Political News

జ‌గ‌న్‌ సైలన్స్ పార్టీ కి చేటు

పెద్ద‌రికం ఒక‌రు ఇస్తే వ‌చ్చేది కాదు.. త‌న‌కు తానుగా పెంచుకునేది.. త‌న‌కు తానుగా పాటించేది. ఈ విషయంలో పార్టీల అధినేతలు వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టే పార్టీ మ‌నుగ‌డ ఆధార‌ప‌డి ఉంటుంది. తెలంగాణ పెద్ద‌రికంగా వ్య‌వ‌హ‌రించిన‌.. కేసీఆర్‌.. మితిమీరిన పెద్ద‌రికం చూపించ‌డంతో అభాసుపాల‌య్యారు. సొంత పార్టీ నేత‌లే ఆయ‌న‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితిని కొని తెచ్చుకున్నారు. పెద్ద‌రికాన్ని ఎక్క‌డ ఎలా వాడుకోవా లో తెలిసి ఉండ‌డం కూడా ఒక క‌ళ‌. ఈ విష‌యంలో ఇత‌ర నాయ‌కుల‌తో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చంద్ర‌బాబు భేష్ అని అనిపించారు.

ఎక్క‌డ ఎలా మాట్లాడాలో.. ఏవిష‌యంపై ఎలా స్పందించాలో చంద్ర‌బాబు కు బాగా తెలుసు. అందుకే సుదీర్ఘ కాలంగా ఆయ‌న పార్టీని అనేక ఒడిదుడుకులు ఎదురైనా నెట్టుకువ‌స్తున్నారు. అధికారంలోకి తీసుకువ‌స్తున్నారు. ఈ విజ్ఞ‌త కొర‌వ‌డిందో ఏమో.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం.. జ‌గ‌న్ త‌న పెద్దరికాన్ని తానే పాడే చేసుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిస్థితి ముదిరితే.. మున్ముందు.. ఆయ‌న తెచ్చి పెట్టుకుందామ‌న్నా.. పెద్ద‌రికం నిల‌వ‌దు. ఇప్పుడు కేసీఆర్‌కు ఎలాంటి ప‌రిస్థితివ‌స్తుందో అదే వ‌స్తుంది.

ఏం జ‌రిగింది..

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా వైసీపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యులు వి. విజ‌య‌సాయిరెడ్డి కేంద్రంగా దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతి వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఆమెకు పుట్టిన బిడ్డ విష‌యంపై చెలరేగిన వివాదంపై స్పందించిన సాయిరెడ్డి మీడియాపైనా త‌న అక్క‌సు వెళ్ల గ‌క్కారు. ఇక‌, శాంతి త‌న వాద‌న తాను వినిపించింది. విష‌యంలో నేరుగా జ‌గ‌న్ జోక్యం చేసుకున్నా.. చేసుకోక‌పోయినా.. సాయిరెడ్డి మీడియాపై చేసిన వ్యాఖ్య‌ల‌పై అయినా.. ఆయ‌న స్పందించాల్సి ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. కానీ.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించారు.

పార్టీలో సీనియ‌ర్ నాయ‌కులు బాలినేని శ్రీనివాస‌రెడ్డి- మ‌రో నేత చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి మ‌ధ్య కోల్డ్ వార్ రోడ్డు న ప‌డింది. ఇది ఎటు మ‌లుపు తిరుగుతుందో కూడా తెలియ‌దు. ఇది సొంత పార్టీ వ్య‌వ‌హార‌మే అయినా.. జ‌గ‌న్ ఇప్పుడు జోక్యం చేసుకోక‌పోతే.. రేపు ఆయ‌న గుట్టుమట్లు కూడా బ‌య‌ట‌కు పొక్కే ప్ర‌మాదం ఉంది. అయినా.. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రాష్ట్రంలో గ‌డిచిన వారం రోజుల్లో అనేక చోట్ల చిన్న పిల్ల‌ల‌పై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. జ‌గ‌న్ ఆయా ఘ‌ట‌న‌ల‌ను ఘండించ‌డమో.. బాధితుల‌కు అండ‌గా ఉండ‌డమో చేయాలి. కానీ, ఎన్నిక‌ల్లో న‌న్ను ఓడించారు కాబ‌ట్టి.. మీచావు మీరు చావండి అన్న‌ట్టుగా వ‌దిలేశారు. ఇలా.. అనేక విష‌యాల్లో ఆయ‌న స్పందించ‌కుండా.. మౌనంగా ఉండ‌డం.. పెద్ద‌రికాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్ప‌టికే వైసీపీపై ప్ర‌జ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త పోయింది. ఇది మ‌రింత పోతే.. మ‌రో క‌మ్యూనిస్టు పార్టీగా మిగిలిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

12 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago