ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక టీడీపీ నాయకుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా ఆ 31 మంది నాయకులు ఏమీ ఆశించకుండా కూటమి విజయం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్లను పదవులతో గౌరవించేందుకు బాబు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఇంతకీ ఆ 31 మంది ఎవరూ అంటే.. పొత్తులో భాగంగా టికెట్లు వదులుకున్న టీడీపీ నాయకులే.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 175కి గాను 144 స్థానాల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా మిగతా 31 స్థానాల్లో.. 21 స్థానాలను జనసేనకు, 10 స్థానాలను బీజేపీకి కేటాయించింది. దీంతో ఈ 31 నియోజకవర్గాల టీడీపీ ఇంఛార్జులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. అదే 2019లో టీడీపీ ఒంటరిగానే 175 స్థానాల్లో పోటీ చేయడంతో నాయకులందరూ బరిలో దిగారు. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. జగన్ను గద్దె దించాలనే లక్ష్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొంతమందికి టికెట్లు దక్కలేదు. ముఖ్యంగా ఈ 31 మంది టీడీపీ నాయకులకు నిరాశే ఎదురైంది. కానీ బాబు మాటకు కట్టుబడి వీళ్లు కూటమి విజయం కోసం తీవ్రంగా శ్రమించారు.
ఉదాహరణకు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం కోసం టీడీపీ ఇంఛార్జీ వర్మ ఎంతలా కష్టపడ్డారో చూశాం. ఇదే విధంగా మిగతా 30 నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓట్లు.. కూటమి అభ్యర్థులకు పడేలా ఈ నాయకులు చూశారు. అందుకే ఇప్పుడీ 31 మందికి పదవులు ఇచ్చేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. కష్టపడ్డ వాళ్లకు గుర్తింపు ఉంటుందని చాటేందుకే నామినేటెడ్ పోస్టులతో పాటు రాజ్యసభ, శాసన మండలిలో ఖాళీ అయ్యే స్థానాలను వీళ్లకు కట్టుబెట్టే అవకాశముంది.
This post was last modified on June 24, 2024 9:58 am
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…