ఏపీలోను, కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిం దే. కొందరు కూటమి నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మూలాలను మరిచి పోకుండా వ్యవహరిస్తు న్నారు. తమ వృత్తిని మరిచిపోనివారు ఒకరైతే..తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెంచిన పార్టీని మరిచి పోని వారు మరొకరు. తమ మాతృభాషకు పట్టం కడుతున్నవారు ఇంకొకరు. ఇలా.. మొత్తంగా నాయకులు.. మూలాలు మరవకుండా ముందుకు సాగుతున్నారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన కేంద్ర విమానయానశాఖ మంత్రి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్న నాయకుడు. తాజాగా పార్లమెంటులో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. అయితే.. ఈ ప్రమాణం.. అచ్చమైన తెలుగు భాషలో చేయడం విశేషం. అంటే.. ఆయన తన మాతృభాషను మరిచిపోలేదన్న మాట.
కలిశెట్టి అప్పలనాయుడు: ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్పై తొలిసారి విజయం దక్కించుకున్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ఈయన ఆర్థికంగా అంతంత మాత్రమే నని ఇటీవల చంద్రబాబు కూడా చెప్పారు. అంతేకాదు.. ఆయనకు పార్టీ సింబల్ సైకిల్ అంటే ఎనలేని ప్రేమ. తాజాగా ఈ ప్రేమను ఆయన చేతల్లో నిరూపించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్పై వచ్చి.. అందరినీ ఆశ్చచకితులను చేశారు.
పంతం నానాజీ: ఈయన జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. మత్స్యకార సామాజిక వర్గానికిచెందిన నాయకుడు. ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. అయితే.. అందరిలా కాకుండా.. డిఫరెంట్గా మత్స్యకార వేషంలో రావడం గమనార్హం. చేతిలో చేప, వీపుకు మత్సకార బుట్ట, చేతిలో గేలం పట్టుకుని అసెంబ్లీలో ప్రత్యక్ష మయ్యారు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా.. వీరంతా తమ మూలాలను.. మరిచిపోకుండా.. ఉన్నతస్థాయిలో ఉన్నా సగౌరవంగా వ్యవహరించడం గమనార్హం.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…