టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సహజంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధమైన కార్యక్రమాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇప్పటి వరకు అధికారుల మార్పులు.. గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దడం వరకే చంద్రబాబు పరిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్రబాబు తనదైన మార్కుతో పాలన ప్రారంభించనున్నారు.
అయితే.. చంద్రబాబు వచ్చీ రావడంతోనే.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. తమకు అవకాశం వచ్చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. అమరావతి రాజధాని ప్రాంతంలో లే అవుట్లు వేస్తున్నారు. వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు కూడా. సీఆర్ డీయే పరిధిలోనే ఈ తతంగం కొనసాగుతోంది. దీనిపై సర్కారుకు తాజాగా ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి చంద్రబాబు రాగానే అమరావతిపై దృష్టి పెట్టారు. అక్కడ పర్యటించారు.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా లే అవుట్లు వేసి విక్రయించు కోవడంతోపాటు.. చంద్రబాబు పేరును కూడా వాడేసుకుంటున్నారు. దీంతో అసలు అనుమతులు ఇంకా రాలేదన్న విషయాన్ని తెలియని కొందరు ఉద్యోగులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా.. ఇక్కడ కొనుగోళ్లు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. బాబు వచ్చారని.. రెచ్చిపోతే.. చర్యలు తప్పవంటూ సీఆర్డీయే అధికారులు తాజాగా హెచ్చరించారు.
అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం సహా పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ తతంగంపై అధికారులు సీరియస్గా వ్యవహరించాలని నిర్ణయించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సీఆర్డీయే అధికారులు దృష్టి పెట్టారు. ప్రొక్లైయిన్తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాళ్లను తొలగించే పనిని చేపట్టారు. వెంచర్లలో వేసిన రోడ్లను తీసేశారు. అంతేకాదు.. ఇలాంటి అక్రమ లేవుట్లను ఎవరూ నమ్మొద్దని ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు బ్రాండ్ వాల్యూ బాగానే ఉన్నా.. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా సాగుతున్న ఇలాంటి వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
This post was last modified on August 4, 2024 11:46 am
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…