టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత.. సహజంగానే వ్యాపారాలు, వాణిజ్య సంబంధమైన కార్యక్రమాలు పుంజుకుంటాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. పాలన ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదు. ఇప్పటి వరకు అధికారుల మార్పులు.. గత సర్కారు చేసిన తప్పులను సరిదిద్దడం వరకే చంద్రబాబు పరిమితం అయ్యారు. ఈ నెల నుంచి చంద్రబాబు తనదైన మార్కుతో పాలన ప్రారంభించనున్నారు.
అయితే.. చంద్రబాబు వచ్చీ రావడంతోనే.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. తమకు అవకాశం వచ్చేసినట్టుగా భావిస్తున్నారు. దీంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. అమరావతి రాజధాని ప్రాంతంలో లే అవుట్లు వేస్తున్నారు. వీటిని పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు కూడా. సీఆర్ డీయే పరిధిలోనే ఈ తతంగం కొనసాగుతోంది. దీనిపై సర్కారుకు తాజాగా ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి చంద్రబాబు రాగానే అమరావతిపై దృష్టి పెట్టారు. అక్కడ పర్యటించారు.
దీనిని తమకు అనుకూలంగా మార్చుకున్న కొందరు వ్యాపారులు అక్రమంగా లే అవుట్లు వేసి విక్రయించు కోవడంతోపాటు.. చంద్రబాబు పేరును కూడా వాడేసుకుంటున్నారు. దీంతో అసలు అనుమతులు ఇంకా రాలేదన్న విషయాన్ని తెలియని కొందరు ఉద్యోగులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా.. ఇక్కడ కొనుగోళ్లు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. బాబు వచ్చారని.. రెచ్చిపోతే.. చర్యలు తప్పవంటూ సీఆర్డీయే అధికారులు తాజాగా హెచ్చరించారు.
అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గం సహా పలు గ్రామాల్లో జరుగుతున్న ఈ తతంగంపై అధికారులు సీరియస్గా వ్యవహరించాలని నిర్ణయించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్లపై సీఆర్డీయే అధికారులు దృష్టి పెట్టారు. ప్రొక్లైయిన్తో లేఅవుట్ల కంచెలను తొలగించడంతో పాటు హద్దురాళ్లను తొలగించే పనిని చేపట్టారు. వెంచర్లలో వేసిన రోడ్లను తీసేశారు. అంతేకాదు.. ఇలాంటి అక్రమ లేవుట్లను ఎవరూ నమ్మొద్దని ప్రకటించారు. మొత్తానికి చంద్రబాబు బ్రాండ్ వాల్యూ బాగానే ఉన్నా.. ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా సాగుతున్న ఇలాంటి వ్యాపారాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
This post was last modified on August 4, 2024 11:46 am
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…