Political News

తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు!

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈడీ అధికారుల కస్టడీలో విచారణలో ఉన్న కేజ్రీవాల్ ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తీహార్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్ పై వెళ్లిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్రపుటలకెక్కారు. తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు క్రియేట్ చేశారు.

అయితే, కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తారా లేదంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వ్యవహారం పై కీలక ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ కేసులో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ నేత జాస్మిన్ అన్నారు. ఏడాదిన్నర క్రితం విజయ్ నాయర్ చెప్పిన స్టేట్మెంట్ను ఇప్పుడు ఎందుకు బయటకు బీజేపీ తెస్తుందో ప్రజలు గమనించాలని కోరారు.

మరోవైపు, జైల్లో చదువుకునేందుకు రామాయణం, భగవద్గీత ఏర్పాటు చేయాలని కోర్టుకు కేజ్రీవాల్ అభ్యర్థించారు. దాంతోపాటు జర్నలిస్టు నీరజా చౌదరి రాసిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకం అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

This post was last modified on April 2, 2024 2:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హీట్ పెంచేస్తున్న నభా.. శారీలోనూ ఇంత గ్లామరా?

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…

53 minutes ago

రామాయణ బృందం డిఫెండ్ అవుతోందా

అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…

3 hours ago

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

3 hours ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

4 hours ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

5 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

5 hours ago