Political News

తిరుమ‌ల‌కు రాజ‌ధాని రైతుల యాత్ర‌.. ఇప్పుడెందుకు?

తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు పాద‌యాత్ర‌గా ముందుకు ప‌య‌న‌మ‌య్యారు. దాదాపు 500 మంది రైతులు.. పాద‌యాత్ర‌గా మంగ‌ళ‌వారం తిరుమ‌ల‌కు బ‌య‌లు దేరారు. ముంద‌స్తుగా ఎలాంటి స‌మాచారం లేకుండానే వారు మెరుపు నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలోనూ.. వైసీపీ పాల‌న‌లో ‘న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం’ పేరుతో పాద‌యాత్ర చేసిన విష‌యం తెలిసిందే జ‌గ‌న్ స‌ర్కారు త‌మ‌ను అన్యాయం చేస్తోందంటూ అంద‌రూ క‌దం తొక్కారు.

దాదాపు రెండు నెల‌ల పాటు ఈ యాత్ర సాగింది. 400 కిలో మీట‌ర్ల దూరాన్ని మ‌హిళ‌లు, వృద్ధులు, రైతు కూలీలు, కార్మికులు.. ఇలా అంద‌రూ పాద‌యాత్ర‌గా క‌దిలి శ్రీవారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే. న‌వ్యాంధ్ర రాజ‌ధాని నిర్మాణానికి త‌మ విలువైన భూములు ఇచ్చామ‌ని.. జ‌గ‌న్ స‌ర్కారు ఆ రాజ‌ధానిని కుప్ప‌కూలుస్తోంద‌ని.. రైతులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. ఈ క్ర‌మంలో తిరుమ‌ల శ్రీవారే త‌మ‌కు, రాష్ట్రానికి కూడా న్యాయం చేయాల‌ని అప్ప‌ట్లో రైతులు ఈ యాత్ర చేశారు.

అయితే.. చిత్రం ఏంటంటే.. ప్ర‌భుత్వం ఈ యాత్ర‌కు అడుగ‌డుగునా అడ్డు ప‌డింది. అయితే.. న్యాయ స్థానం కొన్ని ష‌ర‌తుల‌తో అనుమ‌తి ఇచ్చింది. అయినా.. మార్గమ‌ధ్యంలో రైతుల‌ను, పాద‌యాత్ర చేస్తున్న వారిని వైసీపీ నాయ‌కులు అడ్డుకున్నారు. అయినా.. స్వామిపైనే భారం వేసిన రైతులు ముందుకు సాగారు. త‌మ మొక్కులు తీర్చుకున్నారు. చివ‌ర‌కు ద‌ర్శ‌నాల వ‌ద్ద కూడా.. అప్ప‌టి టీటీడీ చైర్మ‌న్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆంక్ష‌లు విధించారు. వాటిని కూడా ఛేదించుకున్న రైతులు.. స్వామి వారి శ‌ర‌ణు జొచ్చారు.

కాగా, ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ కుప్ప‌కూల‌డం.. కూట‌మి స‌ర్కారు గ‌ద్దెనెక్క‌డం.. అమ‌రావ‌తి రాజ‌ధానికి ఆక్సిజ‌న్ అంద‌డంతో రాజ‌ధాని రైతులు ఆంనంద‌తో ఉన్నారు. త‌మ ఆనందానికి, అమ‌రావ‌తి నిల‌బ‌డ‌డానికి.. శ్రీవారి క‌రుణే కార‌ణ‌మ‌ని..వారు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో స్వామి వారిని మ‌రోసారి ద‌ర్శించుకుని అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించేలా ద‌య చూపాల‌ని కోరుకుంటూ.. మ‌రోసారి సుదీర్ఘ పాద‌యాత్ర‌కు రెడీ అయ్యారు. మ‌రి ఇది ఎన్ని రోజులు ప‌డుతుందో చూడాలి.

This post was last modified on June 25, 2024 5:52 pm

Share

Recent Posts

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

1 hour ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

2 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

3 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

3 hours ago

రఘురామ వెరీ హ్యాపీ: ఆకివీడు రామాల‌యానికి సుప్రీం ఓకే!

ఏపీలో గ‌త 2 మాసాల కింద‌టి వ‌ర‌కు తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌నీయాంశం అయిన ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, ఉండి నియోజ‌క‌వ‌ర్గం…

3 hours ago

కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా?: సుప్రీంకోర్టు ఘాటు ప్ర‌శ్న‌

ప్ర‌జ‌లు, శాంతియుతంగా నిర‌స‌న చేస్తున్న‌వారిని కొట్టే హ‌క్కు పోలీసుల‌కు ఉందా? అని సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…

3 hours ago