ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి ముందు విజయంపై ఇటు కూటమి, అటు వైసీపీ ధీమాతోనే కనిపించాయి. ఐతే ధీమా వ్యక్తం చేయడం వరకు ఓకే కానీ.. వైసీపీ వాళ్లు ఒక అడుగు ముందుకు వేసి విశాఖపట్నంలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని.. అందుకు ముహూర్తం కూడా పెట్టేశారని.. వేదిక కూడా సిద్ధమైందని.. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయని తెగ ప్రచారం చేసుకున్నారు.
ఇంత అతి అవసరమా, రేప్పొద్దున ఫలితాలే తేడా కొడితే ట్రోలింగ్ తప్పదు అనే హెచ్చరికలు వచ్చినా వాళ్లు పట్టించుకోలేదు. చివరికి వాళ్లు అనుమానాలే నిజమయ్యాయి. వైసీపీ ఓడిపోయింది. అది కూడా మామూలుగా కాదు.. చిత్తు చిత్తుగా. దీంతో ఫలితాలు వెల్లడైన కొన్ని గంటల నుంచే వైసీపీ మీద ట్రోలింగ్ ఒక రేంజిలో జరుగుతోంది.
ముఖ్యంగా విశాఖపట్నంలో తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం గురించి వైసీపీ ఇంతకుముందు చేసిన హడావుడి మీద జరుగుతున్న ట్రోలింగ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. జగన్ సహా వైసీపీ ముఖ్య నేతలు విశాఖలో ప్రమాణ స్వీకారం గురించి చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టిన పోస్టులన్నీ బయటికి తీసి.. కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు.
మొన్నట్నుంచే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు సిద్ధమని.. లక్షల్లో జనం వస్తున్నారని ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఇక నిన్నేమో.. విశాఖలో ఈ వేడుకలు మహ గొప్పగా జరిగిపోతున్నాయని.. రోజంతా వైసీపీ వాళ్లను రోజంతా ఒక ఆట ఆడుకున్నారు. ఈ రోజు కూడా ఆ ఒరవడి కొనసాగుతోంది. అందుకే ఎన్నికలు అయిపోయాక, ఫలితాలు రావడానికి ముందు వైసీపీ వాళ్లు మరీ అంత అతి చేయాల్సింది కాదని.. ఫలితంగా ఇప్పుడు ఈ ఎగతాళిని ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on June 10, 2024 4:32 pm
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…