చంద్రబాబు స్పీచుల్లో మొత్తం మారిపోయింది. గతంలో చెప్పిందే చెప్పి బోర్ కొట్టించే చంద్రబాబు… ఇపుడు ప్రతి చోటా కొత్త సబ్జెక్టు, కొత్తపంచులతో అలరిస్తున్నారు. ఈమార్పుపై కేడర్ ఫుల్ హ్యాపీ. విశ్లేషకులు కూడా చంద్రబాబులో రావల్సిన మార్పు ఇదే అంటున్నారు. తాజాగా ఈరోజు రెండు మూడు చోట్ల చంద్రబాబు మాట్లాడితే అన్ని చోట్లా సబ్జెక్ట్ మారింది. ఉదాహరణకు ఒక చోట బాబు మాట్లాడుతూ సీఎం జగన్ ఈ రోజు నాలుగు టీవీలను పగలగొడతాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి పార్టీల ఉమ్మడి సభలకు వస్తున్న జనాలను చూసి.. జగన్కు నిద్ర పట్టడం లేదన్నారు. రాజధాని ప్రాంతమైన తాడికొండలో నిర్వహించిన సభకు జనం పోటెత్తారని.. వీరిని చూసి జగన్కు నిద్ర పట్టదని, అదేవిధంగా ఫ్రెస్ట్రేషన్ తట్టుకోలేక నాలుగు టీవీలను కూడా పగలగొట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలు పట్టుకుని సైకిల్ ఎక్కాలని సూచించారు. అదే చేత్తో ఓ గ్లాసును, కమలం పువ్వును కూడా తీసుకోవాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లాలని అన్నారు. మార్గమధ్యంలో దప్పిక వేస్తే.. గాజు గ్లాసుతో నీళ్లు తాగాలని.. టీ తాగాలని అనిపిస్తే.. అదే గ్లాసుతో టీ కూడా తాగాలన్నారు. సైకిల్ స్పీడు పెంచి.. తొక్కుకుంటూ పోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఎవరైనా అడ్డు వస్తే.. వారి గుండెల్లో గాజు గ్లాసును గుచ్చాలని పిలుపునిచ్చారు. మిగతాది తాను చూసుకుంటానని చంద్రబాబు సూచించారు.
ఈ దఫా అసెంబ్లీలో తొలి అడుగు తనదేనని చంద్రబాబు అన్నారు. రెండేళ్ల కిందట తాను అసెంబ్లీలో అడుగు పెట్టబోనని వాగ్దానం చేశానని గుర్తు చేశారు. కౌరవ సభలో ఉండనని.. గౌరవ సభలోనే ఉంటానని ఆనాడు శపథం చేసినట్టు తెలిపారు. వచ్చేది కూటమి ప్రభుత్వమేనని.. కాబట్టి గౌరవ సభ ఏర్పాటవుతుందని చెప్పారు. ఆ గౌరవ సభలో తానే తొలి అడుగు వేస్తానని చెప్పారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే..జూన్ 4వ తేదీ(పోలింగ్ రిజల్ట్ వచ్చే రోజు) కోసం ఎదురు చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు.
కాగా.. వైసీపీ సభలకు పెద్ద ఎత్తున డబ్బులు పారిస్తున్నారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఒక్కొక్క సభకు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఏపీఎస్ ఆర్టీసీని పూర్తిగా వైసీపీ ఆర్టీసీగా మార్చేశారని.. ఎక్కడ సభ జరిగినా ఆర్టీసీ బస్సులు పంపిస్తున్నారని.. దీంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ ఆగ్రహం.. ఈ ఆక్రోశం.. మే 13న జరిగేఎన్నికల్లో బటన్లను నొక్కడం ద్వారా చూపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
This post was last modified on April 13, 2024 10:53 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…