ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ పరాజయాన్ని తట్టుకోలేక ఫలానా జిల్లాలో ఒకరు మృతి. మరో చోట ఇంకొకరి మరణం.. ఇదీ వైసీపీ పత్రిక, ఛానెళ్లు, సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తున్న వార్తలు.
జూన్ 4 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఫలితాలు వచ్చి దాదాపు 20 రోజులు కావొస్తోంది. కానీ ఇప్పటికీ జగన్ పార్టీ ఓటమిని చూసి తట్టుకోలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే వార్తలు జనాలకే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఎలా మరణించినా సరే ఆ చావును వైసీపీ ఓటమి ఖాతాలోకి తోసేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ శవాల లెక్క వెనుక మరో ప్రధాన కారణం ఉందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు.
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర కోసం ఈ చావుల జాబితాను సిద్ధం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఓదార్పు యాత్ర ప్రారంభించేంత వరకూ ఇలాంటి చావులు జరుగుతూనే ఉంటాయని, శవాల లెక్క పెరుగుతూనే ఉంటుదనే ట్రోల్స్ వస్తున్నాయి.
2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త విని జనాలు చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఆ సంఖ్య క్రమంగా పెరుగుతూ వెళ్లింది.
కానీ ఓదార్పు యాత్ర కోసమే జగన్ ఈ శవ రాజకీయాలు చేశారనే విషయం తర్వాత వెలుగులోకి వచ్చిందనే టాక్ ఉంది. అప్పుడు ఓదార్పు యాత్రను తన బల ప్రదర్శన కోసమే జగన్ ఉపయోగించుకున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు ఓటమి నేపథ్యంలో మరోసారి ఓదార్పు యాత్ర కోసం శవాల లెక్క పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 24, 2024 1:22 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…