Political News

ష‌ర్మిల ఎందుకు ఒంట‌ర‌య్యారు? ఏం జ‌రుగుతోంది?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఒంటరి అవుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బలమైన నాయకులతో కూడిన పార్టీగా ఇప్పటికీ గుర్తింపు ఉంది. ఏపీలో చాలామంది సీనియర్ నాయకులు ఇప్పటికి పార్టీకి అండగానే ఉన్నారు. వీరిలో పల్లంరాజు, రఘువీరారెడ్డి, శైలజనాథ్ అదే విధంగా కేంద్ర మంత్రులుగా పని చేసిన‌ వారు కూడా ఇప్పుడు ఈ కోవలోనే ఉన్నారు. అయితే వీరందరినీ కలుపుకొని వెళ్లాల్సిన షర్మిల.. తన ఏకపక్ష వైఖరితో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

అంటే, ఆమె ఉద్దేశం ఏంటంటే ఇంతమంది నాయకులు కూడా ఈ పది ఏళ్ల‌ కాలంలో పార్టీని ఏమీ చేయలేకపోయారు.. కనీసం పుంజుకునేలా చేయలేకపోయారు కాబట్టి వీరంతా వేస్ట్ అనుకునే పద్ధతిలో ఆమె వ్యవహరిస్తున్నారని సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చ. నిజానికి రఘువీరారెడ్డి ఏమి చేయలేదా? అంటే ఆయన బానే కష్టపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. పాదయాత్ర కూడా చేశారు. బలమైన నాయకుల్ని ఆయన ఎంపిక‌ చేసి పోటీలో పెట్టారు.

కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత పార్టీని దెబ్బతీసింది. ఇక, 2019 ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షులుగా ఉన్న సాకే శైలజనాథ్ కూడా బలంగానే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. ఎస్సి నాయకుడిగా ఆయన ఎస్సీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడంలోను, పార్టీ వైపు తిప్పడంలోనూ ఎంతో ప్రయత్నం అయితే చేశారు. కానీ అసలైన వ్యతిరేకతను ఎదుర్కోవడంలో వీరిద్దరూ విఫలమయ్యారు. దానిని పరిష్కరించి ప్రజలను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించే దిశగా ఒక అడుగు వేస్తారు అన్న ఉద్దేశంతోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది.

కానీ. షర్మిల మాత్రం ఇప్పుడున్న వారందరూ పనికిరాని నాయకులుగా.. తను మాత్రమే భారీ ఎత్తున పార్టీని లైన్లో పెట్టే నాయకురాలిగా భావిస్తూ సీనియర్లను పక్కన పెడుతున్నార‌నేది పార్టీలో సాగుతున్న చ‌ర్చ‌. నిజానికి పార్టీకి ఓటు బ్యాంకు లేకపోవచ్చు కానీ బలమైన కేడర్ ఇప్పటికి ఉంది. ఎన్నికలకు ముందు అనంతపురంలో జరిగిన సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరు అయ్యారు. అలాంటి పార్టీకి కావాల్సింది అందర్నీ కలుపుకొని వెళ్లాల్సిన నాయ‌కుడు. ప్రజల సమస్యల ఏమిటో ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి మధ్య తెగిపోయిన విషయం ఏంటో తెలుసుకుని దాన్ని సరి చేసేదిగా అడుగులు పడాలి.

కానీ షర్మిల ఆ రకంగా కాకుండా వ్యక్తిగత లక్ష్యాలను సాధించే దిశ‌గా ముందుకు వెళుతుండడంతో సీనియర్లు ఆమెను దాదాపు వదిలేశారని అంటున్నారు. ఎన్నికలకు మధ్యలోనే షర్మిలను పక్కన పెట్టిన ట్టు చెబుతున్నారు. ఇక తరచుగా పార్టీలో జోక్యం చేసుకునే కేవీపీ రామచంద్రరావు, పల్లంరాజు వంటి వారు కూడా ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమెకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ష‌ర్మిల వైపే మొగ్గు చూపడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని ఒక చర్చ ఉంది. దీంతో పార్టీ పరంగా వీరంతా షర్మిలను దూరం పెట్టి.. పని చేసుకుంటూ పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది? ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

This post was last modified on August 7, 2024 11:25 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

పెద్ది అయోమ‌యంపై ర‌విబాబు అస‌హ‌నం

ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్ర‌తి సినిమాకూ రిలీజ్ డేట్ మార‌డం అన్న‌ది మామూలైపోయింది. ఐతే…

1 hour ago

విజయ్ గురించి మన వాళ్లు కొట్టేసుకుంటున్నారు

ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…

3 hours ago

94 వయసులో ‘సింగీతం’ మాయాజలం

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…

4 hours ago

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్.. ఎవరెవరికి ఎంత ఛాన్స్?

ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…

6 hours ago

‘చిట్టి’బాబుని ‘పెద్ది’గాడు కొట్టగలడా?

ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…

7 hours ago

లండన్ కొలువులో కొడుకు… తల్లికి ఇందిరమ్మ ఇల్లు

సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…

8 hours ago