ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ, కూటమి పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిన్న కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్.. కూటమి నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ వ్యాఖ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహించిన వారాహి విజయ భేరి సభలో జగన్ పై పవన్ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజల ఆస్తి పత్రాలపై జగన్ కు ఉన్న హక్కు ఏంటి? పట్టాదారు పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు వేసుకున్నారు అని పవన్ నిలదీశారు.
ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వైసీపీ అమలు చేస్తోందని, వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని జోస్యం చెప్పారు. భారత పాస్ పోర్టుపై ప్రధాని మోడీ ఫొటో ఉండదని, కానీ, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉండాలని పవన్ స్పష్టం చేశారు.
జగన్ పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే ఆ మేనిఫెస్టో రూపొందించామని అన్నారు. తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. గత పదేళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేసినా, ఎన్నో మాటలన్నా ప్రజల కోసం భరించానని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా పడతానని పవన్ అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, ప్రజలే గెలవాలని ఆకాంక్షించారు. వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. ఈ ఎన్నికల తర్వాత వైసీపీకి జగన్ పొలిటికల్ హాలిడే ప్రకటించాల్సిందేనని సెటైర్లు వేశారు.
This post was last modified on May 1, 2024 7:20 pm
మార్చి నుంచి ఆగస్టుకి విడుదల తేదీ వాయిదా వేసుకున్న నాని ది ప్యారడైజ్ ఖచ్చితంగా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా…
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…