ఏపీలోను, కేంద్రంలోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిం దే. కొందరు కూటమి నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మూలాలను మరిచి పోకుండా వ్యవహరిస్తు న్నారు. తమ వృత్తిని మరిచిపోనివారు ఒకరైతే..తమకు రాజకీయంగా ప్రాధాన్యం పెంచిన పార్టీని మరిచి పోని వారు మరొకరు. తమ మాతృభాషకు పట్టం కడుతున్నవారు ఇంకొకరు. ఇలా.. మొత్తంగా నాయకులు.. మూలాలు మరవకుండా ముందుకు సాగుతున్నారు.
కింజరాపు రామ్మోహన్ నాయుడు: ఈయన కేంద్ర విమానయానశాఖ మంత్రి. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి విజయం దక్కించుకున్న నాయకుడు. తాజాగా పార్లమెంటులో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. అయితే.. ఈ ప్రమాణం.. అచ్చమైన తెలుగు భాషలో చేయడం విశేషం. అంటే.. ఆయన తన మాతృభాషను మరిచిపోలేదన్న మాట.
కలిశెట్టి అప్పలనాయుడు: ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ టికెట్పై తొలిసారి విజయం దక్కించుకున్నారు. అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న ఈయన ఆర్థికంగా అంతంత మాత్రమే నని ఇటీవల చంద్రబాబు కూడా చెప్పారు. అంతేకాదు.. ఆయనకు పార్టీ సింబల్ సైకిల్ అంటే ఎనలేని ప్రేమ. తాజాగా ఈ ప్రేమను ఆయన చేతల్లో నిరూపించారు. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు ఆయన సైకిల్పై వచ్చి.. అందరినీ ఆశ్చచకితులను చేశారు.
పంతం నానాజీ: ఈయన జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే. మత్స్యకార సామాజిక వర్గానికిచెందిన నాయకుడు. ఇటీవల అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చారు. అయితే.. అందరిలా కాకుండా.. డిఫరెంట్గా మత్స్యకార వేషంలో రావడం గమనార్హం. చేతిలో చేప, వీపుకు మత్సకార బుట్ట, చేతిలో గేలం పట్టుకుని అసెంబ్లీలో ప్రత్యక్ష మయ్యారు. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఏదేమైనా.. వీరంతా తమ మూలాలను.. మరిచిపోకుండా.. ఉన్నతస్థాయిలో ఉన్నా సగౌరవంగా వ్యవహరించడం గమనార్హం.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…