Political News

రెడ్ బుక్ రాజకీయం !

కొన్నాళ్లుగా ఏపీలో సంచ‌ల‌నాల‌కు దారి తీస్తున్న ‘రెడ్ బుక్‌’ వ్య‌వ‌హారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇటీవ‌ల కూడా.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. రెడ్ బుక్‌లో ఉన్న‌వారిని బ‌త‌క‌నివ్వ‌డం లేద‌ని కూడా ఢిల్లీలో నిర్వ‌హించిన ధ‌ర్నాలో ఆయ‌న పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై తాజాగా నారా లోకేష్ స్పందించారు. రెడ్ బుక్‌లో ఉన్న అంద‌రినీ చ‌ట్ట ప్ర‌కారం శిక్షిస్తామ‌ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదిలేద‌ని చెప్పుకొచ్చారు. అయితే.. అస‌లు రెడ్ బుక్ తెర‌వ‌కుండానే జ‌గ‌న్ గ‌గ్గోలు పెడుతున్నాడ‌ని అన్నారు.

రెడ్ బుక్ తెరిస్తే.. జ‌గ‌న్ ఏం చేస్తాడో అని నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “అవును. రెడ్ బుక్ నాద‌గ్గ‌రే ఉంది. దానిలో అనేక మంది పేర్లు కూడా ఉన్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా చెప్పాను. కొంద‌రు అధికారులు మార్పు దిశ‌గా అడుగులు వేశారు. మ‌రికొంద‌రు త‌మ ప్ర‌వ‌ర్త‌న‌ను మార్చుకోలేదు. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయి. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు చట్టప్రకారం శిక్షిస్తాం. కానీ, రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ దాకా వెళ్లి గగ్గోలు పెడుతున్నాడు” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

5 ప్రెస్ మీట్ల లెక్క ఇదీ..

జ‌గ‌న్ త‌ను అధికారంలో ఉన్న‌ప్పుడు కేవ‌లం ఐదంటే ఐదు సార్లు మీడియాతో మాట్లాడార‌ని నారా లోకేష్ అన్నారు. ఐదేళ్ల కాలంలో ఐదు సార్లు మాత్ర‌మే ఆయ‌న‌కు మీడియా క‌నిపించింద‌ని ఎద్దేవా చేశారు. కానీ, ఇప్పుడు 11 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాక‌.. కేవ‌లం నెల రోజుల వ్య‌వ‌ధిలో 5 సార్లు మీడియా ముందుకు వ‌చ్చి.. ఏదేదో చెబుతున్నార‌ని అన్నారు. “జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే.. వాస్తవాలు మేం వివరిస్తాం కదా?” అని నారా లోకేష్‌ ప్రశ్నించారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తాం అన్నారు.

ప‌ద‌వి ప్లీజ్‌!

మ‌రోవైపు నామినేటెడ్ ప‌ద‌వుల కోసం.. టీడీపీ నాయ‌కులు క్యూ క‌డుతున్నారు. అసెంబ్లీ చివ‌రి రోజు స‌మావేశాలు ముగిసిన అనంత‌రం.. వంద‌ల సంఖ్య‌లో టీడీపీ నాయ‌కులు వివిధ జిల్లాల నుంచి వ‌చ్చి నారా లోకేష్‌ను క‌లుసుకున్నారు. మ‌రికొంద‌రు ఆయ‌న హైద‌రాబాద్‌కు వెళ్తున్న స‌మ‌యంలో గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో క‌లిసి విన‌తి ప‌త్రాలు, బ‌యోడేటాను అందించారు. తాము పార్టీ కోసం ఎంతో కృషి చేశామ‌ని.. ప‌దుల సంఖ్య‌లో కేసులు పెట్టించుకున్నామ‌ని.. త‌మ‌ను గుర్తించాల‌ని చాలా మంది నాయ‌కులు నారా లోకేష్‌ను అభ్య‌ర్థించారు. అయితే, పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.

This post was last modified on July 27, 2024 2:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

3 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

6 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

7 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

7 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

9 hours ago

‘శ్రీవారి ప్ర‌సాదంలో జంతువుల కొవ్వు క‌లిపారు’

అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చి.. తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం నిలువునా మోసం చేసింద‌ని ఏపీ సీఎం…

9 hours ago