Political News

ష‌ర్మిల ఎందుకు ఒంట‌ర‌య్యారు? ఏం జ‌రుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఒంటరి అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన నాయకులతో కూడిన పార్టీగా ఇప్పటికీ గుర్తింపు ఉంది. ఏపీలో చాలామంది సీనియర్ నాయకులు ఇప్పటికి పార్టీకి అండగానే ఉన్నారు. వీరిలో పల్లంరాజు, రఘువీరారెడ్డి, శైలజనాథ్ అదే విధంగా కేంద్ర మంత్రులుగా పని చేసిన‌ వారు కూడా ఇప్పుడు ఈ కోవలోనే ఉన్నారు. అయితే వీరందరినీ కలుపుకొని వెళ్లాల్సిన షర్మిల.. తన ఏకపక్ష వైఖరితో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

అంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే ఇంతమంది నాయకులు కూడా ఈ పది ఏళ్ల‌ కాలంలో పార్టీని ఏమీ చేయలేకపోయారు.. కనీసం పుంజుకునేలా చేయలేకపోయారు కాబట్టి వీరంతా వేస్ట్ అనుకునే పద్ధతిలో ఆమె వ్యవహరిస్తున్నారని సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చ. నిజానికి రఘువీరారెడ్డి ఏమి చేయలేదా? అంటే ఆయన బానే కష్టపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. పాదయాత్ర కూడా చేశారు. బలమైన నాయకుల్ని ఆయన ఎంపిక‌ చేసి పోటీలో పెట్టారు.

కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీని దెబ్బతీసింది. ఇక, 2019 ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న సాకే శైలజనాథ్ కూడా బలంగానే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఎస్సి నాయకుడిగా ఆయన ఎస్సీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడంలోను, పార్టీ వైపు తిప్పడంలోనూ ఎంతో ప్రయత్నం అయితే చేశారు. కానీ అసలైన వ్యతిరేకతను ఎదుర్కోవడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. దానిని పరిష్కరించి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే దిశగా ఒక అడుగు వేస్తారు అన్న ఉద్దేశంతోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది.

కానీ. షర్మిల మాత్రం ఇప్పుడున్న వారందరూ పనికిరాని నాయకులుగా.. తను మాత్రమే భారీ ఎత్తున పార్టీని లైన్లో పెట్టే నాయకురాలిగా భావిస్తూ సీనియర్లను పక్కన పెడుతున్నార‌నేది పార్టీలో సాగుతున్న చ‌ర్చ‌. నిజానికి పార్టీకి ఓటు బ్యాంకు లేకపోవచ్చు కానీ బలమైన కేడర్ ఇప్పటికి ఉంది. ఎన్నికలకు ముందు అనంతపురంలో జరిగిన సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరు అయ్యారు. అలాంటి పార్టీకి కావాల్సింది అందర్నీ కలుపుకొని వెళ్లాల్సిన నాయ‌కుడు. ప్రజల సమస్యల ఏమిటో ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య తెగిపోయిన విషయం ఏంటో తెలుసుకుని దాన్ని సరి చేసేదిగా అడుగులు పడాలి.

కానీ షర్మిల ఆ రకంగా కాకుండా వ్యక్తిగత లక్ష్యాలను సాధించే దిశ‌గా ముందుకు వెళుతుండడంతో సీనియర్లు ఆమెను దాదాపు వదిలేశారని అంటున్నారు. ఎన్నికలకు మధ్యలోనే షర్మిలను పక్కన పెట్టిన ట్టు చెబుతున్నారు. ఇక తరచుగా పార్టీలో జోక్యం చేసుకునే కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు వంటి వారు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమెకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ష‌ర్మిల వైపే మొగ్గు చూపడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని ఒక చర్చ ఉంది. దీంతో పార్టీ పరంగా వీరంతా షర్మిలను దూరం పెట్టి.. పని చేసుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది? ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

This post was last modified on August 7, 2024 11:25 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

2 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

5 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

5 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

5 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

6 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

9 hours ago