Political News

ఎగ్జిట్ ఫ‌లితంపై పీకే స్పైసీ రియాక్ష‌న్.. !

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తున్నారు? ఎవ‌రు ఓడుతున్నార‌నే విష‌యంపై తాజాగా వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్‌ అంచ‌నాల‌పై రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిషోర్‌.. చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

గ‌తంలో ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మిఅధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌న్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని కూడా చెప్పారు. ఆయ‌న‌కు 400 సీట్లు రావ‌డం క‌ష్ట‌మేన‌ని.. 350 లోపు ఖ‌చ్చితంగా వ‌స్తాయ‌ని అన్నారు.

తాజాగా పీకే చెప్పిన గ‌తం అంచ‌నాల మేర‌కే.. జాతీయ మీడియాచానెళ్లు.. అంచ‌నాల‌ను ప్ర‌క‌టించారు. ప్ర‌తి స‌ర్వే కూడా.. జాతీయ స్థాయిలో 320-350-370 మ‌ధ్య మోడీ నేతృత్వంలోన ఎన్డీయే కూట‌మి సీట్లు ద‌క్కించుకుంటుంద‌ని తెలిపాయి. ఇదే స‌మ‌యంలో ఇండియా కూట‌మికి 110-195 మ‌ధ్య‌లో వ‌స్తాయ‌ని మెజారిటీ సంస్థ‌లు చెప్పాయి. ఇదే విష‌యాన్ని ఉటంకిస్తూ.. ప్ర‌శాంత్ కిషోర్ సీరియ‌స్‌గా స్పందించారు.

“వచ్చే ఎన్నికలకు సంబంధించి పార్టీలు, రాజ‌కీయాలు అనే చర్చ ఎవ‌రైనా తీసుకు వచ్చినప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండండి. పనికిమాలిన చర్చలు, న‌కిలీ జర్నలిస్టులు(క‌ర‌ణ్ థాప‌ర్‌ను ప‌రోక్షంగా ఉద్దేశించి), పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు(కాంగ్రెస్ నేత‌లు), స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో వేలు పెట్టి విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు” అని ఘాటుగానే స్పందించారు..

This post was last modified on June 2, 2024 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago