Political News

ప్రధానిగా మోడీకి అర్హత లేదని జగన్ అంటారేమో: రఘురామ

వైసీపీకి స్వపక్షంలో విపక్షంలో మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేయాలంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి…రాజ్యాంగంలో షెడ్యూల్ 10 చదవాలని అన్నారు. సీఎం జగన్ గారు నిత్యం పరితపించే ఇంగ్లిష్ లోనే షెడ్యూల్ 10 ఉందని, మాతృభాష తెలుగును కాపాడాలన్నందుకే తనను డిస్ క్వాలిఫై చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ప్రధాని మోడీ కూడా అన్నారని….కాబట్టి ప్రధానిగా ఉండే అర్హత మోడీకి లేదని జగన్ అంటారేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. విప్ ధిక్కరిస్తే, పార్టీని రెండు ముక్కలు చేయాలని చూస్తే తప్ప..తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, ఇసుక దోపిడీ, దేవాదయ శాఖ భూములను అమ్ముకోవాలనుకోవడం వంటి అంశాలపై ప్రశ్నిస్తే అనర్హత వేటు వేయరని అన్నారు. జగన్ గారు చల్లగా ఉండాలని, ప్రభుత్వాన్ని కాపాడుతున్నానని అది అర్థం చేసుకోకుండా కొందరు ఆయనకు, తనకు మధ్య గ్యాప్ పెంచుతున్నారని అన్నారు.

తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని రఘురామ అన్నారు. కావాలంటే తనను బహిష్కరించి చూడాలని, ఎలాగైనా కమిటీ చైర్మన్ గా తానే కొనసాగుతానని చాలెంజ్ చేశారు. చట్ట ప్రకారం తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, తన వాగ్ఢాటితో కమిటీ చైర్మన్ పదవి సాధించుకున్నానని చెప్పారు.

పార్లమెంటులో పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే దక్కుతున్నాయని విమర్శించారు. తనపై అనర్హత వేటు వేయాలని మిథున్ రెడ్డి కోరుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా అని ప్రశ్నించారు. లోక్ సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్లకు మించి రావని, మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

This post was last modified on September 15, 2020 8:03 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

3 mins ago

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

19 mins ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

21 mins ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

23 mins ago

అప్పుడు బాలీవుడ్‌పై విమర్శలు.. ఇప్పుడేమో

రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…

5 hours ago

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

7 hours ago