ఏపీ మాజీ సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు గురించి అందరికీ తెలిసిం దే. ఈ కేసులో గొడ్డలి కొనుగోలు చేయడమే కాదు.. వివేకాపై ఒక గొడ్డలి దెబ్బ కూడా వేశానని చెప్పి.. అప్రూ వర్గా మారిన దస్తగిరిని నిందితుల జాబితా నుంచి కోర్టు తొలగించింది. నిన్న మొన్నటి వరకు ఆయన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. తాజాగా నాంపల్లిలోని సీబీఐ కోర్టు ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో వివేకా దారుణ హత్య కేసు కీలక మలుపు తిరిగినట్టేనని అంటున్నారు న్యాయవాదులు.
ఎవరీ దస్తగిరి..?
కడప జిల్లా పులివెందులకే చెందిన వ్యక్తి దస్తగిరి. వివేకానంరెడ్డి జీవించి ఉన్న రోజుల్లో.. ఈయనే ఆయన కు డ్రైవర్గా పనిచేశారు. వివేకా వెంటే ఉన్నారు. అయితే.. తనకు 30 కోట్ల రూపాయలు ఇస్తానని ఆశచూపి .. వివేకా హత్యలో భాగస్వామిని చేశారంటూ.. వైఎస్ భాస్కరరెడ్డి, గంగిరెడ్డిలపై ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అప్రైవర్గా మారిన విషయం కూడా అందరికీ తెలిసిందే. నిజాలు చెబుతానంటూ.. అప్రూవర్గా మారడమే కాదు.. సాక్షిగా పరిగణించాలంటూ.. గతంలో సీబీఐ అధికారులను వేడుకోగా.. దానికి వారు అంగీకరించారు.
ఈ క్రమంలోనే సీబీఐ చార్జిషీట్లో ఇప్పటికే అతనిని సాక్షిగా మాత్రమే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టులో ఫైలైన కేసులోనూ తనను నిందితుడిగా కాదు.. సాక్షిగా మాత్రమే పరిగణించాలని కోరుతూ.. కోన్నాళ్ల కిందటే నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ వేశాడు. దీనిని పలు మార్లు విచారించిన కోర్టు.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అప్రూవర్గా మారినందున.. సీబీఐ సైతం దస్తగిరిని సాక్షిగానే పేర్కొన్నందున.. తాము కూడా.. అతనిని సాక్షిగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సునీత ఏం చేస్తారు?
నిందితుడి నుంచి సాక్షిగా మారిన దస్తగరి విషయంలో వివేకానందరెడ్డి కుమార్తె.. డాక్టర్ సునీత ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న దస్తగిరికి ఆ బెయిల్ను రద్దు చేయాలని, జైలుకు తరలించాలని కోరుతూ.. గతంలోనే సునీత హైకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు.. సీబీఐ మాత్రం ఎలాంటి కౌంటర్ పిటిషన్ వేయలేదు. ఈ నేపథ్యంలో సునీత పిటిషన్ విచారణ దశలో ఉన్న సమయంలో అసలు దస్తగిరిని నిందితుడే కాదని, సాక్షిగా పరిగణిస్తూ.. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం.. సంచలనంగా మారింది. మరి సునీత దీనిపై న్యాయ పోరాటం చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on July 26, 2024 1:10 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…