భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 ఏడి. గత రెండు మూడు నెలలుగా సరైన స్టార్ హీరో బొమ్మ లేక ముంబై నుంచి హైదరాబాద్ దాకా థియేటర్లన్నీ ఆకలి మీదున్నాయి. నాగఅశ్విన్ దర్శత్వంలో వైజయంతి మూవీస్ ఆరు వందల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న ఈ విజువల్ వండర్ ట్రైలర్ ని ఇవాళ ఏపీ తెలంగాణలోని ఎంపిక చేసిన ప్రధాన స్క్రీన్లలో స్పెషల్ ప్రీమియర్ చేశారు. రాజమౌళి రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉన్న కంటెంట్ గా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. మూడు నిముషాలున్న వీడియోలో తన విజన్ చూపించారు నాగఅశ్విన్.
ప్రపంచపు మొదటి, చివరి ఊరిగా చెప్పుకునే కాశి నగరం మీద దుష్టశక్తుల కళ్ళు పడతాయి. లోక రక్షణ కోసం దేనికైనా తెగించే అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్) ఒక ప్రాణిని కాపాడేందుకు కంకణం కట్టుకుంటాడు. దానికి భైరవ (ప్రభాస్) సహాయం అవసరమవుతుంది. కాలంతో పాటు ప్రయాణించే బుజ్జి వాహనాన్ని తోడుగా తీసుకుని లక్ష్యం వైపు బయలుదేరతాడు. లోక కళ్యాణం కోసం దొరక్కుండా ఉన్న అమ్మాయి (దీపికా పదుకునే)ని తీసుకొచ్చే బాధ్యత ఇతని మీద పడుతుంది. అసలు కలియుగాంతం నుంచి కల్కి అవతారం దాకా వేల సంవత్సరాల మధ్యలో అసలేం జరిగిందనేది జూన్ 27 తెరమీద చూస్తేనే కిక్కు.
విజువల్స్ చూస్తుంటే టెర్రిఫిక్ అనే మాట చిన్నదే అనిపిస్తుంది. నాగ అశ్విన్ ఊహాలోకం ఈ కొంత నిడివికే ఇలా అనిపిస్తే రేపు స్క్రీన్ మీద రెండు ముప్పావు గంటల పాటు ఎవరికి వారు తమను తాము మర్చిపోవడం ఖాయమే. ప్రభాస్ ఇంట్రో, అమితాబ్ బచ్చన్ ఎలివేషన్ షాట్, భీకరమైన దాడులు జరిగే సన్నివేశాలు, షాకింగ్ గెటప్ లో కమల్ హాసన్ ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం, జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ ఛాయాగ్రహణం ఒకదానితో మరొకటి హాలీవుడ్ రేంజ్ లో పోటీపడ్డాయి. జూన్ 27 దాకా ఎదురు చూడటం చాలా కష్టమనిపించే రేంజ్ లో కల్కి చేసిన మాయాజాలం ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో.
This post was last modified on June 10, 2024 8:44 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…