Political News

మేన‌త్త గుట్టు బ‌య‌ట‌పెట్టిన ష‌ర్మిళ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌గా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని న‌డిపించే వైఎస్ కుటుంబంలో అంత‌ర్గ‌త విభేదాలు తార స్థాయికి చేరుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఆయ‌న సొంత సోద‌రి ష‌ర్మిళ‌, బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వైఎస్ వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని జ‌గ‌నే కాపాడుతున్నాడ‌ని, వివేకాను చంపించిన అవినాష్‌కు మ‌ద్దతిస్తారా న్యాయం కోసం పోరాడుతున్న త‌న వైపు నిల‌బ‌డ‌తారా అంటూ ష‌ర్మిళ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కొంగు చాచి ఓట‌ర్ల‌ను అడ‌గ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో జ‌గ‌న్, ష‌ర్మిళ‌ల మేన‌త్త‌.. వైఎస్ సోద‌రి విమ‌లారెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి.. ష‌ర్మిళ‌, సునీత‌ల‌ను తీవ్రంగా విమ‌ర్శించింది. అవినాష్ రెడ్డి అమాయ‌కుడ‌ని, అత‌డి మీద నింద‌లు వేయొద్ద‌ని.. ష‌ర్మిళ‌, సునీత నాశ‌న‌మైపోతార‌ని ఆమె వ్యాఖ్యానించింది.

విమ‌లా రెడ్డి వ్యాఖ్య‌ల‌పై ష‌ర్మిళ కూడా కొంచెం తీవ్రంగానే స్పందించింది. తాము ఆధారాల‌తోనే మాట్లాడుతున్నామ‌ని.. సీబీఐ ఛార్జ్‌షీట్లో పేర్కొన్న విష‌యాల‌నే ఎత్తి చూపుతూ అవినాష్ రెడ్డి మీద ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తుంటే అత‌ణ్ని విమ‌లా రెడ్డి ఎందుకు వెన‌కేసుకు వ‌స్తోంద‌ని ష‌ర్మిళ ప్ర‌శ్నించింది. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా వివేకా హ‌త్య కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని డిమాండ్ చేసిన జ‌గ‌న్.. అధికారంలోకి వ‌చ్చాక సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌ని ఎందుకు చెప్పాడ‌ని ష‌ర్మిళ అడిగింది.

వివేకా హ‌త్య కేసులో త‌న‌ను ఇరికిస్తే అవినాష్ బీజేపీలోకి పోతాడ‌ని ఎందుకు జ‌గ‌న్ అన్నాడో చెప్పాల‌ని ఆమె ప్ర‌శ్నించింది. అంతే కాక విమ‌లా రెడ్డి త‌న‌యుడికి జ‌గ‌న్ కొన్ని కాంట్రాక్టులు ఇచ్చి ఆర్థికంగా బ‌ల‌ప‌డేలా చేశాడ‌ని.. అందుకే త‌న మేన‌త్త జ‌గ‌న్‌కు అనుకూలంగా, త‌మ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతోంద‌ని.. వయ‌సు మీద ప‌డ‌డం వ‌ల్ల‌, ఎండ‌ల వ‌ల్ల వివేకా త‌న‌కు చేసిందంతా మ‌రిచిపోయి త‌మ మేన‌త్త ఇప్పుడు మరోలా మాట్లాడుతోంద‌ని ష‌ర్మిళ ఎద్దేవా చేసింది.

This post was last modified on April 13, 2024 10:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

6 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

26 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago