వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ న్యాయ పోరాటంలో మరో మెట్టు ఎక్కారు. ఇటీవల తన పార్టీకి 11 మంది ఎమ్మెల్యే లే ఉన్నప్పటికీ.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాలని కోరుతూ ఆయన హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఒక విడత విచారణ కూడా జరిగింది. ఇక, ఇప్పుడు మరో కీలక అంశంతో జగన్ హైకోర్టు మెట్లెక్కారు. తనకు కల్పిస్తున్న వ్యక్తిగత భద్రతను ప్రస్తుత కూటమి ప్రభుత్వం తొలగించిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాదు.. తన ప్రాణాలకు ముప్పు విషయాన్ని కూడా ఆయన పిటిషన్లో ప్రస్తావించారు. ఐదేళ్లు ము ఖ్యమంత్రిగా చేసిన తనకు కొన్ని అసాంఘిక శక్తుల నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రబుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా తనకు ఉన్న భద్రతను తొలగించినట్టు జగన్ వివరించారు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత భద్రతను తొలగించిన ప్రభుత్వాన్ని మందలిస్తూ.. తనకు భద్రతను పెంచేలా ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు.
అదేవిధంగా తనకు కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పాతదని. ఎక్కడికక్కడ మొరాయిస్తోందని జగన్ తన పిటిషన్లో వివరించారు. ఇది కూడా తనను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించాలని చేస్తున్న ప్రయత్నమేనని పేర్కొన్నారు. కాబట్టి.. అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తనకు కేటాయించేలా ఆదేశించాలని పిటిషన్లో జగన్ అభ్యర్థించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని.. తన భద్రతకు సంబంధించి సర్కారుకు తగిన విధంగా సూచనలు ఇవ్వాలని జగన్ కోరారు.
This post was last modified on August 5, 2024 10:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…