Movie News

రాజేంద్రుల వారిని వదిలేలా లేరు

ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న మాటలు క్రమంగా చిన్న మంట నుంచి అడవిని కాల్చేసిన దవానలంలా మారుతున్నాయి. నిన్న విశాల్ క్షమాపణ డిమాండ్ చేస్తూ సుదీర్ఘమైన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాజర్ కూడా సారీ చెప్పాల్సిందేనన్న రీతిలో నిరసన స్వరం వినిపించారు.

ఇప్పటిదాకా కొందరికే తెలిసిన విషయం కాస్తా తమిళనాడు వర్గాల్లో అందరికీ రీచ్ అవుతోంది. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఎంజీఆర్ అంటే కోట్లాది అభిమానులకు ఆరాధ్య దైవం. మనిషి లేకపోయినా ఆయన ప్రభావం ఇప్పటికీ సినీ, రాజకీయ రంగాల్లో బలంగా ఉంది. అందుకే రాజేంద్ర ప్రసాద్ మాటల మీద ఇంత వ్యతిరేకత వస్తోంది. ఇది క్రమంగా పెద్దగా కాకుండా ఆపడం చాలా అవసరం.

ఎంత తెలుగువాడైనా రాజేంద్రప్రసాద్ కు కోలీవుడ్ నటీనటులతో కలిసి పని చేసిన అనుభవముంది. పలు స్ట్రెయిట్  తమిళ సినిమాల్లో కూడా నటించారు. క్విక్ గన్ మురుగన్, నీ, అన్నాబెల్లె సేతుపతిలో నటించారు. ఇక బోలెడు డబ్బింగ్ చిత్రాల ద్వారా నటకిరీటి అక్కడ ఉన్న వాళ్లకు సుపరిచితుడే. సో ఏదో అనామకుడు అన్నాడని లైట్ తీసుకునే ప్రసక్తి ఉండదు. ఇప్పుడీ ఇష్యూ ట్విట్టర్ లో వైరల్ టాపిక్ అవుతోంది.

పోనీ ఆయనకు మద్దతుగా నిలబడే అవకాశాన్ని కూడా నటకిరీటి ఇవ్వలేదు. ఎందుకంటే అన్నది ఏదో మెసేజ్ రూపంలో కాదు. వీడియో ప్రూఫ్ ఉంది. సమర్ధించుకునే ఛాన్స్ ఒక్క శాతం కూడా లేదు. కాంతారావుగారిని పొగిడే క్రమంలో ఎంజీఆర్ ని తక్కువ చేయడం ఇంత సమస్య అయ్యింది. పోనీ ఈ ఇద్దరూ సమాన స్థాయి వ్యక్తులైతే ఏదోలా కవర్ చేయొచ్చు. కానీ ఆ ఛాన్స్ కూడా మిస్ అయ్యింది. కత్తివీరుడిగా పేరున్న కాంతారావు ఎంత గొప్పవారైనా ఎంజిఆర్ స్థాయికన్నా పెద్ద అనడం పొరపాటు కాదు పెద్ద తప్పు.

This post was last modified on March 13, 2026 12:52 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago