వైసీపీ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. ఎలాంటి ఆదేశం ఇవ్వాలన్నా.. పార్టీ అధినేత జగన్దే ఫైనల్ నిర్ణయం. సాధారణంగా అన్ని పార్టీల్లోనూ ఇదే తరహా నిర్ణయాలు ఉంటాయి. వ్యక్తిగత ప్రాంతీయ పార్టీలు కావడంతో ఆయా పార్టీల్లో అధినేతలే సుప్రీం. అదే జాతీయ స్థాయి సంస్థాగత పార్టీలైతే మాత్రం.. ఒక నిర్ణయం తీసుకునేందుకు పొలిట్ బ్యూరోనో.. లేక.. పార్టీ అధిష్టానమో చర్చించి నిర్ణయాలు తీసుకుంటా యి. అయినప్పటికీ.. టీడీపీ వంటి పార్టీల్లో మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు క్షేత్రస్థాయి నాయకుల నిర్ణయాలను కూడా పరిగణనలోకి తీసుకుని అడుగులు వేస్తారు.
అయితే.. ఎటొచ్చీ.. వైసీపీలోనే ఎప్పుడూ కేంద్రీకృత నిర్ణయాలు, కేంద్రీకృత పాలన వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులు ఉన్నారని, వారికి కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని ఎన్నడూ వైసీపీ అధినేత జగన్ పట్టించుకోలేదు. పరిగణనలోకి తీసుకోనూ లేదు. దీంతో పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. జగనే ఫైనల్. అయితే.. ఇది ఎన్నికలకు ముందు వరకు. కానీ, ఇప్పుడు పంథా మారింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. క్షేత్రస్థాయి పార్టీ నేతలతో చర్చించాకే! అని వైసీపీలో ఇప్పుడు వినిపిస్తున్న వాదన.
దీనికి కారణం.. ఎన్నికలకు ముందు జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు అన్నీ బుట్టదాఖలయ్యాయి. పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాయి. ఆ సమయంలో ఇలా వద్దు.. అలా వద్దు.. అన్న నాయకులను జగన్ తిట్టిపోశారని కూడా వార్తలు బయటకు వచ్చాయి. దీంతో నాయకులు ఏం జరిగితే అదే జరుగుతుందని మౌనంగా ఉండిపోయారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తుడిచి పెట్టుకుపోయింది. దాదాపు 80 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యేలను మార్చేయడం.. ముక్కు మొహం తెలియని వారిని కూడా తీసుకువచ్చి.. పోటీలో పెట్టడంతో అప్పటి వరకు ప్రజలకు పరిచయం ఉన్న నాయకులు పరేషాన్ అయ్యారు.
ఫలితంగా గెలవాల్సిన తిరువూరు నియోజకవర్గం, పామర్రు నియోజకవర్గం వంటి చోట్ల కూడా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ పరిణామాలతో దిగివచ్చిన జగన్.. ఇప్పుడు తన పంథాను మార్చుకున్నారనేది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. ఏ నిర్ణయం తీసుకున్నా.. పార్టీ నాయకులతో చర్చించే తీసుకుంటున్నా రని అంటున్నారు. తాజాగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోటీలో బొత్స సత్యనారాయణ పేరును ఇలానే చర్చించి తీసుకున్నారని అంటున్నారు. అదేవిధంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 100కుపైగా నియోజకవర్గాల్లో ఇంచార్జ్లను మార్చాలని నిర్ణయించుకున్నారని.. దీనిని కూడా పార్టీ నేతలతో చర్చించే తీసుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ మార్పు.. ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి.
This post was last modified on August 5, 2024 10:23 am
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…