Political News

’36’ లెక్క అడిగితే.. జగన్ భోజ‌నం చేసి వెళ్ళమన్నారు

తాజాగా ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మీడియా స‌మావేశం పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇది సింగిల్ కెమెరా మీటింగ్. విలేక‌రులు చాలా మందే వ‌చ్చినా.. కెమెరాలు మాత్రం ఒక్క‌టే వ‌చ్చింది. అది కూడా.. సొంత మీడియా కెమెరా మాత్ర‌మే. ముందుగానే ఇత‌ర మీడియాల కెమెరాల‌ను తీసుకురావ‌ద్ద‌ని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. విలేక‌రుల‌కు భోజ‌నాలు ఇక్క‌డే ఏర్పాటు చేస్తున్నామ‌ని కూడా చెప్పింది. అలాగే టీ, స్నాక్స్‌ను కూడా ఇచ్చారు. ఇంత వ‌ర‌కు ఓకే.. సుదీర్ఘంగా 1.20 నిమిషాల పాటు జ‌గ‌న్ ప్ర‌సంగించారు. గ‌త త‌న హ‌యాంలో జ‌రిగిన విష‌యాల‌ను వివ‌రించారు.

అదేవిధంగా చంద్ర‌బాబు గ‌త పాల‌న‌, ఇప్పుడు 45 రోజుల పాల‌న‌ను కూడా ఉటంకిస్తూ.. జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ను పోల్చారు. కేంద్రం, ఆర్బీఐ, ఆర్థిక శాఖ లెక్క‌లు కూడా తీశారు. ఇదంతా ఓకే ఓకే.. త‌ర్వాత గ‌తానికిభిన్నంగా మీడియా మిత్రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న కొన్నింటికి స‌మాధానాలు చెప్పారు. అయితే.. ఈ లోగా ఓ మీడియా ప్ర‌తినిధి.. ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న సంధించారు. సార్ గ‌త 45 రోజుల్లో 36 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని చెబుతున్నారు క‌దా.. ఢిల్లీలో కూడా ధ‌ర్నా చేశారు క‌దా.. మ‌రి ఆ 36 మంది పేర్లు చెబుతారా? అని ప్ర‌శ్నించారు.

అంతే! అప్ప‌టి వ‌ర‌కు అంతో ఇంతో ఉల్లాసంగా క‌నిపించిన జ‌గ‌న్ ఫేస్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం చెబుతారేమోన‌ని మీడియా మిత్రులు రెండు క‌ళ్ల‌ను తాటికాయంత చేసుకుని.. పెన్నులు ప‌ట్టుకుని.. పుస్త‌కాలు స‌రిచేసుకుని రెండుచెవులు రెక్కించి చూశారు. అయితే.. జ‌గ‌న్ త‌న త‌ల‌ను ఒక‌సారి త‌న ముందున్న టేబుల్‌పైకి వంచారు. ఆ వెంట‌నే ప్ర‌శ్నించిన విలేక‌రివైపు చూస్తూ.. భోజ‌నానికి టైం అయింది. ఇప్ప‌టికే ఆల‌స్య‌మైంది. మీరంతా ఎదురు చూస్తున్నారు. ప‌దండి వెళ్దాం అంటూ ఒక్క ఉబుకున సీటు లోంచి లేచి నిల‌బ‌డ్డారు!!

కానీ, వాస్త‌వానికి.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా రాష్ట్రంలో 36 మంది చ‌నిపోయార‌ని.. చంద్ర‌బాబు హ‌యాంలో హ‌త్యారాజ‌కీ యాలు కొన‌సాగుతున్నాయ‌ని జ‌గ‌న్ స‌హా వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో కూడా ధ‌ర్నా చేశారు. అయితే..ఆ వివ‌రాలు ఇవ్వాల‌ని హోం మంత్రి అనిత నుంచి సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు కూడా అసెంబ్లీలో ప్ర‌శ్నించారు. ఆ వివ‌రాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వలేదు. తాజాగా మ‌రో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కూడా అడిగారు. ఇక‌, విలేక‌రులు కూడా ఇవ్వ‌మ‌న్నారు. కానీ, జ‌గ‌న్ మౌనంగా ఉన్నారు. మ‌రి వారు చెబుతున్న నెంబ‌ర్ త‌ప్పా? రైటా? అనేది చ‌ర్చ‌గా మారింది.

Satya

Recent Posts

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

15 minutes ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

2 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

4 hours ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

9 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

10 hours ago