Political News

పవన్ పై చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్

ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబును టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ కు కూటమి ఎమ్మెల్యేలు లేఖ పంపనున్నారు. ఈ క్రమంలోనే తనను కూటమి తరఫున శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నందుకు కూటమిలోని మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు.

తాను జైల్లో ఉన్నపుడు పవన్‌ కల్యాణ్ తనకు ఇచ్చిన భరోసాను ఎప్పటికీ మరచిపోలేని, జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామార్శించడంతో పాటు టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారని ఎమోషనల్ అయ్యారు. నేను సీఎం అయినా… నా సోదరుడు పవన్ కల్యాణ్ కు రేపు సముచిత హోదా కల్పిస్తూ ప్రకటన చేస్తానని చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయినా మామూలు మనిషిగానే జనంలోకి వస్తానని, తాను, పవన్ అందరూ సామాన్యులమేనని అన్నారు. అందరితో కలిసి ఉంటామని, ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. తన కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని అధికారులను ఆదేశించానని తెలిపారు.

తమకు పదవి ప్రజా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని అన్నారు. ‘అహంకారం పనికి రాదు. సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగా చెట్లు కొట్టేయడం, రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం ఉండవు. సీఎం కూడా మామూలు మనిషే’ అని జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు. చరిత్రలో మునుపెఎప్పుడూ ఇవ్వని తీర్పును ఏపీ ప్రజలు ఇచ్చారని, దానిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూటమిపై ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని, ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలసి పనిచేశామని చెప్పారు.

అందుకే, ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు. ఏపీని కాపాడుకునేందుకు ప్రజలు చొరవ చూపించారని, నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారని కితాబిచ్చారు.. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబిచ్చారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం అన్నారు. అటు బీజేపీ పోటీచేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొంది ‘సత్తాచాటిందన్నారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ, గౌరవం పెరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

కాగా, పవన్, భువనేశ్వరిలకు వేసిన కుర్చీలు కాకుండా తనకు ప్రత్యేక కుర్చీ వేయడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము సమానమని, వారి వంటి కుర్చీ వేయాలని సిబ్బందికి చెప్పి మరీ కుర్చీ మార్పించుకున్నారు చంద్రబాబు. దీంతో, అసలు సిసలు లీడర్ చంద్రబాబు సింప్లిసిటీ ఇది అంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

This post was last modified on June 11, 2024 3:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పిక్ టాక్: సూపర్ సెక్సీ ‘పెళ్ళికూతురు’

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్‌తో చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్న అమ్మాయి అవికా గోర్. ఆ గుర్తింపుతోనే…

10 hours ago

నభూతో అనిపించేలా మోక్షు లాంచింగ్

నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రకటన రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ…

11 hours ago

వైసీపీకి ఛాన్స్ ఇవ్వ‌ని టీడీపీ ..!

టీడీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే ఆదిమూలంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో రాజ‌కీయంగా వైసీపీ పుంజుకునే అవ‌కాశం వ‌చ్చింద‌నే చ‌ర్చ జ‌రిగింది. నిన్న మొన్న‌టి…

15 hours ago

బెంగళూరును ముంచెత్తిన గోట్.. గొడవ గొడవ

బెంగళూరులో స్థానికేతరుల ఆధిపత్యం గురించి లోకల్స్ గొడవ చేయడం ఎప్పట్నుంచో ఉన్న సమస్య. ఈ మధ్య ఈ గొడవ మరింత…

18 hours ago

దేవర ఊపు మామూలుగా లేదు

వేసవిలో టాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయాక ‘కల్కి’ జోరుతో కొంచెం కోలుకుంది. ఇటీవల ‘సరిపోదా శనివారం’ కొంత ఉత్సాహాన్నిచ్చింది. భారీ వర్షాల్లోనూ…

18 hours ago

పొలిటిక‌ల్ టాక్‌- జ‌గ‌న్ కంటే ష‌ర్మిల న‌యం

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా చాలా వెనుక‌బ‌డి పోయారు. 11 మంది ఎమ్మెల్యేలు, 13 మం…

18 hours ago