Political News

పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించాకే.. జ‌గ‌న్‌లో ఎంత మార్పు?!

వైసీపీ ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. ఎలాంటి ఆదేశం ఇవ్వాల‌న్నా.. పార్టీ అధినేత జ‌గ‌న్‌దే ఫైన‌ల్ నిర్ణయం. సాధార‌ణంగా అన్ని పార్టీల్లోనూ ఇదే త‌ర‌హా నిర్ణ‌యాలు ఉంటాయి. వ్య‌క్తిగ‌త ప్రాంతీయ పార్టీలు కావ‌డంతో ఆయా పార్టీల్లో అధినేత‌లే సుప్రీం. అదే జాతీయ స్థాయి సంస్థాగ‌త పార్టీలైతే మాత్రం.. ఒక నిర్ణ‌యం తీసుకునేందుకు పొలిట్ బ్యూరోనో.. లేక‌.. పార్టీ అధిష్టాన‌మో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటా యి. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ వంటి పార్టీల్లో మాత్రం ఏదైనా నిర్ణ‌యం తీసుకునే ముందు క్షేత్ర‌స్థాయి నాయ‌కుల నిర్ణ‌యాల‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అడుగులు వేస్తారు.

అయితే.. ఎటొచ్చీ.. వైసీపీలోనే ఎప్పుడూ కేంద్రీకృత నిర్ణ‌యాలు, కేంద్రీకృత పాల‌న వంటివి ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు ఉన్నార‌ని, వారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఎన్న‌డూ వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోనూ లేదు. దీంతో పార్టీలో ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. జ‌గ‌నే ఫైనల్‌. అయితే.. ఇది ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు. కానీ, ఇప్పుడు పంథా మారింది. ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. క్షేత్ర‌స్థాయి పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించాకే! అని వైసీపీలో ఇప్పుడు వినిపిస్తున్న వాద‌న‌.

దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ తీసుకున్న ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు అన్నీ బుట్ట‌దాఖ‌ల‌య్యాయి. పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాయి. ఆ స‌మ‌యంలో ఇలా వ‌ద్దు.. అలా వ‌ద్దు.. అన్న నాయ‌కుల‌ను జ‌గ‌న్ తిట్టిపోశార‌ని కూడా వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. దీంతో నాయ‌కులు ఏం జ‌రిగితే అదే జ‌రుగుతుంద‌ని మౌనంగా ఉండిపోయారు. ఫ‌లితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. దాదాపు 80 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేల‌ను మార్చేయ‌డం.. ముక్కు మొహం తెలియ‌ని వారిని కూడా తీసుకువ‌చ్చి.. పోటీలో పెట్ట‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం ఉన్న నాయ‌కులు ప‌రేషాన్ అయ్యారు.

ఫ‌లితంగా గెల‌వాల్సిన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం, పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గం వంటి చోట్ల కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ప‌రిణామాల‌తో దిగివ‌చ్చిన జ‌గ‌న్‌.. ఇప్పుడు త‌న పంథాను మార్చుకున్నార‌నేది పార్టీ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించే తీసుకుంటున్నా ర‌ని అంటున్నారు. తాజాగా విశాఖ స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ పోటీలో బొత్స స‌త్య‌నారాయ‌ణ పేరును ఇలానే చ‌ర్చించి తీసుకున్నార‌ని అంటున్నారు. అదేవిధంగా త్వ‌ర‌లో రాష్ట్ర వ్యాప్తంగా 100కుపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌ల‌ను మార్చాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. దీనిని కూడా పార్టీ నేత‌ల‌తో చ‌ర్చించే తీసుకుంటార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఈ మార్పు.. ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.

Satya

Recent Posts

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

1 hour ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

11 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

13 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

15 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

16 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

16 hours ago