ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరాజయాన్ని తట్టుకోలేక ఫలానా జిల్లాలో ఒకరు మృతి. మరో చోట ఇంకొకరి మరణం.. ఇదీ వైసీపీ పత్రిక, ఛానెళ్లు, సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తున్న వార్తలు.
జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలు వచ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్పటికీ జగన్ పార్టీ ఓటమిని చూసి తట్టుకోలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు జనాలకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఎలా మరణించినా సరే ఆ చావును వైసీపీ ఓటమి ఖాతాలోకి తోసేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ శవాల లెక్క వెనుక మరో ప్రధాన కారణం ఉందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కోసం ఈ చావుల జాబితాను సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించేంత వరకూ ఇలాంటి చావులు జరుగుతూనే ఉంటాయని, శవాల లెక్క పెరుగుతూనే ఉంటుదనే ట్రోల్స్ వస్తున్నాయి.
2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విని జనాలు చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వెళ్లింది.
కానీ ఓదార్పు యాత్ర కోసమే జగన్ ఈ శవ రాజకీయాలు చేశారనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చిందనే టాక్ ఉంది. అప్పుడు ఓదార్పు యాత్రను తన బల ప్రదర్శన కోసమే జగన్ ఉపయోగించుకున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఓటమి నేపథ్యంలో మరోసారి ఓదార్పు యాత్ర కోసం శవాల లెక్క పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 24, 2024 1:22 pm
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…
ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…
2014లో ఉమ్మడి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో..…
స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు ప్రాణం…
ఐపీఎల్లో ముంబయితో సమానంగా ఐదుసార్లు విజేతగా నిలిచిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబయి కంటే ఎక్కువగా ఫైనల్స్ ఆడిన,…