`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు.. పార్టీ అధికార ప్రతినిధులు సహా రాష్ట్రస్థాయి కన్వీనర్లు, మీడియా చర్చల్లో పాల్గొనే వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. దీనిలో చీకోటి ప్రవీణ్కు అవకాశం కల్పించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది.
భాగ్యనగర్, మలక్పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా .. చీకోటి ప్రవీణ్కుమార్ను నియమించారు. దీంతో ఆయన ఆయా ప్రాంతాలకు చెందిన బీజేపీ వ్యవహారాలకు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు. పార్టీ తరఫున కార్యక్రమాల నుంచి మీడియా బ్రీఫింగుల వరకు.. చీకోటి కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా ఆయన ముఖ్య భూమిక పోషించనున్నారు. ప్రస్తుతం పలువురు పదవుల కోసం వేచి చూస్తున్న క్రమంలో ఈ నియామకాలు చేపట్టడం గమనార్హం.
అనేక కేసులు..
చీకోటి ప్రవీణ్.. గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నానీ కి అత్యంత సహచరుడు. అంతేకాదు.. 2021-23 మధ్య కాలంలో గుడివాడ కేంద్రంగా కేసినో నిర్వహించి.. కోట్ల రూపాయలను దండుకున్నారని టీడీపీ నాయకులు అప్పట్లోనే ఫిర్యాదులు చేశారు. చివరకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్ సహా.. పలు దేశాల క్యాసినో నిర్వాహకులతో సంబంధాలు ఉన్నాయని స్వయంగా చీకోటి అప్పట్లోనే అంగీకరించారు.
ఆనాడు వైసీపీ హయాంలో సంక్రాంతి, దసరాలకు క్యాసినో నిర్వహించారు. దీనిలో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజునే 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేశారు. అశ్లీల నృత్యాలు, పేకాటలు, మందు.. మాదకద్రవ్యాలను కూడా సరఫరా చేశారన్న కేసులు నమోదయ్యాయి. దీంతో స్విట్జర్లాండుకు పారిపోయే ప్రయత్నం చేయగా.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ శివారులో అతి పెద్ద ఫామ్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని.. నెమళ్లు, క్రూరమృగాలు, కొండచిలువలను పెంచడం చీకోటి హాబీ. అలాంటి వ్యక్తి బీజేపీలో ఎప్పుడు చేరాడో తెలియదు కానీ.. ఇప్పుడు పదవులు ఇవ్వడంతో మరో సారి చర్చనీయాంశం అయ్యాడు.
This post was last modified on March 13, 2026 11:52 am
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…