త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల లోక్ సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాష్ ను ఓడించేందుకే కడప బరిలో దిగుతున్నానని షర్మిల షాకింగ్ ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం వల్ల వైఎస్ కుటుంబం చీలుతుందని తెలిసినా పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనుకేసుకొస్తున్నారని, నా అనుకున్న వాళ్ళను ఆయన నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలకు జగనన్న దన్నుగా నిలిచాడని, చిన్నాన్న హంతకులను కాపాడుతున్నాడని ఆరోపించారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ హంతకుడని, కడపలో మళ్ళీ ఆయన గెలవకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును వైసీపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుందని ఆరోపించారు. తాను కడప ఎంపీగా పోటీ చేయాలన్నది చిన్నాన్న వివేకా చిరకాల కోరిక అని, అందుకోసమే కడప లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నానని షర్మిల ప్రకటించారు. న్యాయం కోసం పోరాడుతున్న తనవైపు ప్రజలు నిలబడి ఆశీర్వదించాలని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 2, 2024 10:59 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…