Political News

ఆ 31 మందికి ప‌ద‌వులు ఇస్తానంటోన్న బాబు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరింది. ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. అయితే ఈ గెలుపు వెనుక టీడీపీ నాయ‌కుల త్యాగం కూడా ఉంది. ముఖ్యంగా ఆ 31 మంది నాయ‌కులు ఏమీ ఆశించ‌కుండా కూట‌మి విజ‌యం కోసం క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు వీళ్ల‌ను ప‌దవుల‌తో గౌర‌వించేందుకు బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఇంత‌కీ ఆ 31 మంది ఎవ‌రూ అంటే.. పొత్తులో భాగంగా టికెట్లు వ‌దులుకున్న టీడీపీ నాయ‌కులే.

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ 175కి గాను 144 స్థానాల్లో పోటీ చేసింది. పొత్తులో భాగంగా మిగ‌తా 31 స్థానాల్లో.. 21 స్థానాల‌ను జ‌న‌సేన‌కు, 10 స్థానాల‌ను బీజేపీకి కేటాయించింది. దీంతో ఈ 31 నియోజ‌క‌వ‌ర్గాల టీడీపీ ఇంఛార్జుల‌కు ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం రాలేదు. అదే 2019లో టీడీపీ ఒంట‌రిగానే 175 స్థానాల్లో పోటీ చేయ‌డంతో నాయ‌కులంద‌రూ బ‌రిలో దిగారు. కానీ ఈ సారి ప‌రిస్థితి అలా లేదు. జ‌గ‌న్‌ను గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతోనే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డ‌టంతో కొంత‌మందికి టికెట్లు ద‌క్క‌లేదు. ముఖ్యంగా ఈ 31 మంది టీడీపీ నాయ‌కుల‌కు నిరాశే ఎదురైంది. కానీ బాబు మాట‌కు క‌ట్టుబ‌డి వీళ్లు కూట‌మి విజ‌యం కోసం తీవ్రంగా శ్ర‌మించారు.

ఉదాహ‌ర‌ణ‌కు పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం కోసం టీడీపీ ఇంఛార్జీ వ‌ర్మ ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డారో చూశాం. ఇదే విధంగా మిగ‌తా 30 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ఓట్లు.. కూట‌మి అభ్య‌ర్థుల‌కు ప‌డేలా ఈ నాయ‌కులు చూశారు. అందుకే ఇప్పుడీ 31 మందికి ప‌ద‌వులు ఇచ్చేందుకు బాబు రంగం సిద్ధం చేస్తున్నార‌ని తెలిసింది. క‌ష్ట‌ప‌డ్డ వాళ్ల‌కు గుర్తింపు ఉంటుంద‌ని చాటేందుకే నామినేటెడ్ పోస్టుల‌తో పాటు రాజ్య‌స‌భ‌, శాస‌న మండ‌లిలో ఖాళీ అయ్యే స్థానాల‌ను వీళ్ల‌కు క‌ట్టుబెట్టే అవ‌కాశ‌ముంది.

This post was last modified on June 24, 2024 9:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago