Political News

సిక్కోలు పిలుస్తోంది !

అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అవసరం ఉన్నా, లేకున్నా ప్రతిపక్ష పార్టీ మీద తొడగొట్టారు. ప్రభుత్వ అధికారుల మీద పెత్తనం చెలాయించారు. తీరా ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కరిద్దరు నేతలు తప్ప మిగిలిన వారు ఎవరూ కార్యకర్తల వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకున్న నేతలు ఇప్పుడు మొకం చూపకపోవడంతో కార్యకర్తలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

సిక్కోలుగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలో 2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బ్రహ్మరథం పట్టారు. టీడీపీ కంచుకోటను బద్దలుకొట్టిన వైసీపీ 10 స్థానాలకు గాను 8 స్థానాలలో విజయం సాధించింది. దీంతో వైసీపీ ఇక్కడి నేతలకు పదవులు ఇచ్చి పెద్ద పీట వేసింది. తమ్మినేని సీతారం స్పీకర్ గా, ధర్మాన కృష్ణదాస్‌ ఉప ముఖ్యమంత్రిగా, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మంత్రిగా, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు మంత్రిగా, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల నుండి దువ్వాడ శ్రీనివాస్, నర్తు రామారావులకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు.

ఇన్ని పదవులు ఇఛ్చి ఇంత ప్రోత్సాహం అందించినా ఈ ఎన్నికల్లో జిల్లాలోని పదికి పది నియోజకవర్గాలలో వైసీపీ భూస్థాపితం అయింది. టీడీపీ ఘన విజయం సాధించింది. ఎన్నికల తర్వాత గతంలో చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం తమ మీద కేసులు పెట్టడం, విచారణ జరపడం ఖాయం అన్న భయంతో నేతలు బయటకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న నేతలు ఇప్పుడు తమకు ఎవరు అండగా ఉంటారో అన్న భయంతో ఉండగా, నాయకుల పరిస్థితే ఇలా ఉంటే తమ పరిస్థితి ఏమిటి ? అని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.

1981 నుండి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ధర్మాన ప్రసాదరావు ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థి గోండు శంకర్ చేతిలో 52521 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆయన బయటకు రావడం లేదు. ఆయన సోదరుడు క్రిష్ణదాస్, మాజీ సీది అప్పలరాజు మాత్రం అడపాదడపా కార్యకర్తలకు అభయం ఇస్తున్నారు. తమ్మినేని నెల రోజులుగా మొహం చాటేశారు. ప్రభుత్వంలో దూకుడుగా ఉన్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నుండి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయాక పట్టించుకోవడం లేదు. ఎచ్చెర్ల, పాతపట్నం మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, శాంతి, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, ఇచ్చాపురం నుండి పోటీ చేసి విజయల ఆచూకీ తెలియడంలేదని కార్యకర్తలు వాపోతున్నారు. ఒక్కసారి బయటకు వచ్చి భరోసా నివ్వాలని వేడుకుంటున్నారు.

This post was last modified on July 9, 2024 10:58 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

60 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago