Political News

ప్రధానిగా మోడీకి అర్హత లేదని జగన్ అంటారేమో: రఘురామ

వైసీపీకి స్వపక్షంలో విపక్షంలో మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేయాలంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి…రాజ్యాంగంలో షెడ్యూల్ 10 చదవాలని అన్నారు. సీఎం జగన్ గారు నిత్యం పరితపించే ఇంగ్లిష్ లోనే షెడ్యూల్ 10 ఉందని, మాతృభాష తెలుగును కాపాడాలన్నందుకే తనను డిస్ క్వాలిఫై చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ప్రధాని మోడీ కూడా అన్నారని….కాబట్టి ప్రధానిగా ఉండే అర్హత మోడీకి లేదని జగన్ అంటారేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. విప్ ధిక్కరిస్తే, పార్టీని రెండు ముక్కలు చేయాలని చూస్తే తప్ప..తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, ఇసుక దోపిడీ, దేవాదయ శాఖ భూములను అమ్ముకోవాలనుకోవడం వంటి అంశాలపై ప్రశ్నిస్తే అనర్హత వేటు వేయరని అన్నారు. జగన్ గారు చల్లగా ఉండాలని, ప్రభుత్వాన్ని కాపాడుతున్నానని అది అర్థం చేసుకోకుండా కొందరు ఆయనకు, తనకు మధ్య గ్యాప్ పెంచుతున్నారని అన్నారు.

తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని రఘురామ అన్నారు. కావాలంటే తనను బహిష్కరించి చూడాలని, ఎలాగైనా కమిటీ చైర్మన్ గా తానే కొనసాగుతానని చాలెంజ్ చేశారు. చట్ట ప్రకారం తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, తన వాగ్ఢాటితో కమిటీ చైర్మన్ పదవి సాధించుకున్నానని చెప్పారు.

పార్లమెంటులో పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే దక్కుతున్నాయని విమర్శించారు. తనపై అనర్హత వేటు వేయాలని మిథున్ రెడ్డి కోరుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా అని ప్రశ్నించారు. లోక్ సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్లకు మించి రావని, మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on September 15, 2020 8:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

51 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago