రాజకీయాల్లో వ్యూహాలు ఉండొచ్చు.. ప్రతి వ్యూహాలు కూడా ఉండొచ్చు. కానీ, రాజకీయాల్లో ఈ రెండింటికీ మించి చేసే పనులు మాత్రం జనాల నుంచి అంత ఆహ్వానం పలికేలా ఉండకపోవచ్చు. ఎందుకంటే.. నాయకుల కంటే కూడా.. ప్రజలే చాలా విజ్ఞలు. ఇది ఏపీలో అనేక సందర్భాల్లో రుజువైంది. కనీసం తెలం గాణలో అయినా.. అంతో ఇంతో మార్పు కనిపిస్తుందేమో కానీ.. ఏపీలో అలాంటి ది కనిపించదు. ఇక, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కూడా జరుగుతున్న జంపింగుల విషయం చర్చకు వస్తోంది.
వాస్తవానికి ఇప్పటికే.. అన్ని పార్టీలు టికెట్లు ప్రకటించాయి. కానీ, జనసేనలో మాత్రం ఇంకా ఈ టికెట్ల పందేరం చేయాల్సి ఉంది. అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా.. ఇతర పార్టీల నాయకు లను చేర్చుకుంటున్నారు. ఇది తప్పుకాకపోవచ్చు. కానీ, వారికి టికెట్ కేటాయించడమే ఇప్పుడు అసలు సిసలు సమస్యగా మారింది. తాజాగా అవనిగడ్డ టికెట్ ఖాళీ పెట్టారు. వాస్తవానికి.. దీనిని పార్టీలో ఉన్న ఇద్దరు కీలక నేతలకు కేటాయించే అవకాశం ఉంది. కానీ… పవన్ అలా చేయలేదు.
నాన్చి.. నాన్చి.. ఇప్పుడు టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చిన మండలిబుద్ధ ప్రసాద్కు ఇచ్చేస్తున్నారు. ఈ రోజో రేపో దీనిపై ప్రకటన కూడా రానుంది.బుద్ధ ప్రసాద్ మంచి వ్యక్తే కావొచ్చు.. కానీ, పార్టీలో ఇప్పటి వర కు జెండా మోసిన వారి పరిస్థితి ఏంటి? ఇదీ.. ఇప్పుడు భీమవరం నుంచి అవనిగడ్డ వరకు జరుగుతున్న చర్చ. బలంగా ఉన్న నియోజకవర్గాలను ఇతర పార్టీలకు వదులుకుని.. బలహీనంగా ఉన్న నియోజకవ ర్గాల్లో పొరుగు పార్టీల నేతలను తీసుకుని వారికి టికెట్ ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
అయితే.. దీనిని ఎవరూ ప్రశ్నించరాదని.. తమ అధినేతే ఫైనల్ అని.. నాగబాబు వంటి వారు చెప్పుకోవ చ్చు. కానీ, రేపు సమాధానం చెప్పాల్సింది ప్రజలకు, ఇలానే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ప్రయోగాలు చేశారు. కానీ, ఏమైందో అందరికీ తెలిసిందే. తెలంగాణలో మాదిరిగా.. జంపింగులకు పట్టం కట్టే పరిస్థితి ఏపీలో పెద్దగా రాలేదు. స్తానికంగా బలంగా ఉండి..నిజమైన కారణంగా పార్టీ మారిన వారికి మాత్రమే ప్రజలు పట్టం కట్టిన సందర్భం ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. జనంలో జనసేన టాక్ అయితే.. సన్నగిల్లుతుండడం గమనార్హం.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…