ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు విజయంపై ఇటు కూటమి, అటు వైసీపీ ధీమాతోనే కనిపించాయి. ఐతే ధీమా వ్యక్తం చేయడం వరకు ఓకే కానీ.. వైసీపీ వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని.. అందుకు ముహూర్తం కూడా పెట్టేశారని.. వేదిక కూడా సిద్ధమైందని.. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయని తెగ ప్రచారం చేసుకున్నారు.
ఇంత అతి అవసరమా, రేప్పొద్దున ఫలితాలే తేడా కొడితే ట్రోలింగ్ తప్పదు అనే హెచ్చరికలు వచ్చినా వాళ్లు పట్టించుకోలేదు. చివరికి వాళ్లు అనుమానాలే నిజమయ్యాయి. వైసీపీ ఓడిపోయింది. అది కూడా మామూలుగా కాదు.. చిత్తు చిత్తుగా. దీంతో ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల నుంచే వైసీపీ మీద ట్రోలింగ్ ఒక రేంజిలో జరుగుతోంది.
ముఖ్యంగా విశాఖపట్నంలో తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం గురించి వైసీపీ ఇంతకుముందు చేసిన హడావుడి మీద జరుగుతున్న ట్రోలింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలు విశాఖలో ప్రమాణ స్వీకారం గురించి చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టిన పోస్టులన్నీ బయటికి తీసి.. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు.
మొన్నట్నుంచే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమని.. లక్షల్లో జనం వస్తున్నారని ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక నిన్నేమో.. విశాఖలో ఈ వేడుకలు మహ గొప్పగా జరిగిపోతున్నాయని.. రోజంతా వైసీపీ వాళ్లను రోజంతా ఒక ఆట ఆడుకున్నారు. ఈ రోజు కూడా ఆ ఒరవడి కొనసాగుతోంది. అందుకే ఎన్నికలు అయిపోయాక, ఫలితాలు రావడానికి ముందు వైసీపీ వాళ్లు మరీ అంత అతి చేయాల్సింది కాదని.. ఫలితంగా ఇప్పుడు ఈ ఎగతాళిని ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 10, 2024 4:32 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…