమ్మ మొక్క‌లు.. వ్య ర్థాల‌ను తొల‌గించ‌నున్నారు. మొత్తంగా 24 వేల ఎక‌రాల‌లో పేరుకుపోయిన ముళ్ల చెట్ల‌ను తొల‌గించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. దీనికిగాను నిరంత‌రాయంగా 24 గంట‌ల‌సేపు కార్మికులు ప‌నిచేసినా.. నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు తెలిపారు.

ఈ మొత్తం క్లియ‌రెన్స్ కోసం 32 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు మంత్రి నారాయ‌ణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని ప‌క్క‌న పెట్టి మూడు రాజ‌ధానుల‌నే కొత్త పాల‌సీని తీసుకుంది. దీంతో రాజ‌ధాని ప్రాంతాన్ని పూర్తిగా విస్మ‌రించారు. ఫ‌లితంగా రాజధాని ప్రాంతం ఓ చిట్ట‌డివిగా మారింది. దీనిని మ‌రోసారి సాధార‌ణ స్థితికి తీసుకువ‌చ్చేందుకు, ర‌హ‌దారులు, డ్రైనేజీల‌ను శుభ్రం చేసేందుకు నెల రోజుల‌కుపైగానే స‌మ‌యం ప‌ట్ట‌నుంది. మొత్తానికి శ్రావ‌ణ మాసం ప్రారంభం కాగానే.. ప‌నులు ప్రారంభిం చారు.

దీంతో ఇటు ప‌నులు ప్రారంభం అయ్యాయి. మ‌రోవైపు.. అమ‌రావ‌తిలో నిర్మించిన వివిధ భవనాల పటిష్ట తపై ఐఐటీ నిపుణులు నివేదిక ఇవ్వ‌నున్నారు. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని.. ఉన్న భ‌వ‌నా ల‌ను కేటాయించ‌డం.. లేదా కొత్త భ‌వ‌నాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం అనే అంశాల‌పై ఆలోచ‌న చేస్తున్నారు. ఏదేమైనా శ్రావ‌ణ మాసం సెంటిమెంటుతో అమ‌రావ‌తి ప‌నులు ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, మీద‌ట వారాంతాల్లో ప‌ర్యాట‌కాన్ని ప్రోత్స‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు.

This post was last modified on August 7, 2024 11:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Amaravati

Recent Posts

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

6 hours ago