ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 164 స్థానాలలో కూటమి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట ఏ ఫైళ్ల మీద సంతకం చేస్తాడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మూడు ఫైళ్ల మీద సంతకం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉండనున్నట్లు తెలుస్తుంది. మెగా డీఎస్సీ అంటూ వైసీపీ మోసం చేసిందని తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని టీడీపీ పలు సభల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి సంతకం మెగా డీఎస్సీ మీదనే అని అంటున్నారు.
ఇక రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని, దీనిని ఏప్రిల్ నెల నుంచే అమలు ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7 వేలు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హామిల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మూడో సంతకం చేసే అవకాశం ఉంది.
This post was last modified on June 10, 2024 6:40 pm
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…