Political News

సాయిరెడ్డి వ‌ర్సెస్ టీడీపీ.. ఓ రేంజ్‌లో !

ఏపీలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డి వ‌ర్సెస్ .. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క పార్టీ టీడీపీ మ‌ధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం తెర‌మీదికి వ‌చ్చింది. రాష్ట్రంలో గ‌త వారం రోజులుగా జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి ఎక్స్ వేదిక‌గా కూట‌మి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే.. రాష్ట్రం మ‌హిళ‌ల‌కు 24 గంటల్లో న్యాయం జ‌రుగుతుంద‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడు చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

దీనికి కౌంట‌ర్‌గా వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. దిశ అంటూ.. ద‌శ దిశ‌లా చాటారు క‌దా.. ముందు అదేమైందో చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మ‌హిళ‌ల‌పై దారుణాలు జ‌రిగిన‌ప్పుడు.. మీరేం చేశారో.. చెప్పాలి అంటూ.. టీడీపీ నాయ‌కులు నిల‌దీస్తున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌ధ్య మాటల యుద్ధం ఓ స్తాయిలో జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

సాయి రెడ్డి ఏమ‌న్నారు?

కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అన్యాయానికి గుర‌య్యే మ‌హిళ‌ల‌కు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడేమైంది? అంటూ మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్ష‌తో వైసీపీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా టీడీపీ దిశ చ‌ట్టాన్ని ప్ర‌స్తావించింది. లేని చ‌ట్టాన్ని ఉంద‌ని భ్ర‌మించేలా చేస్తూ.. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో ఎంత మంది గొంతులు కోసిందో కూడా వివ‌రించు సాయిరెడ్డీ! అంటూ ఎదురు ప్ర‌శ్నించింది.

This post was last modified on July 17, 2024 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

13 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

44 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago