అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అవసరం ఉన్నా, లేకున్నా ప్రతిపక్ష పార్టీ మీద తొడగొట్టారు. ప్రభుత్వ అధికారుల మీద పెత్తనం చెలాయించారు. తీరా ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారు ఎవరూ కార్యకర్తల వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకున్న నేతలు ఇప్పుడు మొకం చూపకపోవడంతో కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
సిక్కోలుగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టిన వైసీపీ 10 స్థానాలకు గాను 8 స్థానాలలో విజయం సాధించింది. దీంతో వైసీపీ ఇక్కడి నేతలకు పదవులు ఇచ్చి పెద్ద పీట వేసింది. తమ్మినేని సీతారం స్పీకర్ గా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రిగా, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల నుండి దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు.
ఇన్ని పదవులు ఇఛ్చి ఇంత ప్రోత్సాహం అందించినా ఈ ఎన్నికల్లో జిల్లాలోని పదికి పది నియోజకవర్గాలలో వైసీపీ భూస్థాపితం అయింది. టీడీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గతంలో చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం తమ మీద కేసులు పెట్టడం, విచారణ జరపడం ఖాయం అన్న భయంతో నేతలు బయటకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న నేతలు ఇప్పుడు తమకు ఎవరు అండగా ఉంటారో అన్న భయంతో ఉండగా, నాయకుల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటి ? అని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
1981 నుండి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ చేతిలో 52521 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆయన బయటకు రావడం లేదు. ఆయన సోదరుడు క్రిష్ణదాస్, మాజీ సీది అప్పలరాజు మాత్రం అడపాదడపా కార్యకర్తలకు అభయం ఇస్తున్నారు. తమ్మినేని నెల రోజులుగా మొహం చాటేశారు. ప్రభుత్వంలో దూకుడుగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నుండి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయాక పట్టించుకోవడం లేదు. ఎచ్చెర్ల, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, శాంతి, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఇచ్చాపురం నుండి పోటీ చేసి విజయల ఆచూకీ తెలియడంలేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఒక్కసారి బయటకు వచ్చి భరోసా నివ్వాలని వేడుకుంటున్నారు.
This post was last modified on July 9, 2024 10:58 am
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో రియల్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్ను విడుదల చేసింది.…
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…
అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…
ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…
దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…
రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…