Political News

నా ప్రాణాల‌కు ముప్పు.. జ‌గ‌న్ న్యాయ పోరాటం

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ న్యాయ పోరాటంలో మ‌రో మెట్టు ఎక్కారు. ఇటీవ‌ల త‌న పార్టీకి 11 మంది ఎమ్మెల్యే లే ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇప్పించాల‌ని కోరుతూ ఆయ‌న హైకోర్టుకు వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ పిటిష‌న్‌పై ఒక విడ‌త విచార‌ణ కూడా జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు మ‌రో కీల‌క అంశంతో జ‌గ‌న్ హైకోర్టు మెట్లెక్కారు. త‌నకు క‌ల్పిస్తున్న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం తొల‌గించింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అంతేకాదు.. త‌న ప్రాణాల‌కు ముప్పు విష‌యాన్ని కూడా ఆయ‌న పిటిష‌న్‌లో ప్ర‌స్తావించారు. ఐదేళ్లు ము ఖ్యమంత్రిగా చేసిన తన‌కు కొన్ని అసాంఘిక శ‌క్తుల నుంచి ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుత ప్ర‌బుత్వం వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా ఏక‌ప‌క్షంగా త‌న‌కు ఉన్న భ‌ద్ర‌త‌ను తొల‌గించిన‌ట్టు జ‌గ‌న్ వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో త‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌ను తొల‌గించిన ప్ర‌భుత్వాన్ని మంద‌లిస్తూ.. త‌న‌కు భ‌ద్ర‌త‌ను పెంచేలా ఆదేశించాల‌ని ఆయ‌న హైకోర్టును కోరారు.

అదేవిధంగా త‌న‌కు క‌ల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం కూడా పాత‌ద‌ని. ఎక్క‌డిక‌క్క‌డ మొరాయిస్తోంద‌ని జ‌గ‌న్ త‌న పిటిష‌న్‌లో వివ‌రించారు. ఇది కూడా త‌న‌ను ఇబ్బంది పెట్టేలా వ్య‌వ‌హ‌రించాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్న‌మేన‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి.. అధునాతన బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నం త‌న‌కు కేటాయించేలా ఆదేశించాల‌ని పిటిష‌న్‌లో జ‌గ‌న్ అభ్య‌ర్థించారు. అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. త‌న భ‌ద్ర‌త‌కు సంబంధించి స‌ర్కారుకు త‌గిన విధంగా సూచ‌న‌లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ కోరారు.

This post was last modified on August 5, 2024 10:31 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago