ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నడిపించే వైఎస్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తార స్థాయికి చేరుతున్నాయి. సీఎం జగన్కు వ్యతిరేకంగా ఆయన సొంత సోదరి షర్మిళ, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని జగనే కాపాడుతున్నాడని, వివేకాను చంపించిన అవినాష్కు మద్దతిస్తారా న్యాయం కోసం పోరాడుతున్న తన వైపు నిలబడతారా అంటూ షర్మిళ ఎన్నికల ప్రచారంలో కొంగు చాచి ఓటర్లను అడగడం చర్చనీయాంశంగా మారింది. దీంతో జగన్, షర్మిళల మేనత్త.. వైఎస్ సోదరి విమలారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. షర్మిళ, సునీతలను తీవ్రంగా విమర్శించింది. అవినాష్ రెడ్డి అమాయకుడని, అతడి మీద నిందలు వేయొద్దని.. షర్మిళ, సునీత నాశనమైపోతారని ఆమె వ్యాఖ్యానించింది.
విమలా రెడ్డి వ్యాఖ్యలపై షర్మిళ కూడా కొంచెం తీవ్రంగానే స్పందించింది. తాము ఆధారాలతోనే మాట్లాడుతున్నామని.. సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొన్న విషయాలనే ఎత్తి చూపుతూ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే అతణ్ని విమలా రెడ్డి ఎందుకు వెనకేసుకు వస్తోందని షర్మిళ ప్రశ్నించింది. ప్రతిపక్షంలో ఉండగా వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిన జగన్.. అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దని ఎందుకు చెప్పాడని షర్మిళ అడిగింది.
వివేకా హత్య కేసులో తనను ఇరికిస్తే అవినాష్ బీజేపీలోకి పోతాడని ఎందుకు జగన్ అన్నాడో చెప్పాలని ఆమె ప్రశ్నించింది. అంతే కాక విమలా రెడ్డి తనయుడికి జగన్ కొన్ని కాంట్రాక్టులు ఇచ్చి ఆర్థికంగా బలపడేలా చేశాడని.. అందుకే తన మేనత్త జగన్కు అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని.. వయసు మీద పడడం వల్ల, ఎండల వల్ల వివేకా తనకు చేసిందంతా మరిచిపోయి తమ మేనత్త ఇప్పుడు మరోలా మాట్లాడుతోందని షర్మిళ ఎద్దేవా చేసింది.
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…