Political News

జ‌గ‌న్ సిద్ధ‌మా.. ద‌మ్ముందా?: చంద్ర‌బాబు స‌వాల్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మాజీ సీఎం జ‌గ‌న్‌కు బిగ్ స‌వాల్ విసిరారు. ద‌మ్ముందా నీకు? అని నిల‌దీశారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో కూట‌మి అధికారంలోకివ‌చ్చిన 45 రోజుల్లోనే 36 మంది వైసీపీ నాయ‌కుల‌ను హ‌త్య చేశార‌ని.. చెబుతున్న జ‌గ‌న్‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. “నీకు ద‌మ్ము, ధైర్యం, సిగ్గు, ల‌జ్జ అనేవి ఉంటే.. ఆ 36 మంది పేర్లు బ‌య‌ట పెట్టు. నేను చ‌ర్య‌లు తీసుకుంటా. లేక‌పోతే.. అన్నీ క‌ట్టిపెట్టి తాడేప‌ల్లిలో ఉండు” అని చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్యానించారు.

“ఈ పెద్ద మ‌నిషి.. గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడ‌ట‌. రాష్ట్రంలో 36 మంది చ‌చ్చిపోయార‌ని చెప్పాడ‌ట‌. నేను చెబుతున్నా.. నీకు సిగ్గుంటే.. ముందు అసెంబ్లీకి రా! వ‌చ్చి ఇక్క‌డ మాట్లాడు. నీ హ‌యాంలో ఎంత మంది మా వాళ్ల‌ను పొట్ట‌న పెట్టుకున్నావో నేను కూడా చెబుతా. ఇప్ప‌టికే వారి పేర్లు, ఊర్లు.. అడ్ర‌స్‌లు స‌హా నీకు ఇచ్చాం. మ‌ళ్లీ ఇస్తాం. ఆ కేసుల‌న్నీ తిర‌గ‌దోడుతున్నాం. ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్ట‌ను. ఇలా ఢిల్లీ వెళ్లి దొంగ ఏడుపులు, నంగి నంగి మాట‌లు చెప్ప‌డం కాదు. ద‌మ్ముంటే ధైర్యం ఉంటే.. అసెంబ్లీకి రా!” అని స‌వాల్ రువ్వారు.

చంపినోడెవ‌డు-చ‌చ్చినోడెవ‌డు!

వినుకొండ‌లో జ‌రిగిన దారుణ హ‌త్య‌పై సీఎం చంద్ర‌బాబు స్పందించారు. అస‌లు చంపినోడెవ‌డు? చ‌చ్చినోడెవ‌డు? అని ప్ర‌శ్నించారు. ఇద్ద‌రూ నిన్న మొన్న‌టి వ‌రకు నీ పార్టీలోనే ఉన్నారా? లేరా? అని జ‌గ‌న్‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించారు. “ర‌షీద్ ఇంటికి వెళ్లి దొంగ ఏడుపులు ఏడుస్తాడు.. అక్క‌డికి వెళ్లి మా ప‌థ‌కాల గురించి మాట్లాడ‌తాడు. అసెంబ్లీకి వ‌చ్చే ద‌మ్ము లేదు కానీ.. నాట‌కాలు ఆడేందుకు మాత్రం ఉంది. ర‌షీద్ అనేవాడిని చంపిన వాళ్ల‌ను అరెస్టు చేశాం” అని చంద్ర‌బాబు తెలిపారు.

నీ ముసుగు తీస్తా..

“జ‌గ‌న్ నీ ముసుగు తీస్తా. నీ బండారం బ‌ట్ట‌బ‌య‌లు చేస్తా. నువ్వు నేర‌స్తుడివి. రాష్ట్రాన్ని స‌ర్వ‌నాశ‌నం చేశావ్‌. ప్ర‌జాస్వామ్యం అంటే.. రాజకీయాల ముసుగులో వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు తీర్చుకోవ‌డం కాదు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం కాదు. నీ ముసుగు తీస్తా.. నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూస్తా. జాగ్ర‌త్త‌” అని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

This post was last modified on July 26, 2024 4:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago