గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ అమ్మాయి కొన్ని రోజుల్లోనే సెలబ్రెటీ స్టేటస్ తెచ్చుకుంది. ఆ పాపులారిటీ సినిమా అవకాశాలు సైతం అందుకుంది. మోడల్గానూ మారింది. అలాంటి అమ్మాయి సడెన్గా ఇప్పుడు కేరళకు వచ్చి ఫర్మాన్ ఖాన్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం సంచలనం రేపింది.
ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అబ్బాయి కోసం కేరళకు వచ్చి.. తమ పెళ్లికి సహకరించాలని, కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. ఇలా కోరిన కొన్ని గంటలకే ఆమె ఫర్మాన్ను పెళ్లి కూడా చేసుకుంది. ఐతే హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం ముస్లిం అబ్బాయిలకు అలవాటే అని.. ఇది లవ్ జిహాద్ అని కొందరు సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
ఈ ఆరోపణలపై మోనాలిసా, ఫర్మాన్ జంట స్పందించింది. పెళ్లి అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఈ జోడీ.. లవ్ జిహాద్ ఆరోపణలను తిప్పి కొట్టింది.
ఈ వివాదంపై ఫుర్మాన్ ఖాన్ స్పందించారు.
ఇది లవ్ జీహాద్ కాదని.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ అని.. తామిద్దరం ఎవరి మతాలను వారు అనుసరిస్తామని.. అన్ని మతాలను గౌరవిస్తామని.. అన్నిటికంటే ముందు తామిద్దరం మనుషులం అని ఫర్మాన్ స్పష్టం చేశాడు. మరోవైపు మోనాలిసా మాట్లాడుతూ.. తనకు హిదూ ధర్మం మీద ఉన్న గౌరవం ఎప్పటికీ కొనసాగుతుందని.. పెళ్లి అనేది తన వ్యక్తిగత నిర్ణయమని, దీనికి మతం రంగు పులమవద్దని కోరింది.
మోనాలిసా, ఫర్మాన్ ఇంత స్పష్టంగా విషయం చెప్పినా.. సోషల్ మీడియాలో మాత్రం వారిపై ఎటాక్ ఆగట్లేదు. మరోవైపు మోనాలిసాకు సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కుంభమేళాలో మోనాలిసా చూపిన ధైర్యం, తన వ్యక్తిత్వం చూసి తాను ప్రభావితమయ్యానని, సనాతన ధర్మానికి ఆమె ఒక ప్రతినిధిగా నిలుస్తుందని భావించి సినిమాలో అవకాశం ఇచ్చానని.. పెళ్లి విషయంలో ఆమె నిర్ణయం తనను విస్మయానికి గురిచేసిందని ఆయనన్నారు.
This post was last modified on March 13, 2026 2:23 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…