Political News

ఆ 31 మందికి ప‌ద‌వులు ఇస్తానంటోన్న బాబు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక టీడీపీ నాయ‌కుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా ఆ 31 మంది నాయ‌కులు ఏమీ ఆశించ‌కుండా కూట‌మి విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు వీళ్ల‌ను ప‌దవుల‌తో గౌర‌వించేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఇంత‌కీ ఆ 31 మంది ఎవ‌రూ అంటే.. పొత్తులో భాగంగా టికెట్లు వ‌దులుకున్న టీడీపీ నాయ‌కులే.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ 175కి గాను 144 స్థానాల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా మిగ‌తా 31 స్థానాల్లో.. 21 స్థానాల‌ను జ‌న‌సేన‌కు, 10 స్థానాల‌ను బీజేపీకి కేటాయించింది. దీంతో ఈ 31 నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ ఇంఛార్జుల‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం రాలేదు. అదే 2019లో టీడీపీ ఒంట‌రిగానే 175 స్థానాల్లో పోటీ చేయ‌డంతో నాయ‌కులంద‌రూ బ‌రిలో దిగారు. కానీ ఈ సారి ప‌రిస్థితి అలా లేదు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతోనే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో కొంత‌మందికి టికెట్లు ద‌క్క‌లేదు. ముఖ్యంగా ఈ 31 మంది టీడీపీ నాయ‌కుల‌కు నిరాశే ఎదురైంది. కానీ బాబు మాట‌కు క‌ట్టుబ‌డి వీళ్లు కూట‌మి విజ‌యం కోసం తీవ్రంగా శ్ర‌మించారు.

ఉదాహ‌ర‌ణ‌కు పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం కోసం టీడీపీ ఇంఛార్జీ వ‌ర్మ ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డారో చూశాం. ఇదే విధంగా మిగ‌తా 30 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ఓట్లు.. కూట‌మి అభ్య‌ర్థుల‌కు ప‌డేలా ఈ నాయ‌కులు చూశారు. అందుకే ఇప్పుడీ 31 మందికి ప‌ద‌వులు ఇచ్చేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నార‌ని తెలిసింది. క‌ష్ట‌ప‌డ్డ వాళ్ల‌కు గుర్తింపు ఉంటుంద‌ని చాటేందుకే నామినేటెడ్ పోస్టుల‌తో పాటు రాజ్య‌స‌భ‌, శాస‌న మండ‌లిలో ఖాళీ అయ్యే స్థానాల‌ను వీళ్ల‌కు క‌ట్టుబెట్టే అవ‌కాశ‌ముంది.

This post was last modified on June 24, 2024 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

25 minutes ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

1 hour ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

2 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

2 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

3 hours ago

ఏపీ సర్కారు వేసిన కమిషన్… దోషులను పట్టిస్తుందా?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ఇప్ప‌టికే సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచార‌ణ…

3 hours ago