కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా పలు రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో బార్లు, పబ్బులు, క్లబ్బులు వంటివి మూతబడ్డాయి. అన్ లాక్ లో భాగంగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రతను బట్టి బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ త్వరలోనే బార్లను బార్లా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తెలంగాణలో మూతపడ్డ బార్లు, పబ్బులు, క్లబ్బులు తెరుచుకునేందుకు అనుమతులిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పాటిస్తూ వాటిని తెరుచుకోవచ్చిన ప్రకటించింది. అక్కడ పనిచేసే సిబ్బంది మాస్కులు, గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. రోజుకు 2సార్లు ఆ ప్రాంతాలను శానిటైజ్ చేయాలని, ప్రభుత్వ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ సందర్భంగా బార్లు, పబ్బులు, క్లబ్బుల యజమానులకు పలు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఆయా ప్రదేశాల దగ్గర క్యూ పద్దతి పాటించేలా, శుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్లబ్బులు, బార్లు, పబ్బులలో పనిచేసే సిబ్బంది అందరూ మాస్కులు , హ్యాండ్ గ్లౌసెస్ ధరించాలని స్పష్టం చేసింది. రోజు ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బార్లు క్లీన్ చేయాలని పేర్కొంది. కస్టమర్ కూర్చునే ముందు కుర్చీలు , టేబుల్ శుభ్రపరచాలని తెలిపింది. ఆయా ప్రదేశాల్లో వెంటిలేషన్ తగినంత ఉండేలా జాగ్రత్తలు పాటించాలని ఆదేశించింది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూమ్ లపై నిషేధం కొనసాగనుందని తెలిపింది. మ్యూజికల్ ఈవెంట్స్ ,డాన్స్ ఫ్లోర్స్ , గుమిగూడడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
This post was last modified on September 25, 2020 8:25 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…