Political News

జగన్ ఓటమి చూసి ఇంకా ప్రాణాలు కోల్పోతున్నారా

ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీ ప‌రాజ‌యాన్ని త‌ట్టుకోలేక ఫ‌లానా జిల్లాలో ఒక‌రు మృతి. మ‌రో చోట ఇంకొక‌రి మ‌ర‌ణం.. ఇదీ వైసీపీ ప‌త్రిక‌, ఛానెళ్లు, సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టికీ వ‌స్తున్న వార్త‌లు.

జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీకి కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. ఈ ఫ‌లితాలు వ‌చ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్ప‌టికీ జ‌గ‌న్ పార్టీ ఓట‌మిని చూసి త‌ట్టుకోలేక ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నార‌నే వార్త‌లు జ‌నాల‌కే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

ఎలా మ‌ర‌ణించినా స‌రే ఆ చావును వైసీపీ ఓట‌మి ఖాతాలోకి తోసేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ శ‌వాల లెక్క వెనుక మ‌రో ప్ర‌ధాన కార‌ణం ఉంద‌ని రాజ‌కీయ నాయ‌కులు విశ్లేషిస్తున్నారు.

మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓదార్పు యాత్ర కోసం ఈ చావుల జాబితాను సిద్ధం చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న ఓదార్పు యాత్ర ప్రారంభించేంత వ‌ర‌కూ ఇలాంటి చావులు జ‌రుగుతూనే ఉంటాయ‌ని, శ‌వాల లెక్క పెరుగుతూనే ఉంటుద‌నే ట్రోల్స్ వ‌స్తున్నాయి.

2009లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆయన మ‌ర‌ణ‌వార్త విని జ‌నాలు చ‌నిపోయార‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఆ సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ వెళ్లింది.

కానీ ఓదార్పు యాత్ర కోస‌మే జ‌గ‌న్ ఈ శ‌వ రాజ‌కీయాలు చేశారనే విష‌యం తర్వాత వెలుగులోకి వ‌చ్చింద‌నే టాక్ ఉంది. అప్పుడు ఓదార్పు యాత్రను త‌న బ‌ల ప్ర‌ద‌ర్శ‌న కోస‌మే జ‌గ‌న్ ఉప‌యోగించుకున్నార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఇప్పుడు ఓట‌మి నేప‌థ్యంలో మ‌రోసారి ఓదార్పు యాత్ర కోసం శ‌వాల లెక్క పెంచుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Satya

Recent Posts

ఇంకెంతమంది లెఫ్ట్ హ్యాండర్స్… పటిదార్ కనిపించట్లేదా?

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…

15 minutes ago

అనుభవం తోడయ్యుంటే ‘బంధం’ బలంగా ఉండేది  

ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…

52 minutes ago

విశ్వంభరకు అసలు ఇరకాటం అదే

రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…

1 hour ago

జ‌న‌సేన‌లోకి వంగవీటి కుమార్తె..!

కాపు నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమార్తె ఆశాల‌త త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…

2 hours ago

కన్నీటితో రొనాల్డో… వరల్డ్ కప్ లో తీరని కల!

ఫుట్‌బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…

3 hours ago

ట్రిలియనీర్ క్లబ్ నుంచి మస్క్ అవుట్

కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…

3 hours ago