Political News

ప‌వ‌న్ ను ఓడించ‌బ్బా: జ‌న‌సేన నేత‌కు జ‌గ‌న్ టార్గెట్‌

రాజ‌కీయాల్లో జంపింగులు కొత్త‌కాదు. పైగా ఎన్నిక‌ల‌ స‌మ‌యంలో నాయ‌కులు క‌ప్ప‌దాట్లు.. గోడ‌దూకుళ్లు కూడా స‌హ‌జ‌మే. అయితే.. చిత్రం ఏంటంటే.. జ‌న‌సేన‌లో చేరిన రెండు వారాల్లోనే కీల‌క‌మైన నాయ‌కుడు జంప్ చేయ‌డం. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ ప‌నితీరును కూడా విమ‌ర్శించ‌డం. వాస్త‌వానికి ప‌దేళ్లుగా ఉన్న నాయ‌కులు కూడా తాజా ఎన్నిక‌ల్లో చాలా మంది టికెట్లు తెచ్చుకోలేక పోయారు. అయిన‌ప్ప‌టికీ.. వారు పార్టీ లైన్‌ను దాటేందుకు సాహసించ‌లేదు. కానీ, తాజాగా రెండు వారాల కింద‌ట పార్టీలో చేరిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గంటా న‌ర‌హ‌రి.. మాత్రం జంప్ చేశారు.

బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన సీమ నేత‌ గంటా న‌ర‌హ‌రి తాజాగా సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో కండువా క‌ప్పుకొన్నారు. రెండు వారాల‌కే జ‌న‌సేన నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశం అయింది. “జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట నిల‌బెట్టుకోలేర‌ని చాలా త్వ‌ర‌గా గ్ర‌హించా. ఆ పార్టీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్ నాశనం అవుతుంది. అందుకే బ‌య‌ట‌కు వ‌చ్చా. నేను చెప్పేది ఒక్క‌టే పార్టీలో ఉన్న‌వారు ఇప్ప‌టికైనా తెలుసుకోండి. భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకోవ‌ద్దు” అని న‌ర‌హ‌రి వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్ప‌టికే అభ్య‌ర్థుల‌ను పూర్తి స్థాయిలో ప్ర‌క‌టించేసిన నేప‌థ్యంలో వైసీపీలో నూన‌ర‌హ‌రికి టికెట్ లేదు.

ఎవ‌రీ న‌ర‌హ‌రి!

పారిశ్రామిక‌వేత్త అయిన గంటా న‌ర‌హ‌రి దివంగ‌త టీటీడీ చైర్మ‌న్ డీకే ఆదికేశ‌వులునాయుడికి స‌మీప బంధువు. క‌డ‌ప జిల్లా రాజంపేటలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఎదిగారు. అయితే.. ఆయ‌న‌కు స‌పోర్టు లేదు. ఈ నేప‌థ్యంలో 2022లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చంద్ర‌బాబు ఆయ‌న‌ను అప్ప‌టిక‌ప్పుడే.. రాజంపేట టీడీపీ పార్ల‌మెంట‌రీ అధ్య‌క్షుడిగా నియ‌మించారు. అప్ప‌ట్లోనే న‌ర‌హ‌రిని రాజంపేట పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. ప‌దిమందిలోనూ ఫీల్ గుడ్ నాయ‌కుడిగా ఎద‌గ‌డంతో ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌డం ఖాయ‌మ‌ని కూడా అనుకున్నారు.

వైసీపీకి కంచుకోట వంటి రాజంపేట‌లో టీడీపీని బ‌లోపేతం చేసేందుకు న‌ర‌హ‌రి.. బాగానే ఖ‌ర్చు చేశార‌ని అంటారు. అయితే.. బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకున్న త‌ర్వాత‌.. టీడీపీ వ్యూహం మారిపోయింది. దీనికితోడు.. రాజంపేట టికెట్‌ను బీజేపీ కోరుతోంది. దీనికి ముందే ఈ విష‌యం తెలుసుకున్న న‌ర‌హ‌రి.. టీడీపీని వ‌దిలేశారు. ఆవెంట‌నే ఫిబ్ర‌వ‌రి 11న ఆయ‌న జ‌న‌సేనే తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఆయ‌న వ్యూహం పొత్తులో భాగంగా జ‌న‌సేన రాజంపేట తీసుకుంటే.. తాను పోటీ చేయాల‌ని భావించారు. కానీ, జ‌న‌సేన పై కూడా ఈ టికెట్ కోసం ఒత్తిడి వ‌చ్చింది. దీంతో బీజేపీకే రాజంపేట టికెట్ వ‌దిలేశారు. ఈ నేప‌థ్యంలో తిరుప‌తి అసెంబ్లీ టికెట్ ఇస్తాన‌ని ప‌వ‌న్ హామీ ఇచ్చారు.

అయితే.. ఇక్క‌డ కూడా న‌ర‌హ‌రికి అవ‌కాశం ద‌క్క‌లేదు. వైసీపీ నుంచి వ‌చ్చిన‌ చిత్తూరు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులుకు తిరుప‌తి అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే న‌ర‌హ‌రి మ‌న‌స్తాపానికి గురై.. జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్పార‌ని తెలుస్తోంది. కాగా, పార్టీలో చేరిన న‌ర‌హ‌రికి.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పిఠాపురంలో ప‌నిచేయాల‌ని బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు స‌మాచారం. పిఠాపురంలో ప‌వ‌న్ పోటీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోఅక్క‌డ ఆయ‌న‌ను ఓడించాల‌నేది జ‌గ‌న్ ల‌క్ష్యం. దీంతో ప‌వ‌న్‌పై ఆయ‌న పార్టీకి చెందిన నాయ‌కుడినే ప్ర‌యోగించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 31, 2024 7:35 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా…

4 minutes ago

ప్ర‌శంస‌లేనా.. ఛాన్సులూ ఇస్తారా?

80, 90 ద‌శ‌కాల్లో వైభ‌వం చూసిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. స్వ‌త‌హాగా త‌మిళుడైన‌ప్ప‌టికీ.. తెలుగులోనే ఆయ‌న పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…

23 minutes ago

వరల్డ్ ఫేమస్ సింగర్… హఠాత్తుగా ఇండియాలో ఎందుకు?

గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్‌గా…

33 minutes ago

ఆర్టీసీ స‌మ్మె… అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. త‌ద్వారా ఉద్యోగాల‌కు పొంచి…

1 hour ago

నాయకుడు బయటికి వచ్చేది ఎప్పుడు

తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…

2 hours ago

ఆర్టీసీ డ్రైవర్ బలిదానం.. సీఎంకు పెద్ద పరీక్ష

తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…

2 hours ago