Political News

జగన్ ఓటమి చూసి ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారా

ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ప‌రాజ‌యాన్ని త‌ట్టుకోలేక ఫ‌లానా జిల్లాలో ఒక‌రు మృతి. మ‌రో చోట ఇంకొక‌రి మ‌ర‌ణం.. ఇదీ వైసీపీ ప‌త్రిక‌, ఛానెళ్లు, సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వ‌స్తున్న వార్త‌లు.

జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ ఫ‌లితాలు వ‌చ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్ప‌టికీ జ‌గ‌న్ పార్టీ ఓట‌మిని చూసి త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌నే వార్త‌లు జ‌నాల‌కే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

ఎలా మ‌ర‌ణించినా స‌రే ఆ చావును వైసీపీ ఓట‌మి ఖాతాలోకి తోసేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ శ‌వాల లెక్క వెనుక మ‌రో ప్ర‌ధాన కార‌ణం ఉంద‌ని రాజ‌కీయ నాయ‌కులు విశ్లేషిస్తున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర కోసం ఈ చావుల జాబితాను సిద్ధం చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న ఓదార్పు యాత్ర ప్రారంభించేంత వ‌ర‌కూ ఇలాంటి చావులు జ‌రుగుతూనే ఉంటాయ‌ని, శ‌వాల లెక్క పెరుగుతూనే ఉంటుద‌నే ట్రోల్స్ వ‌స్తున్నాయి.

2009లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మ‌ర‌ణ‌వార్త విని జ‌నాలు చ‌నిపోయార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వెళ్లింది.

కానీ ఓదార్పు యాత్ర కోస‌మే జ‌గ‌న్ ఈ శ‌వ రాజ‌కీయాలు చేశారనే విష‌యం తర్వాత వెలుగులోకి వ‌చ్చింద‌నే టాక్ ఉంది. అప్పుడు ఓదార్పు యాత్రను త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కోస‌మే జ‌గ‌న్ ఉప‌యోగించుకున్నార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇప్పుడు ఓట‌మి నేప‌థ్యంలో మ‌రోసారి ఓదార్పు యాత్ర కోసం శ‌వాల లెక్క పెంచుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on June 24, 2024 1:22 pm

Share

Recent Posts

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

14 minutes ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

49 minutes ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

2 hours ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

3 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

4 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

5 hours ago