Political News

ఏపీలో కొత్త పన్నుల ఆదాయం.. 15 వేలు కోట్లు !!

కరోనా సంక్షోభ సమయంలోనూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశంసిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఖజానా నింపుకునేందుకు ప్రజలపై సైలెంట్ గా పన్నుబాదుడు విధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా సైలెంట్ గా జగన్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేశారని తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు వీటికి అదనమని, త్వరలోనే రవాణాశాఖలో పన్నులు పెంచాలనే యోచనలోనూ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా సుమారు రూ. 400 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ పెంపు ద్వారా అదనంగా రూ.30 కోట్లు అదనపు ఆదాయం రాబట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. భవిష్యత్తులో ఈ తరహాలోనే మరో 3 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసి ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

ఓ వైపు సంక్షేమ పథకాలు…మరోవైపు కరోనా విపత్తు నిర్వహణ…వెరసి ఏపీ సర్కార్ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుందని, వాటి నుంచి గట్టెంకేందుకే జగన్ సర్కార్ అవకాశమున్న చోటల్లా పన్నులు పెంచుకుంటూ పోతోందని విమర్శలు వస్తున్నాయి. అసలే ఆర్థిక లోటు ఉన్న ఏపీ ఖజానా…. కరోనా నేపథ్యంలో నిండుకుంది. ఏప్రిల్ తర్వాతి 4-5 నెలల్లో రాష్ట్ర ఖజానా దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది.

ఓ వైపు ఆదాయం లేక మరోవైపు కరోనా విపత్తు నిర్వహణకు ఖర్చు పెరగడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత…వంటి కారణాలతో నిధులకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.31వేల కోట్లు రుణాలు తీసుకుంది ఏపీ సర్కార్. దానికి అదనంగా మే నెల నుంచి ఇప్పటి వరకు రకరకాల పన్నుల పెంపు ద్వారా రూ.15 వేల కోట్లు రాబట్టింది. మే మొదటివారంలో 75 శాతం మద్యం ధరలు పెంపు ద్వారా రూ.13500 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.

జూన్ లో పెట్రో్ల్, డీజిల్ రేట్ల పెంపుతో రూ.600 కోట్లు, ఆగస్టులో భూముల ధరల పెంపుతో రూ.800 కోట్లు, వృత్తి పన్ను పెంపుతో రూ.161 కోట్లు రాబట్టింది ఏపీ సర్కార్. తాజాగా గ్యాస్ పై వ్యాట్ 10 శాతం పెంచడం ద్వారా రూ.300 కోట్ల అదనపు ఆదాయం రాబట్టేందుకు సిద్ధమైంది. పన్నుల రూపంలోనే మరో 3 వేల కోట్ల రూపాయలు ఆదాయం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

This post was last modified on September 15, 2020 7:58 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రామాయణం లీక్స్ మొదలుపెట్టేశారు

ఇంకా అధికారికంగా ప్రకటించకుండానే బాలీవుడ్ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణం సినిమా తాలూకు షూటింగ్ లీక్స్…

31 mins ago

వకీల్ సాబ్ టైమింగ్ భలే కుదిరింది

ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం…

4 hours ago

కొత్త సినిమాలొచ్చినా నీరసం తప్పలేదు

కొత్త సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ కు ఎలాంటి ఉత్సాహం కలగడం లేదు. కారణం కనీసం యావరేజ్ అనిపించుకున్నవి కూడా లేకపోవడమే.…

5 hours ago

చెల్లి చీర పై జగన్ కామెంట్ బ్యాక్ ఫైర్…

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్.. ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. "సొంత చెల్లెలు క‌ట్టుబొట్టుతో బాగుండాల‌ని స‌గ‌టు…

6 hours ago

క‌ల్కి టీం చెప్ప‌బోయే క‌బురిదేనా?

ఇప్పుడు ఇండియా మొత్తం ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తోంది. అదే.. పాన్ ఇండియా…

6 hours ago

ఫ్యామిలీ స్టార్‌కు ఇంకో రౌండ్ బ్యాండ్

ఈ మ‌ధ్య కాలంలో విప‌రీతంగా సోష‌ల్ మీడియా ట్రోలింగ్‌కు గురైన సినిమా అంటే.. ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఈ…

6 hours ago