త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల లోక్ సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాష్ ను ఓడించేందుకే కడప బరిలో దిగుతున్నానని షర్మిల షాకింగ్ ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం వల్ల వైఎస్ కుటుంబం చీలుతుందని తెలిసినా పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనుకేసుకొస్తున్నారని, నా అనుకున్న వాళ్ళను ఆయన నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలకు జగనన్న దన్నుగా నిలిచాడని, చిన్నాన్న హంతకులను కాపాడుతున్నాడని ఆరోపించారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ హంతకుడని, కడపలో మళ్ళీ ఆయన గెలవకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును వైసీపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుందని ఆరోపించారు. తాను కడప ఎంపీగా పోటీ చేయాలన్నది చిన్నాన్న వివేకా చిరకాల కోరిక అని, అందుకోసమే కడప లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నానని షర్మిల ప్రకటించారు. న్యాయం కోసం పోరాడుతున్న తనవైపు ప్రజలు నిలబడి ఆశీర్వదించాలని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on April 2, 2024 10:59 pm
కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు…
దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయకుడు అయినా.. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…
ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…