వైసీపీ అధినేత, సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే షాక్ తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఈ సారి ఓటమి తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జగన్ను కలవరపెడుతోందని తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్కు సొంతగడ్డపైనే భంగపాటు కలిగే అవకాశముంది.
ఈ ఎన్నికల్లో విజయం కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం అంజాద్ బాషాకు ఓటమి తప్పేలా లేదు. ఈ ఎన్నికలను ఆయన లైట్గా తీసుకోవడంతో గట్టి దెబ్బ పడే అవకాశముందని అంటున్నారు. ఆయన తీరుపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. అయిదేళ్లో అంజాద్ బాషా, ఆయన కుటుంబ సభ్యులు అడ్డగోలుగా దోచుకున్నారని, కానీ ఎన్నికల్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదని పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆయన తమ్ముడి వైఖరితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ను కూడా చూడకుండా ఈ సారి అంజాద్ను ఓడించడమే లక్ష్యంగా జనాలు ఉన్నారని తెలిసింది. ఆయనపై వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరింది. ముస్లింలలోనూ అంజాద్పై వ్యతిరేకత ఉందని టాక్. ఎప్పటినుంచో అంజాద్ కారణంగా పార్టీకి నష్టం జరుగుతోందని జగన్కు వైసీపీ నాయకులు ఎంత చెప్పినా పట్టించుకోలేదని తెలిసింది. 2014, 2019 ఎన్నికల్లో అంజాద్ గెలిచారు. ఈ సారి టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవి రెడ్డి, కాంగ్రెస్ నుంచి అస్జల్ అలీఖాన్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ముస్లిం లీడర్ కావడం, ఇక టీడీపీ నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కావడంతో వైసీపీకి పరాజయమే మిగులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on May 10, 2024 10:41 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…