టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సహజంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధమైన కార్యక్రమాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇప్పటి వరకు అధికారుల మార్పులు.. గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దడం వరకే చంద్రబాబు పరిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్రబాబు తనదైన మార్కుతో పాలన ప్రారంభించనున్నారు.
అయితే.. చంద్రబాబు వచ్చీ రావడంతోనే.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. తమకు అవకాశం వచ్చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. అమరావతి రాజధాని ప్రాంతంలో లే అవుట్లు వేస్తున్నారు. వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు కూడా. సీఆర్ డీయే పరిధిలోనే ఈ తతంగం కొనసాగుతోంది. దీనిపై సర్కారుకు తాజాగా ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి చంద్రబాబు రాగానే అమరావతిపై దృష్టి పెట్టారు. అక్కడ పర్యటించారు.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా లే అవుట్లు వేసి విక్రయించు కోవడంతోపాటు.. చంద్రబాబు పేరును కూడా వాడేసుకుంటున్నారు. దీంతో అసలు అనుమతులు ఇంకా రాలేదన్న విషయాన్ని తెలియని కొందరు ఉద్యోగులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా.. ఇక్కడ కొనుగోళ్లు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. బాబు వచ్చారని.. రెచ్చిపోతే.. చర్యలు తప్పవంటూ సీఆర్డీయే అధికారులు తాజాగా హెచ్చరించారు.
అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం సహా పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ తతంగంపై అధికారులు సీరియస్గా వ్యవహరించాలని నిర్ణయించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సీఆర్డీయే అధికారులు దృష్టి పెట్టారు. ప్రొక్లైయిన్తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాళ్లను తొలగించే పనిని చేపట్టారు. వెంచర్లలో వేసిన రోడ్లను తీసేశారు. అంతేకాదు.. ఇలాంటి అక్రమ లేవుట్లను ఎవరూ నమ్మొద్దని ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు బ్రాండ్ వాల్యూ బాగానే ఉన్నా.. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా సాగుతున్న ఇలాంటి వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
This post was last modified on August 4, 2024 11:46 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…