2024 ఎన్నికలకు ముందు మాజీ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, రెండు సార్లు టీడీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచిన నాని..ఈసారి వైసీపీ టికెట్ మీద ఓడిపోయారు. సొంత తమ్ముడు చిన్ని చేతిలో భారీ మెజారిటీతో నాని పరాభవం పాలయ్యారు. ఈ క్రమంలోనే నాని రాజకీయ భవిష్యత్ ఏమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే తన పొలిటికల్ కెరీర్ పై నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. ఈ రోజుతో తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని సంచలన ప్రకటన చేశారు.
ఎన్నో అంశాలను, పలు వైపుల నుంచి వచ్చిన ప్రతిస్పందనలను గమనించిన తర్వాతే రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పారు. రెండుసార్లు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కేశినేని నాని అన్నారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢసంకల్పం తనకు స్ఫూర్తినిస్తాయని, వారి అచంచలమైన మద్దతుకు తాను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చెప్పారు.
తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా విజయవాడపై తన అంకితభావం బలంగానే ఉంటుందని, విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని, ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను తనతో తీసుకువెళుతున్నానని అన్నారు. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు నాని శుభాకాంక్షలు తెలిపారు.
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…