భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 50 కిలోల విభాగంలో ఫైనల్ కు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఆమె బంగారు పతకం తేవడం ఖాయమని యావత్ భారతావని ఎదురుచూస్తోంది. అయితే, అనూహ్యంగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెపై ఐఓసీ వేటు వేసింది.
దీంతో, ఆమె ఈ రోజు రాత్రి జరగాల్సిన ఫైనల్లో పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే వినేవ్ ఫొగాట్ వేటుపై భారత్ అప్పీల్కు వెళ్ళింది. ప్రొటోకాల్ ప్రకారం భారత్ అప్పీల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం వినేశ్ ఫొగాట్ 50 కిలోల కంటే 100 గ్రాములు అధికంగా ఉండడంతో ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమెపై అనర్హత వేటు వేసింది.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు. యావత్ భారత దేశం ఫొగాట్ వెంట ఉందని మోదీ అన్నారు. అంతేకాదు, ఆ అనర్హతపై భారత ఒలింపిక్ సంఘం (ఐఏఓ) చీఫ్ పీటీ ఉషతో ఫోన్ లో మోదీ మాట్లాడారు. అసలేం జరిగింది? అన్న వివరాలను పీటీ ఉషను అడిగి తెలుసుకున్నారు. వినేశ్ ఫోగాట్ అనర్హతకు దారితీసిన కారణాలను మోదీకి పీటీ ఉష వివరించారు. వినేశ్ కు సాయపడగలిగిన మార్గాల గురించి ఉషను ఆయన అడిగారు. ఒలింపిక్స్ లో గట్టిగా నిరసన తెలపడం ద్వారా ఉపయోగం ఉంటుంది అంటే అలా చేయాలని మోదీ సూచించారు.
అయితే, ఒలింపిక్స్లో రూల్స్ ఉంటాయని, రెజ్లర్ 50 లేదా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారని విశేశ్ ఫొగల్ పెదనాన్న మహవీర్ ఫొగట్ అంటున్నారు. ఆమె ఎప్పటికైనా బంగారు పతకం సాధిస్తుందని, తదుపరి ఒలింపిక్స్ కోసం సిద్ధం చేస్తానని అన్నారు. ఇక, ఈ వ్యవహారంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ‘నో… నో… నో… ఇది నిజం కాకపోతే బాగుండు’ అని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
This post was last modified on August 7, 2024 4:51 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…