Political News

శ‌ర‌త్ చంద్రారెడ్డి నుంచి బీజేపీకి 52 కోట్ల విరాళం..

త‌మ‌కు అనుకూలంగా ఉండి.. తమ పార్టీకి విరాళాలు ఇచ్చిన‌వారు ఎలాంటి వారైనా.. బీజేపి వ‌దిలేస్తుందా? బీజేపీ ఇలానే రాజ‌కీయాలు చేస్తుందా? అంటే.. ఔన‌నే అంటున్నాయిరాజ‌కీయ ప‌క్షాలు. ప్రస్తుతం వెలుగు చూసిన సంచ‌ల‌న విష‌యం.. బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించేలా చేస్తోంది. ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల జ‌డివాన ప్రారంభ‌మైంది. ఢిల్లీనే కాదు.. దేశాన్ని సైతం కుదిపేసిన ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం కేసులో తాజాగా ఒక సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. ఈ కేసులో కొన్నాళ్ల కింద‌ట అప్రూవ‌ర్‌గా మారిన శ‌ర‌త్ చంద్రారెడ్డి.. బీజేపీకి 52 కోట్ల విరాళం ఇచ్చిన‌ట్టు తాజాగా వెల్ల‌డైంది.

ఇది రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు దారితీసింది. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్స్‌గా మారిన రెడ్డి రూ.52 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇందులో ఎక్కువ వాటా బీజేపీకే అందినట్టు ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా వెల్లడించింది. శరత్ చంద్రారెడ్డికి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసింది. గతేడాది నవంబర్‌లో లిక్కర్ పాలసీ కేసులో శరత్ అరెస్ట్ అయ్యారు. ఆ తరవాత ఆయన అప్రూవర్‌గా మారారు.

2021 ఏప్రిల్ నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలించగా ఈ విషయం తేలినట్టు కేంద్ర ఎన్నిక‌ల సంఘ‌మే స్పష్టం చేసింది. రూ.52 కోట్ల విలువైన బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసి బీజేపీకి భారీ మొత్తంలో డొనేట్ చేసినట్టు తెలిపింది. ఇందులో దాదాపు 66% మేర బీజేపీకి వెళ్లగా..మిగతా విరాళాలు బీఆర్ఎస్‌, టీడీపీల‌కు కూడా ముట్టిన‌ట్టు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 2022లో శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయిన ఐదు రోజుల తరవాత రూ.5 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్‌ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది.

నవంబర్ 10వ తేదీన అరెస్ట్ కాగా.. నవంబర్ 15న ఈ బాండ్స్‌ని కొనుగోలు చేసినట్టు ఈసీ డేటా వెల్లడించింది. నవంబర్ 21న‌ బీజేపీ వీటిని ఎన్‌క్యాష్ చేసుకుంది. 2023 జూన్‌లో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. నిజానికి ఆప్ మంత్రి అతిషి ఇప్పటికే ఇదే అంశాన్ని ప్రస్తావించారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకే నిధులు మళ్లాయని ఆరోపించారు. ఈ ఆరోపణలకు తగ్గట్టుగానే ఈసీ విడుదల చేసిన లెక్కల్లో అదే విషయం వెల్లడైంది.

2021 నవంబర్‌కి ముందు శరత్ చంద్రారెడ్డికి ఢిల్లీలో 5 జోన్స్‌లో లిక్కర్‌ వెంట్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి వచ్చిందని మంత్రి అతిషి వివరించారు. లిక్కర్ పాలసీ 2021 నవంబర్‌లో అమల్లోకి వచ్చింది. ఈ పాలసీ అమల్లో ఉన్నప్పుడే బీజేపీకి అరబిందో కంపెనీ నుంచి రూ.3 కోట్ల విరాళం వచ్చినట్టు అతిషి ఆరోపించారు. “శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కాసేపటికే శరత్ చంద్రారెడ్డికి బెయిల్ వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్‌ ద్వారా శరత్ బీజేపీకి రూ.4.5 కోట్ల విరాళం ఇచ్చాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తరవాత బీజేపీకి రూ.55 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ డబ్బంతా బీజేపీ బ్యాంక్ అకౌంట్‌కే నేరుగా వెళ్లింది” అని ఆమె ఆరోపించారు.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago