తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించిన తమిళ హీరో సిద్దార్థ్.. కొంచెం ఔట్ స్పోకెన్ అన్న సంగతి తెలిసిందే. స్టేజ్ల మీద, ఇంటర్వ్యూల్లో మాట్లాడేటపుడు కొంచెం ఓపెన్గా ఉంటాడు. ఎవరి మీదైనా కౌంటర్లు వేయడానికి వెనుకాడడు. ఏదైనా విషయంలో బాధ పడ్డా ఆ బాధను దాచుకోడు.
తన చివరి సినిమా చిత్తా తెలుగు వెర్షన్ చిన్నాను తెలుగులో రిలీజ్ చేద్దామంటే థియేటర్లు దొరకలేదంటూ స్టేజ్ మీద ఆవేదన స్వరంతో మాట్లాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ఓ మోస్తరుగా ఆడి వెళ్లిపోయింది. కానీ మంచి సినిమాగా మాత్రం పేరు తెచ్చుకుంది. చిన్నపిల్లల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే ఆ సినిమాను అందరూ చూసి తట్టుకోలేరన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయమై ఒక అవార్డుల కార్యక్రమంలో సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చిత్తా సినిమాను చూడడం కష్టమని ఒక్క మహిళ కూడా తనతో కానీ.. దర్శకుడు అరుణ్తో కానీ చెప్పలేదని.. కానీ మగాళ్లు మాత్రం చాలామంది ఈ సినిమా చూసి తట్టుకోవడం కష్టమని కామెంట్లు చేశారని సిద్దార్థ్ అన్నాడు. తమ సినిమా విషయంలో ఇలా మాట్లాడిన వాళ్లే మృగం అనే సినిమాను మాత్రం చూస్తారని.. కానీ వాళ్లకు చిత్తా సినిమా మాత్రం డిస్టర్బింగ్గా అనిపిస్తుందని సెటైరిగ్గా మాట్లాడాడు సిద్దార్థ్. చిత్తా లాంటి సినిమాను చూసి డిస్టర్బింగ్గా ఉందని అనడం సిగ్గు చేటని… త్వరలోనే ప్రేక్షకులు మారుతారని ఆశిస్తున్నానని సిద్దార్థ్ వ్యాఖ్యానించాడు.
మృగం అంటూ తమిళంలో చెప్పాడు కానీ.. నిజానికి అతను కౌంటర్ వేసింది యానిమల్ మూవీ గురించే. ఈ సినిమాను వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పలు రకాలుగా విమర్శించారు. ఇప్పుడు ఈ జాబితాలో సిద్దార్థ్ కూడా చేరాడు. అతడి వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
This post was last modified on April 13, 2024 10:52 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…