Political News

గవర్నర్ నియామకం వెనక రేవంత్ చక్రం తిప్పాడా ?!

తెలంగాణ నూతన గవర్నర్ గా త్రిపుర రాష్ట్రానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను రాష్ట్రపతి నియమించారు. రేపు ఆయన గవర్నర్ గా పదవీ బాద్యతలు స్వీకరించనున్నారు. అయితే జిష్ణుదేవ్ నియామకం వెనక తెలంగాణ సీఎం రేవంత్ హస్తం ఉందా అన్న అనుమానాలు రాజకీయ, మీడియా వర్గాలలో ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశంగా మారాయి.

గవర్నర్ గా ఎంపికయిన తర్వాత తాజాగా ఓ ఇంటర్వ్యూలో జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం రేవంత్ లు కాల్ చేసి చెప్పే వరకు తాను గవర్నర్ గా ఎంపికయిన విషయం తెలియదు అని చెప్పడమే ప్రస్తుతం ఈ చర్చకు కారణం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం. గవర్నర్ లను ప్రధానమంత్రి సిఫారసు చేస్తారు. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు.

మరి ఈ విషయం తెలిస్తే .. గిలిస్తే ప్రధానమంత్రి తర్వాత తెలంగాణ బీజేపీ నేతలకు తెలియాలి. లేదంటే ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డికి తెలియాలి. కానీ అందరికంటే ముందు రేవంత్ కు ఎలా తెలిసింది ? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఢిల్లీ స్థాయిలో రేవంత్ గట్టి సంబంధాలు ఏర్పరచుకున్నాడా ? లేక బీజేపీ పెద్దలు ఆయనకు ముందే తెలిపారా ? అని భావిస్తున్నారు.

త్రిపుర రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరాడు. 2018లో త్రిపురలోని చరిలం శాసనసభ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీజేపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇటీవల ఎన్నికల్లో అదే శాసనసభ స్థానం నుండి త్రిపుర మొహత పార్టీ అభ్యర్థి సుబోద్ దేబ్ బర్మ చేతిలో ఓటమి చవిచూశాడు. అయితే త్రిపురకు చెందిన వారికి గవర్నర్ స్థాయి పదవి ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

This post was last modified on July 30, 2024 10:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

46 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago