ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈడీ అధికారుల కస్టడీలో విచారణలో ఉన్న కేజ్రీవాల్ ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తీహార్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్ పై వెళ్లిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్రపుటలకెక్కారు. తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు క్రియేట్ చేశారు.
అయితే, కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తారా లేదంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వ్యవహారం పై కీలక ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ కేసులో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ నేత జాస్మిన్ అన్నారు. ఏడాదిన్నర క్రితం విజయ్ నాయర్ చెప్పిన స్టేట్మెంట్ను ఇప్పుడు ఎందుకు బయటకు బీజేపీ తెస్తుందో ప్రజలు గమనించాలని కోరారు.
మరోవైపు, జైల్లో చదువుకునేందుకు రామాయణం, భగవద్గీత ఏర్పాటు చేయాలని కోర్టుకు కేజ్రీవాల్ అభ్యర్థించారు. దాంతోపాటు జర్నలిస్టు నీరజా చౌదరి రాసిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకం అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…