ఓ మహిళా అధికారితో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందని, ఆమెతో సాయిరెడ్డి బిడ్డను కూడా కన్నారని ఆమె భర్త మదన్ గోపాల్ సంచలన ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలు ఖండిస్తూ సాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని న్యూస్ ఛానెళ్లపై, కొందరు న్యూస్ ప్రజెంటర్లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒరేయ్ మీ పుట్టుక మీదే నాకు అనుమానం ఉందిరా…అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ విజయసాయి వాడిన అసభ్యకరమైన భాషపై విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై సాయిరెడ్డి వాడిన పదజాలంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై ప్రెస్ మీట్ లో విజయసాయి వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని లోకేష్ దుయ్యబట్టారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో విజయసాయి దూషించడాన్ని ఖండించారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న విజయసాయికి మంచీ మర్యాద గురించి తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
విజయసాయికి అధికారం పోయినా అహంకారం మాత్రం తగ్గలేదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో వైసీపీ నేతల భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. అయితే, ఇంత విమర్శించినా..విజయసాయిరెడ్డి గారూ అంటూ లోకేష్ సంబోధిస్తూ తన హుందాతనాన్ని చాటుకున్నారు.
This post was last modified on July 16, 2024 10:08 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…