అధికారంలో ఉన్నప్పుడు అంటే ఏదో అభద్రతాభావం, రక్షణ సంబంధిత విషయాలు అని భావించవచ్చు. కానీ అధికారం పోయిన తర్వాత కూడా ఆలోచనలు మార్చుకోలేక పోతే దానిని దుర్భుద్ది, దుర్మార్గం అనే అంటారు. వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీరును చూస్తే చింతచచ్చినా పులుపు చావలేదు, కిందపడ్డా మీది చేయి నాదే అన్న సామెతలు గుర్తుకు వస్తున్నాయి.
తిరుపతి పట్టణంలోని రాయల్ నగర్ లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం మీదుగా మారుతి నగర్ – రాయల్ నగర్ ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా 2019 – 2020 సంవత్సరంలో రూ.9.51 లక్షల తిరుపతి కార్పోరేషన్ నిధులను వెచ్చించి సిమెంటు రహదారిని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోడ్డుకు రెండు వైపులా రెండు గేట్లు పెట్టి స్థానికులు, ఇతరులు ఆ రోడ్డు మీద రాకుండా మూసివేశారు.
దీంతో ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆ గేట్లను తీసివేసేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో పెద్దిరెడ్డి నేరుగా తన ఇంటి వద్ద ఉన్న గేట్లను అధికారులు తొలగిస్తున్నారంటూ పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు యధాతధస్థితి కొనసాగించాలని ఆదేశాలు జారీచేసింది. అనంతరం పూర్తి విషయం తెలుసుకుని రెండు గేట్లు తెరిచి పెట్టాలని సూచించింది.
అయితే గేట్లు తెరిచిన కొంత సేపటికే ఈ రెండు గేట్లకు పెద్దిరెడ్డి కార్యాలయం ముందు మరో గేటు ఏర్పాటు చేసి స్థానికుల రాకపోకలు జరగకుండా అడ్డుకోవడం గమనార్హం. అయితే కోర్టు వ్యవహారాలు తేలేందుకు బాగా సమయం పడుతుందన్న ఆలోచనతోనే మధ్యలో మరో గేటు పెట్టినట్లు భావిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలు బేకాతరు చేస్తూ పెద్దిరెడ్డి వ్యవహరిస్తున్నాడని, స్థానిక అధికారులు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం, న్యాయస్థానం ఈ విషయంలో కలగజేసుకుని రాకపోకలు జరిగేలా గేట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
This post was last modified on July 26, 2024 6:57 pm
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…