`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు.. పార్టీ అధికార ప్రతినిధులు సహా రాష్ట్రస్థాయి కన్వీనర్లు, మీడియా చర్చల్లో పాల్గొనే వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. దీనిలో చీకోటి ప్రవీణ్కు అవకాశం కల్పించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
భాగ్యనగర్, మలక్పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా .. చీకోటి ప్రవీణ్కుమార్ను నియమించారు. దీంతో ఆయన ఆయా ప్రాంతాలకు చెందిన బీజేపీ వ్యవహారాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పార్టీ తరఫున కార్యక్రమాల నుంచి మీడియా బ్రీఫింగుల వరకు.. చీకోటి కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా ఆయన ముఖ్య భూమిక పోషించనున్నారు. ప్రస్తుతం పలువురు పదవుల కోసం వేచి చూస్తున్న క్రమంలో ఈ నియామకాలు చేపట్టడం గమనార్హం.
అనేక కేసులు..
చీకోటి ప్రవీణ్.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానీ కి అత్యంత సహచరుడు. అంతేకాదు.. 2021-23 మధ్య కాలంలో గుడివాడ కేంద్రంగా కేసినో నిర్వహించి.. కోట్ల రూపాయలను దండుకున్నారని టీడీపీ నాయకులు అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు. చివరకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ సహా.. పలు దేశాల క్యాసినో నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా చీకోటి అప్పట్లోనే అంగీకరించారు.
ఆనాడు వైసీపీ హయాంలో సంక్రాంతి, దసరాలకు క్యాసినో నిర్వహించారు. దీనిలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజునే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. అశ్లీల నృత్యాలు, పేకాటలు, మందు.. మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేశారన్న కేసులు నమోదయ్యాయి. దీంతో స్విట్జర్లాండుకు పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ శివారులో అతి పెద్ద ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని.. నెమళ్లు, క్రూరమృగాలు, కొండచిలువలను పెంచడం చీకోటి హాబీ. అలాంటి వ్యక్తి బీజేపీలో ఎప్పుడు చేరాడో తెలియదు కానీ.. ఇప్పుడు పదవులు ఇవ్వడంతో మరో సారి చర్చనీయాంశం అయ్యాడు.
This post was last modified on March 13, 2026 11:52 am
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…