ఏపీలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి వర్సెస్ .. కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీ టీడీపీ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న అఘాయిత్యాలను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వస్తే.. రాష్ట్రం మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.
దీనికి కౌంటర్గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. దిశ అంటూ.. దశ దిశలా చాటారు కదా.. ముందు అదేమైందో చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మహిళలపై దారుణాలు జరిగినప్పుడు.. మీరేం చేశారో.. చెప్పాలి అంటూ.. టీడీపీ నాయకులు నిలదీస్తున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్తాయిలో జరుగుతుండడం గమనార్హం.
సాయి రెడ్డి ఏమన్నారు?
కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అన్యాయానికి గురయ్యే మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడేమైంది? అంటూ మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతో వైసీపీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. అయితే.. దీనికి కౌంటర్గా టీడీపీ దిశ చట్టాన్ని ప్రస్తావించింది. లేని చట్టాన్ని ఉందని భ్రమించేలా చేస్తూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత మంది గొంతులు కోసిందో కూడా వివరించు సాయిరెడ్డీ! అంటూ ఎదురు ప్రశ్నించింది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…