ఏపీలో వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి వర్సెస్ .. కూటమి ప్రభుత్వంలో కీలక పార్టీ టీడీపీ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న అఘాయిత్యాలను ఉటంకిస్తూ.. సాయిరెడ్డి ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం వస్తే.. రాష్ట్రం మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నారు అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.
దీనికి కౌంటర్గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు.. దిశ అంటూ.. దశ దిశలా చాటారు కదా.. ముందు అదేమైందో చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ మహిళలపై దారుణాలు జరిగినప్పుడు.. మీరేం చేశారో.. చెప్పాలి అంటూ.. టీడీపీ నాయకులు నిలదీస్తున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం ఓ స్తాయిలో జరుగుతుండడం గమనార్హం.
సాయి రెడ్డి ఏమన్నారు?
కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అన్యాయానికి గురయ్యే మహిళలకు 24 గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడేమైంది? అంటూ మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. సుగాలి ప్రీతి ఏమైంది? చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైంది? కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు, ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రావణకాష్టాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ, కుల వివక్షతో వైసీపీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకీ యాతన అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు. అయితే.. దీనికి కౌంటర్గా టీడీపీ దిశ చట్టాన్ని ప్రస్తావించింది. లేని చట్టాన్ని ఉందని భ్రమించేలా చేస్తూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఎంత మంది గొంతులు కోసిందో కూడా వివరించు సాయిరెడ్డీ! అంటూ ఎదురు ప్రశ్నించింది.
This post was last modified on July 17, 2024 10:27 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…