Political News

ద‌స్త‌గిరి నిందితుడు కాదు, ‘సాక్షి’

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు గురించి అంద‌రికీ తెలిసిం దే. ఈ కేసులో గొడ్డ‌లి కొనుగోలు చేయ‌డ‌మే కాదు.. వివేకాపై ఒక గొడ్డ‌లి దెబ్బ కూడా వేశాన‌ని చెప్పి.. అప్రూ వ‌ర్‌గా మారిన ద‌స్త‌గిరిని నిందితుల జాబితా నుంచి కోర్టు తొల‌గించింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆయ‌న నిందితుడిగా ఉన్నాడు. అయితే.. తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీంతో వివేకా దారుణ హ‌త్య కేసు కీల‌క మ‌లుపు తిరిగిన‌ట్టేన‌ని అంటున్నారు న్యాయ‌వాదులు.

ఎవ‌రీ ద‌స్త‌గిరి..?

క‌డ‌ప జిల్లా పులివెందుల‌కే చెందిన వ్య‌క్తి ద‌స్త‌గిరి. వివేకానంరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో.. ఈయ‌నే ఆయ‌న కు డ్రైవ‌ర్‌గా ప‌నిచేశారు. వివేకా వెంటే ఉన్నారు. అయితే.. త‌న‌కు 30 కోట్ల రూపాయ‌లు ఇస్తాన‌ని ఆశ‌చూపి .. వివేకా హ‌త్య‌లో భాగ‌స్వామిని చేశారంటూ.. వైఎస్ భాస్క‌ర‌రెడ్డి, గంగిరెడ్డిల‌పై ఆయ‌న ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అప్రైవ‌ర్‌గా మారిన విష‌యం కూడా అంద‌రికీ తెలిసిందే. నిజాలు చెబుతానంటూ.. అప్రూవ‌ర్‌గా మార‌డ‌మే కాదు.. సాక్షిగా ప‌రిగ‌ణించాలంటూ.. గ‌తంలో సీబీఐ అధికారుల‌ను వేడుకోగా.. దానికి వారు అంగీక‌రించారు.

ఈ క్ర‌మంలోనే సీబీఐ చార్జిషీట్‌లో ఇప్ప‌టికే అత‌నిని సాక్షిగా మాత్ర‌మే పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో కోర్టులో ఫైలైన కేసులోనూ త‌న‌ను నిందితుడిగా కాదు.. సాక్షిగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాల‌ని కోరుతూ.. కోన్నాళ్ల కింద‌టే నాంప‌ల్లి సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశాడు. దీనిని ప‌లు మార్లు విచారించిన కోర్టు.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టికే అప్రూవ‌ర్‌గా మారినందున‌.. సీబీఐ సైతం ద‌స్త‌గిరిని సాక్షిగానే పేర్కొన్నందున‌.. తాము కూడా.. అతనిని సాక్షిగా ప‌రిగ‌ణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సునీత ఏం చేస్తారు?

నిందితుడి నుంచి సాక్షిగా మారిన ద‌స్త‌గ‌రి విష‌యంలో వివేకానంద‌రెడ్డి కుమార్తె.. డాక్ట‌ర్ సునీత ఇప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్న ద‌స్త‌గిరికి ఆ బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని, జైలుకు త‌ర‌లించాల‌ని కోరుతూ.. గ‌తంలోనే సునీత హైకోర్టులో పిటిష‌న్ వేశారు. మ‌రోవైపు.. సీబీఐ మాత్రం ఎలాంటి కౌంట‌ర్ పిటిష‌న్ వేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో సునీత పిటిష‌న్ విచార‌ణ ద‌శ‌లో ఉన్న స‌మ‌యంలో అస‌లు ద‌స్త‌గిరిని నిందితుడే కాద‌ని, సాక్షిగా ప‌రిగ‌ణిస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. మ‌రి సునీత దీనిపై న్యాయ పోరాటం చేస్తారో లేదో చూడాలి.

This post was last modified on July 26, 2024 1:10 pm

Share
Show comments
Published by
Satya
Tags: Dastagiri

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago