`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు.. పార్టీ అధికార ప్రతినిధులు సహా రాష్ట్రస్థాయి కన్వీనర్లు, మీడియా చర్చల్లో పాల్గొనే వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. దీనిలో చీకోటి ప్రవీణ్కు అవకాశం కల్పించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
భాగ్యనగర్, మలక్పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా .. చీకోటి ప్రవీణ్కుమార్ను నియమించారు. దీంతో ఆయన ఆయా ప్రాంతాలకు చెందిన బీజేపీ వ్యవహారాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పార్టీ తరఫున కార్యక్రమాల నుంచి మీడియా బ్రీఫింగుల వరకు.. చీకోటి కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా ఆయన ముఖ్య భూమిక పోషించనున్నారు. ప్రస్తుతం పలువురు పదవుల కోసం వేచి చూస్తున్న క్రమంలో ఈ నియామకాలు చేపట్టడం గమనార్హం.
అనేక కేసులు..
చీకోటి ప్రవీణ్.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానీ కి అత్యంత సహచరుడు. అంతేకాదు.. 2021-23 మధ్య కాలంలో గుడివాడ కేంద్రంగా కేసినో నిర్వహించి.. కోట్ల రూపాయలను దండుకున్నారని టీడీపీ నాయకులు అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు. చివరకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ సహా.. పలు దేశాల క్యాసినో నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా చీకోటి అప్పట్లోనే అంగీకరించారు.
ఆనాడు వైసీపీ హయాంలో సంక్రాంతి, దసరాలకు క్యాసినో నిర్వహించారు. దీనిలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజునే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. అశ్లీల నృత్యాలు, పేకాటలు, మందు.. మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేశారన్న కేసులు నమోదయ్యాయి. దీంతో స్విట్జర్లాండుకు పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ శివారులో అతి పెద్ద ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని.. నెమళ్లు, క్రూరమృగాలు, కొండచిలువలను పెంచడం చీకోటి హాబీ. అలాంటి వ్యక్తి బీజేపీలో ఎప్పుడు చేరాడో తెలియదు కానీ.. ఇప్పుడు పదవులు ఇవ్వడంతో మరో సారి చర్చనీయాంశం అయ్యాడు.
This post was last modified on March 13, 2026 11:52 am
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…