ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 164 స్థానాలలో కూటమి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట ఏ ఫైళ్ల మీద సంతకం చేస్తాడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మూడు ఫైళ్ల మీద సంతకం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉండనున్నట్లు తెలుస్తుంది. మెగా డీఎస్సీ అంటూ వైసీపీ మోసం చేసిందని తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని టీడీపీ పలు సభల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి సంతకం మెగా డీఎస్సీ మీదనే అని అంటున్నారు.
ఇక రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని, దీనిని ఏప్రిల్ నెల నుంచే అమలు ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7 వేలు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హామిల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మూడో సంతకం చేసే అవకాశం ఉంది.
This post was last modified on June 10, 2024 6:40 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…