Political News

రెండు క‌మిటీలు.. అప్ప‌టికీ తేల‌క పోతే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న విభ‌జ‌న అంశాల ప‌రిష్కారం కొలిక్కి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు ప్ర‌క‌టించారు. శ‌నివారం రాత్రి ప్ర‌జాభ‌వ‌న్‌లో జ‌రిగిన ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌మావేశం అనంత‌రం.. తెలంగాణ‌కు చెందిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, ఏపీకి చెందిన మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌లు ఉమ్మ‌డి ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. ప‌దేళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు శాంతియుత‌, చ‌ర్చా మార్గాల‌ను ఎంచుకున్న‌ట్టు తెలిపారు.

భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. ప‌దేళ్లుగా అనేక స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించేందుకు గ‌త ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోలేద‌న్నారు. తాము వ‌చ్చిన త‌ర్వాత‌.. చేప‌ట్టిన తొలి భేటీ ఆశాజ‌న‌కంగా సాగింద‌న్నారు. త్వ‌ర‌లోనే రెండు క‌మిటీల‌ను వేయ‌నున్న‌ట్టు చెప్పారు. మంత్రుల‌తో క‌మిటీ, అధికారుల‌తో మ‌రో క‌మిటీ వేస్తామ‌న్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆయా క‌మిటీల్లో సీనియ‌ర్ అధికారులు, మంత్రులు ఉంటార‌ని తెలిపారు. వారు సూచించిన ప్ర‌కారం.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఉంటుంద‌న్నారు. ఒక‌వేళ‌.. అప్ప‌టికీ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించ‌క‌పోతే.. మ‌రోసారి ముఖ్య‌మంత్రుల స‌మావేశం ఉంటుంద‌న్నారు.

ఏపీకి చెందిన మంత్రి అన‌గాని మాట్లాడుతూ.. దాదాపు ఇదే విష‌యాన్ని చెప్పారు. మంత్రుల క‌మిటీ వేసేందుకు రెండు వారాల స‌మ‌యం పండుతుంద‌ని.. అక్క‌డి నుంచి ఎప్పుడు నివేదిక వ‌స్తే.. దాని ప్ర‌కారం.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందు కు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఇదొక మంచి నిర్ణ‌య‌మ‌న్నారు. అదేవిధంగా అధికారుల‌తో కూడిన క‌మిటీ కూడా.. వేస్తామ‌న్నా రు. దీనిలో ఏపీ నుంచి కూడా ఉన్న‌తాధికారులు ఉంటార‌ని.. వారు విభ‌జ‌న‌చ‌ట్టంలోని ప్ర‌తి అంశాన్నీ కూలంక‌షంగా ప‌రిశీలించి.. నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని అన్నారు.

ఇక‌, ఇరు రాష్ట్రాలు కూడా.. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌పై ఉమ్మ‌డి పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు చెప్పారు. అదేస‌మ‌యంలో విభ‌జ‌న చ‌ట్టంతో సంబంధం లేని మ‌రికొన్ని అంశాల‌ను కూడా చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. దీనిలో గంజాయి, డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌కు ఏపీతో క‌లిసి తెలంగాణ అధికారులు సంయుక్తంగా ప‌నిచేయ‌నున్న‌ట్టు వివ‌రించారు. ఇరు రాష్ట్రాల అధికారులు గంజాయి ర‌వాణా, డ్ర‌గ్స్ ర‌వాణాల‌ను అడ్డుకునేందుకు సంయుక్త కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు వివ‌రించారు. కీల‌క‌మైన విద్యుత్‌, జ‌లాల పంపిణీపైనా క‌మిటీలు తీసుకునే నిర్ణ‌యాల‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్టు మంత్రులు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతానికి క‌మిటీల ఏర్పాటు వ‌ర‌కే చ‌ర్చ‌లు జ‌రిగాయ‌న్నారు.

This post was last modified on July 7, 2024 8:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది…

3 hours ago

గంపెడు సినిమాలు… గుప్పెడు అంచనాలు

రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…

3 hours ago

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

7 hours ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

11 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

13 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

13 hours ago