ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 164 స్థానాలలో కూటమి విజయం సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీపార్క్ వద్ద జూన్ 12 ఉదయం 11:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు మొదట ఏ ఫైళ్ల మీద సంతకం చేస్తాడు అన్న ప్రశ్నలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మూడు ఫైళ్ల మీద సంతకం చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉండనున్నట్లు తెలుస్తుంది. మెగా డీఎస్సీ అంటూ వైసీపీ మోసం చేసిందని తాము అధికారంలోకి రాగానే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని టీడీపీ పలు సభల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి సంతకం మెగా డీఎస్సీ మీదనే అని అంటున్నారు.
ఇక రెండో సంతకం పింఛన్ల పెంపు మీద ఉండే అవకాశం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పింఛన్లు నాలుగు వేలకు పెంచుతామని, దీనిని ఏప్రిల్ నెల నుంచే అమలు ప్రకటించారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు నెలకు వేయి చొప్పున అదనంగా రావాల్సిన పింఛన్ను కలిపి జూన్ నెల పింఛన్ 7 వేలు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల హామిల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మూడో సంతకం చేసే అవకాశం ఉంది.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…