Political News

తిరుమ‌ల‌కు రాజ‌ధాని రైతుల యాత్ర‌.. ఇప్పుడెందుకు?

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర‌గా ముందుకు ప‌య‌న‌మ‌య్యారు. దాదాపు 500 మంది రైతులు.. పాద‌యాత్ర‌గా మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌కు బ‌య‌లు దేరారు. ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం లేకుండానే వారు మెరుపు నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనూ.. వైసీపీ పాల‌న‌లో ‘న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం’ పేరుతో పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను అన్యాయం చేస్తోందంటూ అంద‌రూ క‌దం తొక్కారు.

దాదాపు రెండు నెల‌ల పాటు ఈ యాత్ర సాగింది. 400 కిలో మీట‌ర్ల దూరాన్ని మ‌హిళ‌లు, వృద్ధులు, రైతు కూలీలు, కార్మికులు.. ఇలా అంద‌రూ పాద‌యాత్ర‌గా క‌దిలి శ్రీవారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే. న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణానికి త‌మ విలువైన భూములు ఇచ్చామ‌ని.. జ‌గ‌న్ స‌ర్కారు ఆ రాజ‌ధానిని కుప్ప‌కూలుస్తోంద‌ని.. రైతులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల శ్రీవారే త‌మ‌కు, రాష్ట్రానికి కూడా న్యాయం చేయాల‌ని అప్ప‌ట్లో రైతులు ఈ యాత్ర చేశారు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ప్ర‌భుత్వం ఈ యాత్ర‌కు అడుగ‌డుగునా అడ్డు ప‌డింది. అయితే.. న్యాయ స్థానం కొన్ని ష‌ర‌తుల‌తో అనుమ‌తి ఇచ్చింది. అయినా.. మార్గమ‌ధ్యంలో రైతుల‌ను, పాద‌యాత్ర చేస్తున్న వారిని వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. అయినా.. స్వామిపైనే భారం వేసిన రైతులు ముందుకు సాగారు. త‌మ మొక్కులు తీర్చుకున్నారు. చివ‌ర‌కు ద‌ర్శ‌నాల వ‌ద్ద కూడా.. అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆంక్ష‌లు విధించారు. వాటిని కూడా ఛేదించుకున్న రైతులు.. స్వామి వారి శ‌ర‌ణు జొచ్చారు.

కాగా, ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ కుప్ప‌కూల‌డం.. కూట‌మి స‌ర్కారు గ‌ద్దెనెక్క‌డం.. అమ‌రావ‌తి రాజ‌ధానికి ఆక్సిజ‌న్ అంద‌డంతో రాజ‌ధాని రైతులు ఆంనంద‌తో ఉన్నారు. త‌మ ఆనందానికి, అమ‌రావ‌తి నిల‌బ‌డ‌డానికి.. శ్రీవారి క‌రుణే కార‌ణ‌మ‌ని..వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో స్వామి వారిని మ‌రోసారి ద‌ర్శించుకుని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించేలా ద‌య చూపాల‌ని కోరుకుంటూ.. మ‌రోసారి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు రెడీ అయ్యారు. మ‌రి ఇది ఎన్ని రోజులు ప‌డుతుందో చూడాలి.

This post was last modified on June 25, 2024 5:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

40 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

47 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago