వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో తరచుగా బెంగళూరుకు వెళ్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఆయన ఇప్పటికి మూడుసార్లు బెంగళూరు పర్యటనకు వెళ్లడం.. అక్కడ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడం.. తిరిగి తాడేపల్లికి చేరుకోవడం తెలిసిందే. అయితే అధికారంలో ఉండగా ఆయన ఒకే ఒక్కసారి బెంగళూరుకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే ఆయన బెంగుళూరు పర్యటన పెట్టుకోవడం గమనార్హం.
అతి కూడా సతీ సమేతంగా అక్కడ ఉండటం తన బంధువులతో కలిసి చర్చలు జరపడం వంటివి చేస్తున్నారు. అయితే దీని వెనుక అసలు రీజన్ ఏంటి? అనేది ఇప్పుడు చర్చిగా మారింది. ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్య రెండున్నర సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి దీనికి ముందు ఎక్కువ కాలం హైదరాబాదులోని లోటస్ పాండ్ లోనే ఉన్నారు. 2014 నుంచి 2017 వరకు కూడా ఆయన హైదరాబాదు నుంచి రాకపోకలు సాగించారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టినా హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రావడం తిరిగి వెళ్ళిపోవడం చేశారు.
హైదరాబాద్ లోటస్పాండ్ లోనే నివాసం ఉండడం వంటివి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు హైదరాబాద్ మొహం కూడా ఆయన చూడట్లేదు. లోటస్పాండ్ లో అసలు అడిగే పెట్టట్లేదు. దీనికి కారణం షర్మిలేనని అంటున్నారు. ఎందుకంటే లోటస్ పాండ్ లోని ఒకవైపు షర్మిల ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. ఆ ఇంటిని తనకు ఇచ్చేయాలని షర్మిల కొన్నాళ్లుగా రాయబారం చేయిస్తున్నారని, దీనికి జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదని పార్టీ వర్గాల్లోని కీలకమైన నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.
లోటస్ పాండ్ నిర్మాణం వైయస్ హయాంలో జరిగింది. దీనిని పంచే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో షర్మిల బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడే మకాం వేసి పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్కు అధ్యక్షురాలు. అయినా లోటస్పాండ్ ను మాత్రం వదిలిపెట్టడం లేదు. లోటస్ పాండ్లోని ఒక భాగంలో ఆమె కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. దీంతో ఆ ఇంట్లోనే విజయలక్ష్మి కూడా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో జగన్ అక్కడికి వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు ఈ కారణంగానే బెంగళూరుకు వెళ్తున్నారని లోటస్పాండ్ కి వెళ్లడం ఇష్టం లేకే ఆయన బెంగుళూరు ఇంట్లో ఉంటున్నారని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ లోటస్పాండ్ వ్యవహారం ఏం జరుగుతుంది? అనేది ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా తెలియదు. మరి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on August 4, 2024 7:30 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…