ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈడీ అధికారుల కస్టడీలో విచారణలో ఉన్న కేజ్రీవాల్ ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తీహార్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్ పై వెళ్లిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్రపుటలకెక్కారు. తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు క్రియేట్ చేశారు.
అయితే, కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తారా లేదంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వ్యవహారం పై కీలక ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ కేసులో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ నేత జాస్మిన్ అన్నారు. ఏడాదిన్నర క్రితం విజయ్ నాయర్ చెప్పిన స్టేట్మెంట్ను ఇప్పుడు ఎందుకు బయటకు బీజేపీ తెస్తుందో ప్రజలు గమనించాలని కోరారు.
మరోవైపు, జైల్లో చదువుకునేందుకు రామాయణం, భగవద్గీత ఏర్పాటు చేయాలని కోర్టుకు కేజ్రీవాల్ అభ్యర్థించారు. దాంతోపాటు జర్నలిస్టు నీరజా చౌదరి రాసిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకం అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
This post was last modified on April 2, 2024 2:03 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…